తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయంగా వెలిగిపోతుంది. ఆస్కార్ స్థాయిని కూడా తెలుగు సినిమా టచ్ చేసింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి చేరుకుంది. తెలుగు దర్శకులు హీరోలు కూడా ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తమ సినిమాలను రూపొందిస్తున్నారు. యావత్ ప్రపంచం మొత్తం మన సినిమాల కోసం ఎదురుచూస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు మన సినిమా స్థాయి ఎక్కడ ఉందో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా హీరో అయిపోయారు. పుష్ప మేనరిజమ్స్ గాని పుష్ప సాంగ్స్ గాని ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. క్రికెటర్స్ దగ్గర నుండి సామాన్యుల వరకు పుష్ప సినిమాని తమ ఓన్ చేసుకున్నారు.

పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఇటీవల జాతీయ అవార్డు కూడా వచ్చింది. తొలి జాతీయ అవార్డు పొందిన తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇప్పుడు పుష్ప2 షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు సుకుమార్ పుష్పా ని మించిన విధంగా పుష్ప2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల పైగానే ఈ సినిమాకి బడ్జెట్ కేటాయించినట్లుగా వినికిడి. జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో కీలకంగా వచ్చే జాతర పాట షూటింగ్ తెరకెక్కించారు. సుమారు 400 మంది డాన్సర్ లు ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిలిం సిటీ లో మూడు భారీ సెట్లు ఈ సాంగ్ కోసం నిర్మించారు. సుమారు పది రోజులపాటు ఈ సాంగ్ షూటింగ్ జరిగింది.

ఏకంగా ఈ సాంగ్ కోసం చిత్ర యూనిట్ పాతిక కోట్లు ఖర్చు చేశారనేది ఇండస్ట్రీ టాక్. ఒక్క సాంగ్ కోసమే పాతిక కోట్లు ఖర్చు చేస్తే సినిమాని ఏ రేంజ్ లో తీస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఆగస్టు 15 2024న పుష్ప2 సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న రికార్డలను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read:ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.
దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.
‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ సబ్టైటిల్స్తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్బర్గ్లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.