- చిత్రం : మట్టి కుస్తీ
- నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, మునీష్ కాంత్,
- నిర్మాత : విష్ణు విశాల్, రవితేజ (విష్ణు విశాల్ స్టూడియోస్, RT టీమ్వర్క్స్)
- దర్శకత్వం : చెల్ల అయ్యావు
- సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
- విడుదల తేదీ : డిసెంబర్ 2, 2022
స్టోరీ :
Matti Kusthi Telugu Movie Review: వీరా (విష్ణు విశాల్) ఎటువంటి లక్ష్యాలు లేకుండాఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తల్లితండ్రులు లేని విరని అతని మామయ్య పెంచుతాడు. అతని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినపుడు,తను పెళ్లి చేసుకోవాలంటే చదువుకోని అమ్మాయి అయ్యుండాలని, ఆమెకు పెద్ద జడ ఉండాలనే షరతులు పెడతాడు. కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) రెజ్లర్, స్వతంత్ర భావాలు కలిగి ఉంటుంది. నేషనల్ లెవల్ కుస్తీ పోటీల్లో పాల్గొనాలన్నదే ఆమె కల.

అయితే ఆమె తండ్రి అందుకు ఒప్పుకోడు. కుస్తీ పడే అమ్మాయి అని వచ్చిన సంబంధమల్లా చెడిపోతుంది. ఆ తరువాత కీర్తి బాబాయ్ (మునీష్ కాంత్) అనుకోకుండా చిన్నప్పటి స్నేహితుడు వీరా మామయ్యని కలుస్తాడు. మాటల్లో వీరా గురించి, అతను పెళ్లికి పెట్టిన కండిషన్స్ విని, కీర్తి 7వ క్లాస్ వరకే చదివిందని, తనకు పెద్ద జడ కూడా ఉందని నిజాన్ని దాచి, వీరా, కీర్తి లకు పెళ్లి చేస్తారు. ఆ తరువాత వీరాకు కీర్తి గురించి నిజం బయటపడుతుంది. అప్పుడు వీరా ఏం చేస్తాడు? వారిద్దరి మధ్య వచ్చే గోడవలేంటి? వారిద్దరూ చివరకు ఒకటయ్యారా, లేదా? అనేది కథ.
Matti Kusthi Review in Telugu రివ్యూ :
కోలీవుడ్ హీరోలు ప్రస్తుతం తెలుగులో తమ మార్కెట్ను పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాంటి కోలీవుడ్ హీరోలలో ఒకరు హీరో విష్ణు విశాల్. రానా హీరోగా చేసిన ‘అరణ్య’ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు ఈ హీరో. విష్ణు విశాల్ నిర్మాత కూడా. FIR మూవీ నుండి తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టాడు. హీరో రవితేజతో కలిసి తన మూవీస్ ను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.

రవితేజతో కలిసి విష్ణు విశాల్ తమిళంలో ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘గట్టా కుస్తీ,. ఆ సినిమానే తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో రిలీజ్ చేశారు. మట్టి కుస్తీ అనగానే అందారు ఇది స్పోర్ట్స్ డ్రామా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, రెజ్లింగ్ కూడా ఉంటుందని మూవీ యూనిట్ ముందే చెప్పింది.
Vishnu Vishal అతనికి యాక్షన్ సీక్వెన్స్ బాగా సెట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు అట్రాక్షన్ కీర్తి పాత్రే. ఐశ్వర్యా లక్ష్మి రెజ్లర్గా అద్భుతంగా నటించింది. ఆమె తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ కట్టిపడేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్లో అదిరిపోయే యాటిట్యూడ్ను చూపించింది. మిగిలిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ :
- ఐశ్వర్యా లక్ష్మి నటన
- కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- ఊహించదగిన సన్నివేశాలు
రేటింగ్ :
2.5
ట్యాగ్ లైన్ :
ఓవరాల్ గా మట్టి కుస్తీ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఒకసారి చూడొచ్చు.
watch trailer :

విజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ గివెన్చీ స్వెట్షర్ట్ ధరించి కనిపించాడు. గివెన్చీ స్వెట్షర్ట్ ధర 65,000, అతని బూట్లు ధర సుమారు 53,000. ఇంకా ఫెండీ సన్ గ్లాసెస్ ధరించాడు. దీని ధర 25,000. మొత్తం మీద, ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ దుస్తులకు,మిగతా వాటికి కలిపి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. అల్లు అర్జున్ స్వెట్షర్ట్ మరియు బూట్ల ధరలు తెలుసుకుని అభిమానులు విస్తుపోయారు. దీని పై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా చేసారు.
అంతే కాకుండా తన లగ్జరీ లైఫ్, స్టైలిష్ డ్యాన్స్ తో బన్నీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే గంగోత్రి,ఆర్య, దేశముదురు, DJ.. పుష్ప వరకు సూపర్ హిట్ సినిమాలతో స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా అతను బ్రాండెడ్ వస్తువులను వాడుతాడు. అతని దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వీటిలో రూ. 1.45 లక్షల విలువైన షూలు, రూ. 65,000 విలువైన టీ-షర్ట్, హైదరాబాద్ లో రాజభవన లాంటి బంగ్లా, రూ. 7 కోట్ల విలువైన సూపర్ ఖరీదైన వ్యానిటీ వ్యాన్, ఖరీదైన స్టైలిష్ కార్లు ఉన్నాయి.
నమ్రత తాజాగా కొడుకు గౌతమ్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానులను ఖుషి చేస్తుంది. ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా, అది గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే గౌతమ్ గతంలో స్విమ్మింగ్లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నమ్రతా షేర్ చేసిన గౌతమ్ స్విమ్మింగ్ వీడియో కూడా వైరల్ అయ్యింది. తాజాగా గౌతమ్ తన స్కూల్లో క్లాస్మెట్స్తో కలిసి స్కిట్ చేశాడు.
తన మిత్రులతో కలిసి చక్కని హావా భావాలతో నటించాడు. దానిలో గౌతమ్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. గౌతమ్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ సూపర్ గా ఉంది. ఈ స్కిట్ లో గౌతమ్ని చూసి మహేష్ అభిమానులు, నెటిజన్లు, మహేష్ లానే ఉన్నాడని, ఫ్యూచర్ ప్రిన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత్ షేర్ చేసిన గౌతమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌతమ్ తన స్టడిస్ పూర్తయిన తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.
బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.
కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.
ఇప్పటికే మహేష్బాబు,త్రివిక్రమ్ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ హీరోలు తమ సినిమాలని ఇతర భాషల్లో విడుదల చేసినా కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వడం లేదు. ఎందుకనో గాని పాన్ ఇండియా మూవీస్ తో తమ దూకుడు పెంచుకోవాలని ఈ సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదు. అయితే సీనియర్ హీరోలు చాలా విషయాలలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నా పాన్ ఇండియా విషయంలో అసలు పోటీపడటం లేదు
ఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలోనే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీతో అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల పలకరించనున్నారు. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మూవీ షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా వారం వారం ప్రేక్షకులకు పలకరిస్తున్నాడు.
డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబీ29 గురించి ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాడు. “మహేష్ తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్లాంటి ఓ అడ్వెంచరస్ మూవీ అని, ఇలాంటి మూవీ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇదే దానికి సరైన టైమ్ అనిపించింది. ఈ సినిమాకి మహేష్ బాబునే పర్ఫెక్ట్ ఛాయిస్. ఇలాంటి సబ్జెక్ట్కు అతను సూటవుతాడు.ఇది ప్రపంచమంతా చుట్టే ఒక అడ్వెంచరస్ సినిమా అని రాజమౌళి చెప్పాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నాడు.
గతంలోనే విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథను రాయబోతునట్లు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి కూడా అదే కథని చెప్పాడు. యాక్షన్,అడ్వెంచర్, థ్రిల్స్ అన్ని ఎస్ఎస్ఎంబీ29 లో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ 2023లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ మూవీలో నటించబోయే నటీనటుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్స్లోకి తీసుకెళ్ళే పనుల్లో ఉన్నాడు. అవన్నీ పూర్తయితే కానీ ఎస్ఎస్ఎంబీ29 పై దృష్టి పెట్టే అవకాశాలు లేవు.
హీరో ధనుష్ కు పక్కాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, వీరిని ఫైనల్ చేయాల్సి వుంది. ఇక శేఖర్ కమ్ముల స్టైల్ ఎమోషన్లు కూడా చాలా వుంటాయని తెలుస్తోంది. సినిమాలో ధనుష్ పాత్ర కాకుండా మరో ముఖ్య పాత్ర ఉంతుందని సమాచారం. ఎమోషనల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు ఎదురుచూడాలి.
దర్శకుడు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, శేఖర్ కమ్ముల పారితోషికం భారీగా పెరిగిందని సమాచారం. అయితే 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారని అంటున్నారు. హీరో ధనుష్ నటించే ఒక్కో సినిమాకు ముప్పై నుండి నలబై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా.