భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకరు. ఇండియాకు ఎన్నో తిరుగులేని విజయాలు అందించారు మహేంద్రసింగ్ ధోని. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్కు అందించారు.
Video Advertisement
అయితే ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో ధోని ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను అంటూ చెప్పారు. దాంతో ఫ్యాన్స్ అందరూ ధోని ఏం చెప్పబోతున్నారు అని ఎదురు చూశారు. కానీ ఓరియో బిస్కెట్ కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ బిస్కెట్ కి గత కొన్ని సంవత్సరాల నుండి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ బిస్కెట్ ప్రమోషన్లో భాగంగా ధోనీ మీడియాతో మాట్లాడారు. ఫ్యాన్స్ అందరికీ ధోనీని చాలా కాలం తర్వాత చూశాం అనే ఆనందం ఉంది.
కానీ ధోనీ ఇలా మీడియా ముందుకు వస్తున్నారు అంటే అందరూ ఏదో ఆశించారు. క్రికెట్ కి సంబంధించి ఏమైనా చెప్తారు ఏమో అని అనుకున్నారు. కానీ ఇక్కడ అది జరగలేదు. దాంతో ఒక పక్క ఆనందంగా ఉన్నా కూడా, మరొక పక్క ఇదేంటి ఏదో అనుకుంటే ఏదో చెప్పారు అని అనుకుంటున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10