Ads
దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ కి జరుగుతున్న ఆసియా కప్ సూపర్ 4 2022 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (122 నాటౌట్: 61 బంతుల్లో 12×4, 6×6) సెంచరీ చేశారు. మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీతో పాటు మ్యాచ్ లో తాత్కాలిక కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ (62: 41 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీ నమోదు చేశారు.
Video Advertisement
టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ నబీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో విరాట్ కోహ్లీతో కలిసి భారత్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కేఎల్ రాహుల్ మొదటి వికెట్ 12.4 ఓవర్లలో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (6) తక్కువ స్కోర్ కి అవుట్ అయినా కూడా, విరాట్ కోహ్లీ దూసుకెళ్లారు. రిషబ్ పంత్ (20 నాటౌట్: 16 బంతుల్లో 3×4)తో కలిసి మూడో వికెట్కి అజేయంగా 42 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో కోహ్లీ అంతర్జాతీయ టీ-20 కెరీర్ లో మొదటి సెంచరీని నమోదు చేసుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఇది 71వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా రిక్కీ పాంటింగ్ రికార్డ్ ని విరాట్ కోహ్లీ సమానం చేశారు. అలాగే అంతర్జాతీయ టీ-20లో భారత్ జట్టు తరపున అత్యధిక స్కోర్ నమోదు చేసిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచారు. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21
End of Article