రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు… అంతా నెట్స్ లోనేనా.? మ్యాచ్ లో కాదా.?

రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు… అంతా నెట్స్ లోనేనా.? మ్యాచ్ లో కాదా.?

by Anudeep

Ads

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అభిమానులకు పండుగ. మరి అలాంటిది ఆ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే అది టీమ్ ఇండియా అభిమానులకు కనుల పండుగ. ఆసియా కప్‌ 2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పై 5 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిజల్ట్ ఏమిటా అని అందరూ టెన్షన్ పడ్డారు. భారత్ సమిష్ఠ కృషితో పాకిస్థాన్ ఓడించింది.అయితే ఈ విజయాన్ని పురస్కరించుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో టీమ్ ఇండియా ఫ్యాన్స్ పాకిస్థాన్ పై రకరకాల మీమ్స్ ను రిలీజ్ చేస్తున్నారు.

Video Advertisement

Also read: పాక్ పై భారత్ మ్యాచ్ గెలవడంతో ట్రెండ్ అవుతున్న 21 మీమ్స్

ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ ఆసిఫ్‌ అలీను ఆన్లైన్లో బంతాట ఆడుతున్నారు. అసలు జరిగిందేమిటంటే…ఈ ఎక్సైటింగ్ మ్యాచ్ కి ముందు ఆసిఫ్‌ అలీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మీరు భారత్ మ్యాచ్ కు ఏ విధంగా సన్నద్దం అవుతునున్నారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ..”ప్రతీ రోజు ప్రాక్టీస్‌లో భాగంగా 100 నుంచి 150 సిక్స్‌లు కొడుతున్నా, మ్యాచ్‌లో మాత్రం కనీసం మూడు నుంచి నాలుగు సిక్స్‌లు అయినా కొడతా” అంటూ ప్రగల్బాలు పలికాడు అలీ.

నిజంగానే అన్నట్టుగా నాలుగైదు సిక్స్లు కొట్టి స్కోర్ బోర్డు పరిగెత్తిస్తాడు అనుకున్న అసిఫ్ …తీరా మ్యాచ్లో తుస్సుమన్నాడు. ఈ మ్యాచ్ మొత్తానికి కలిపి అతి కష్టం మీద 7 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. సిక్సులు కాదు కదా కనీసం ఒక ఫోర్ కి కూడా ఆస్కారం లేకుండా పోయింది. పేలవమైన ఈ పర్ఫామెన్స్ చూసిన టీమిండియా అభిమానులు ప్రస్తుతం అలీ పై ఫన్నీ మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు. సిక్స్ లు అన్నావ్ ఎక్కడ భయ్యా కనిపించలేదు అంటూ ఆసిఫ్‌ అలీని భారత అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు.


End of Article

You may also like