Ads
ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్థాన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ మరియు బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఆసియా కప్ 2022లో తలపడ్డారు. క్రితం మార్చిలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఒకపక్క భారతీ ఎదురు చూస్తుంటే. మరోవైపు, పాకిస్తాన్ మరోసారి టీమ్ ఇండియాను ఓడించి, భారత్పై తమ చివరి ఔటింగ్ నుండి కలిగి ఉన్న జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున, రెండు వైపులా భావోద్వేగాలు రెకేతడం తో పాటు మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Video Advertisement
ఈ క్రమంలో నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఈ విజయాన్ని పురస్కరించుకొని నెటిజన్లు మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు.ఆసియా కప్ 2022 రెండో మ్యాచ్లో ఆదివారం జరిగిన గట్టి పోరులో పాకిస్థాన్ను భారత్ ఓడించిన తర్వాత ట్విట్టర్లో మీమ్స్ మరియు జోకులు వెల్లువెత్తాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిఎస్ లక్ష్మణ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా మరియు ఎంతోమంది ప్రముఖులు టీమ్ ఇండియాను అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ లు పెట్టారు.
విరాట్ కోహ్లీ 35 , రవీంద్ర జడేజా 35, హార్దిక్ పాండ్యా 33 పరుగులు చేయగా భారత్ 5 వికెట్ల తేడాతో తన ప్రత్యర్థి పాకిస్తాన్ టీం పై అనూహ్య రీతిలో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ టీం బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్ల తన ఖాతాలో వేసుకొని అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. తదుపరి బ్యాటింగ్ కి దిగిన భారత్ తొలి బంతికే కేఎల్ రాహుల్ ని కోల్పోయింది దాంతో టీమిండియా పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో నిదానంగా నిలదొక్కుకున్న కోహ్లీ వీలు దొరికినప్పుడల్లా తన బ్యాట్ కు పని చెప్పి 34 బంతుల్లో 35 పరుగులు సాధించాడు.
నిన్న ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో భారత్ చివరి వరకు పోరాడి గెలవడంతో ఫిదా అయిన ఫ్యాన్స్ సోషల్ మీడియా ను మీమ్స్ తో హోరెత్తించారు. ఆసియా కప్ 2022 పాక్ పై భారత్ మ్యాచ్ గెలవడంతో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక లుక్ వేయండి.!
#1
#2
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
#16.
#17.
#18.
#19.
#20.
#21.
End of Article