ఈ 3 కారణాల వల్లే ఐపీఎల్ ఫైనల్ లో SRH ఒడిపోయింది…పాపం కావ్య.!

ఈ 3 కారణాల వల్లే ఐపీఎల్ ఫైనల్ లో SRH ఒడిపోయింది…పాపం కావ్య.!

by Mohana Priya

Ads

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జుట్టు ఐపీఎల్ ఫైనల్ లో ఓడిపోయింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్, తర్వాత వన్ సైడ్ అయిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మరొకసారి కప్పు సొంతం చేసుకుంది. హైదరాబాద్ జట్టు ఈసారి గెలుస్తుంది అని చాలా మంది ఆశించారు. ప్రతి మ్యాచ్ కూడా చాలా బాగా ఆడడంతో ఈసారి కూడా కప్ కొట్టే అవకాశం ఉంది అని అనుకున్నారు. కానీ ఫైనల్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

Video Advertisement

కెప్టెన్ పాట్ కమిన్స్ (24; 19 బంతుల్లో, 2×4, 1×6) చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/19) మూడు వికెట్లు, స్టార్క్ (2/14) రెండు వికెట్లు, హర్షిత్ రాణా (2/24) రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన కోల్‌కతా జట్టు రెండు వికెట్లకి 10.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. వీరిలో వెంకటేశ్ అయ్యర్ (52; 26 బంతుల్లో, 4×4, 3×6) అజేయంగా హాఫ్ సెంచరీ చేశారు. అసలు హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఇవే అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

reasons why srh did not win in ipl 2024 finals

#1 టాస్ గెలిచినప్పుడు జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం అనేది సరైన నిర్ణయం కాదు అని చాలా మంది చెప్పారు. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు ఆడినప్పుడు ఓడిపోయారు. కోల్‌కతా జట్టులో బౌలర్ లైనప్ చాలా గట్టిగా ఉంటుంది. కానీ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ మీద హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి గెలిచారు. ఈ ఉద్దేశంతోనే ఈసారి కూడా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఇలా జరిగింది.

#2 హెడ్ వికెట్ మిచెల్ స్టార్క్ తీస్తారు అనే భయంతో అభిషేక్ శర్మతో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. హైదరాబాద్ జట్టులోనే ట్రావిస్ హెడ్ కూడా ఉన్నారు. ఒకపక్క హెడ్ చాలా పేరు పొందిన ఇంటర్నేషనల్ క్రికెటర్. చాలా అనుభవం ఉన్న ప్లేయర్. మరొక పక్క అభిషేక్ యంగ్ ప్లేయర్. ఇంటర్నేషనల్ క్రికెటర్ అయిన హెడ్‌ కి బదులు ఒక యంగ్ ప్లేయర్ కి స్ట్రైకింగ్ ఇచ్చే ప్లాన్ వర్క్ అవుట్ అవ్వలేదు. మొదటి ఓవర్ లో వికెట్ కోల్పోవడం కూడా జట్టుకి ఓడిపోవడానికి ఒక కారణంగా మారింది.

ఓవర్ల మీద జట్టు ఎక్కువగా ఆధారపడింది. మిడిల్ ఆర్డర్ కూడా విఫలం అయ్యింది. ట్రావిస్ హెడ్ పెవిలియన్ కి చేరగా, అభిషేక్ శర్మ రెండు పరుగులు మాత్రమే చేశారు. గతంలో వీరి బ్యాటింగ్ కి చాలా మంచి మార్కులు పడ్డాయి. కానీ గత రెండు మ్యాచ్ లు కూడా వీళ్లు సరిగ్గా ఆడలేదు. గతంలో బలం అని అనుకున్నవాళ్లే ఈసారి సరిగ్గా ఆడలేకపోయారు.

#3 జట్టు ప్లానింగ్ కూడా ఓడిపోవడానికి ఒక కారణం అయ్యింది. అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్‌ ఆడడంలో విఫలం అయ్యారు. అయినా కూడా వాళ్ళకి ఎక్కువ సార్లు అవకాశాలు ఇచ్చారు. ఒకవేళ సమద్ స్థానంలో సుందర్‌ ని, మార్క్‌రమ్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‌ ని పంపించినా కూడా జట్టు గెలిచే అవకాశం ఉండేది.

ఈ కారణాల వల్లే హైదరాబాద్ జట్టు ఫైనల్ లో ఓడిపోయింది అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ నిన్నటి మ్యాచ్ లో కావ్య బాధపడడం చూసింది చాలా మంది బాధపడ్డారు. హైదరాబాద్ జట్టు మీద ఆమె ఎంత ఆశలు పెట్టుకున్నారు అనేది ఆమెను చూస్తే అర్థం అవుతోంది. చాలా మంది జట్టును ప్రోత్సహిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like