Ads
“వరుడు” సినిమా హీరోయిన్ భాను శ్రీ మెహ్రా గుర్తుందా..? ఆమె కు ఎంట్రీ మూవీ నే అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అయితే.. హీరోయిన్ ఫేస్ ను మూవీ రిలీజ్ అయ్యేవరకు ఎక్కడా రిలీజ్ చేయలేదు. భాను శ్రీ మెహ్రా కు “వరుడు” సినిమా బ్రేక్ ఇవ్వలేదు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత ప్రయత్నించినా.. భానుశ్రీ కి అంతగా అవకాశాలు రాలేదు.
Video Advertisement
గెస్ట్ అప్పీరెన్స్ లలో చేయడానికి కూడా భానుశ్రీ మెహ్రా ఇంటరెస్ట్ చూపించినప్పటికీ.. సినీ ఇండస్ట్రీ లో మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. ఆ తరువాత ఆమె పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టారు. 2018 లో భానుశ్రీ మెహ్రా కరణ్ అనే ఓ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కూడా భానుశ్రీ మెహ్రా నటన పై ఆసక్తి కనబరిచారు.
పెళ్లి తరువాత భాను శ్రీ మెహ్రా గెస్ట్ రోల్స్ లో నటించారు. కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటించిన ” మిస్ ఇండియా” సినిమా లో భాను శ్రీ కూడా ఓ పాత్రను పోషించారు. ప్రస్తుతం భాను శ్రీ సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉంటున్నారు. హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ మతి పోగొడుతున్నారు.
అయితే, భాను శ్రీ మెహ్రా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఎక్కువ గానే ఉందని తెలుస్తోంది. అవకాశాలు లభిస్తే.. భాను శ్రీ తిరిగి టాలీవుడ్ మూవీస్ లో నటించే అవకాశం ఉంది.
End of Article