విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.! షాక్‌లో క్రికెట్ అభిమానులు.!

విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.! షాక్‌లో క్రికెట్ అభిమానులు.!

by Mohana Priya

Ads

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. దుబాయ్ వేదికగా జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్ స్థానం నుండి తప్పుకుంటున్నట్లు ఒక నోట్ ద్వారా స్పష్టం చేశారు.

Video Advertisement

ఈ విషయం గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో చర్చలో నిలిచింది. ఇప్పుడు విరాట్ కోహ్లీనే స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ విషయం గురించి జయ్ షా, సౌరవ్ గంగూలీతో పాటు మిగిలిన సెలెక్టర్స్ తో కూడా మాట్లాడినట్టు విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.


End of Article

You may also like