Ads
వరల్డ్ వైడ్ గా పూనకాలు పుట్టించిన సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మొదటి భాగంపై మంచి రెస్పాన్స్ రాగా… రెండో భాగానికి ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిపోయింది. బాక్స్ ఆఫీస్ సైతం బద్దలు అయ్యేలా కలెక్షన్స్ రాబట్టింది.
Video Advertisement
ఈ నేపథ్యంలో పార్ట్ -3 పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మేరకు ప్రాజెక్టు త్రీ బై ప్రశాంత్ నీల్ కసరత్తులు మొదలుపెట్టారు. ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా జపాన్ లో విడుదల చేయక అక్కడ కూడా భారీ కలెక్షన్లు కాబట్టి విజయకేతనం ఎగరవేస్తుంది.
మొత్తంగా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి. అందుకే కేజిఎఫ్ పార్ట్ 3 పై భారీ అంచనాలు పెరిగాయి. కానీ యష్ సినిమా తీయాలంటే కొన్ని ఆంక్షలు పెట్టాడు. యష్ కి కే జి ఎఫ్ మూవీ తో భారీగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. కాబట్టి పార్ట్-3 అంతకుమించి ఉంటేనే తీస్తాను అని యష్ అన్నాడట. పార్ట్ 3 కథ ముందు యష్ కు నచ్చినప్పుడే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట.
ఇప్పటికే ఉన్న అభిమానులను మరింత పెంచుకోవాలని అందుకే పార్ట్ త్రి పై ఎటువంటి ఆంక్షలు విధించాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పార్ట్-3 చిత్రీకరణ మొదలుపెట్టే కంటే ముందు ఇతర దేశాలలో కూడా ఈ సినిమా విడుదల చేయాలని చెప్పాడట. ఇదిలా ఉంటే ఇప్పటికే యష్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేని భారీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు కేజిఎఫ్ పార్ట్ 3 కంటే ముందు అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ సినిమా త్వరలోనే పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యష్ కేజిఎఫ్ పార్ట్ 3 ఒక రేంజ్ లో ఉండబోతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక యష్ నటిస్తున్న కొత్త సినిమాపై ఉత్కంఠ నెలకొంది.
ALSO READ : OTT లో విజృంభణ సృష్టిస్తున్న విమానం మూవీ..!
End of Article