“యాత్ర 2″లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీ… అందులో ఏం రాసి ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు!

“యాత్ర 2″లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీ… అందులో ఏం రాసి ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు!

by kavitha

Ads

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజకీయ నాయకుడిగా, సీఎంగా తనదైన ముద్రను వేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు వైస్ జగన్ ఏపీకి సీఎంగా ఉన్నారు.  వైఎస్ఆర్  పాదయాత్ర ఆధారంగా గతంలో యాత్ర అనే మూవీ రిలీజ్ అయ్యి, విజయం సాధించింది.

Video Advertisement

ఆ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం యాత్ర2 తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ టీజర్ లో ఒక చోట వైఎస్ఆర్ డైరీ కనిపిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ఆర్ గా మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వై.ఎస్‌.జ‌గ‌న్‌ బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2ను సైతం ఈ ఏడాది అదే డేట్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో వైఎస్‌ జ‌గ‌న్‌ పాత్రలో తమిళ హీరో జీవా న‌టిస్తున్నారు. యాత్ర2 లో కూడా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వైఎస్ జగన్ పాలిటిక్స్ లోకి రావటానికి కారణాన్ని ఎమోషనల్ చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ డైరీ వంటివి చూపించారు. అయితే టీజర్ లో అందరినీ ఆకట్టుకుంది వైఎస్ఆర్ డైరీ. సగం కాలిన ఆ డైరీలోని ఓ పేజీలో ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని ఉంది.  అలా తన  డైరీలో ఆరోగ్య శ్రీ బీమా గురించి రాసుకోవడం చిన్న విషయం కాదు.
ప్రజల గురించి ఎంత ఆలోచించి ఉంటే తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీలో రాసుకోరు. జీవిత ధ్యేయం అయితే కానీ ఎవరు డైరీలో అలా రాసుకోరు అని అంటున్నారు. టీజర్ లో డైరీ కొంచెం కాలిపోయినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఎవరైనా కాల్చరా?  లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలినట్టుగా  కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ టైమ్ లో ఈ డైరీ దొరికిందా? అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.

Also Read: హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్..ఎందులో చూడచ్చు అంటే.?


End of Article

You may also like