YS SHARMILA SON MARRIAGE: షర్మిలకు కాబోయే కోడలు గురించి ఈ విషయాలు తెలుసా.? వైఎస్ విజయమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే.?

YS SHARMILA SON MARRIAGE: షర్మిలకు కాబోయే కోడలు గురించి ఈ విషయాలు తెలుసా.? వైఎస్ విజయమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే.?

by kavitha

Ads

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. మరి షర్మిల కాబోయే కోడలు ఎవరు? ఆమె. బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..!షర్మిల-అనిల్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.

Video Advertisement

రాజారెడ్డి పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగతున్నాయి. మరి వైఎస్ షర్మిల కాబోయే కోడలు ఎవరో తెలుసా? ఆమె పేరు ప్రియా అట్లూరి.కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకి యూఎస్ సిటిజెన్‌షిప్ కూడా ఉంది.

వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా వీరు ఇరువురు ప్రేమించుకుంటున్నారని సమాచారం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన రాజారెడ్డి అక్కడ ప్రియా అట్లూరికి పరిచయం అయ్యారు. తక్కువ కాలంలోనే స్నేహితులుగా మారి తర్వాత  ప్రేమించుకున్నారు.రాజారెడ్డి-ప్రియా అట్లూరి ప్రేమపెళ్లికి.. ఇటు షర్మిల-అనిల్ దంపతులు..అటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు.వచ్చే ఏడాది మేలో వివాహం జరిపించేంచాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నారు. ప్రియా అట్లూరిది కమ్మ సామాజిక వర్గం కావడంతో.. వీరిది కులంతార వివాహం అవుతుంది.

 

ys-sharmila-fires-on-cm-kcr

షర్మిలది కూడా కులాంతర వివాహమన్న విషయం తెలిసిందే.రాజారెడ్డి అమెరికాలోని డ‌ల్లాస్ యూనివ‌ర్సిటిలో బ్యాచిల‌ర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సును పూర్తి చేశారు. యూనివ‌ర్సిటీ నుంచి ఇప్పటికే పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కూడా వెళ్ళిన విషయం తెలిసిందే.ఈ పెళ్లి విషయం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు ఉన్నత కుటుంబాల వ్యక్తులు కావడంతో జనం ఫోకస్ వీరిపై పడింది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో షర్మిల పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కెసిఆర్ ను ఒడించడమే లక్ష్యం అని బహిరంగంగా ప్రకటించారు. అందుకోసమే పోటీ నుంచి తప్పుకున్నట్లుగా తెలియజేశారు.

తాజాగా షర్మిలకు కాబోయే కోడలిని విజయమ్మను కలిసినట్లు తెలుస్తోంది. లోటస్ పాండ్‌లోని ఇంటికి ప్రియ అట్లూరిని ఆప్యాయంగా స్వాగతించారు వైఎస్ విజయమ్మ. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియ అట్లూరికి రెండు జతల బంగారు గాజులను తానె స్వయంగా తొడిగి ప్రజెంట్ చేశారు విజయమ్మ.

Also Read:20 ఏళ్ల తర్వాత రవితేజ సినిమాకి సీక్వెల్… కానీ ట్విస్ట్ ఏంటంటే…?


End of Article

You may also like