Ads
టీ20 ప్రపంచకప్ 2022 లో భాగంగా గురువారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. దీంతో భారత్ 56 పరుగుల తేడాతో గెలిచింది.
Video Advertisement
నెదర్లాండ్స్ బ్యాటర్లలో టిమ్ ప్రింగిల్ (20) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ ఖాతాలో 4 పాయింట్స్ చేరాయి. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. కేఎల్ రాహుల్ విఫలం అవ్వగా, రోహిత్ శర్మ మాత్రం హాఫ్ సెంచరీ దగ్గరికి వచ్చారు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
సూర్యకుమార్ యాదవ్ చివరి బంతికి సిక్సర్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్ కి 48 బంతుల్లో 95 పరుగులు జోడించారు. దాంతో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 179 పరుగుల స్కోర్ చేసింది.25 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇందులో విజయం సాధించడంతో టీం ఇండియా గ్రూప్-బీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article