కంటి చూపు మందగిస్తోందా..ఈ ట్రిక్స్ కంటిచూపు చాలా మెరుగుపడుతుంది

కంటి చూపు మందగిస్తోందా..ఈ ట్రిక్స్ కంటిచూపు చాలా మెరుగుపడుతుంది

by Megha Varna

Ads

భ‌గ‌వంతుడు మ‌న‌కు ప్ర‌సాదించిన ఓ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే క‌ళ్ల‌తో మ‌నం ఈ సృష్టిని చూస్తున్నాం. ఎన్నో విష‌యాల‌ను తెలుసుకోగ‌లుగుతున్నాం.చిన్నా పెద్దా తేడా లేకుండా ఇటీవల అందరికీ కంటి సమస్య వస్తోంది. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో చూపు మందగిస్తోంది. దీనికి కారణం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం. ఏదైనా జబ్బు వస్తే మందు వేసుకుని ఉపశమనం పొందుతాము. కానీ కంటి చూపు సమస్య అలాంటిది కాదు. సరైన ఆహారం తీసుకుంటే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. మంచి చూపు కావాల‌న్నా కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటించండి.

Video Advertisement

Keep Your Eyes Healthy

Keep Your Eyes Healthy

  • 100 గ్రాముల బాదం ప‌ప్పు, 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల చ‌క్కెర‌, అన్నింటినీ క‌లిపి మెత్తని పౌడ‌ర్‌లా చేయాలి. ఈ పొడిని 2 టీస్పూన్ల మోతాదులో ఒక గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి ప్ర‌తి రోజు రాత్రి పూట నిద్రించే ముందు తాగాలి. దీంతో దృష్టి సంబంధ స‌మ‌స్య‌లో పోతాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది.
  • 8 నుంచి 10 బాదం పప్పుల‌ను తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యం ఆ బాదంప‌ప్పు పొట్టును తీసివేయాలి. అనంత‌రం వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాల‌లో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. ఒక‌టి, రెండు నెల‌ల పాటు ఇలా తాగితే చూపు బాగా వ‌స్తుంది. కంటి స‌మ‌స్య‌లు పోతాయి.
  • 6 నుంచి 8 పచ్చి ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిలోంచి విత్త‌నాల‌ను వేరు చేసి ఆ కాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి మిశ్ర‌మంగా చేశాక దాన్నుంచి జ్యూస్‌ను తీయాలి. ఈ జ్యూస్‌ను తేనెతో క‌లిపి నిత్యం ఉద‌యాన్నే తాగాలి. దీని వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది.
  • అర‌కిలో వాల్‌న‌ట్స్‌, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల క‌ల‌బంద గుజ్జు లేదా జ్యూస్‌, 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. నిమ్మ‌కాయ‌ల‌ను పిండి వాటి నుంచి ర‌సం తీసి దాన్ని మిగిలిన ప‌దార్థాల‌కు బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని సేవిస్తుంటే క్ర‌మంగా కంటి చూపు మెరుగ‌వుతుంది. 6 నెల‌ల గ‌ర్భం దాటిన మ‌హిళ‌లు, కిడ్నీలు, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దీన్ని తీసుకోకూడ‌దు.
  • విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే యాపిల్‌, క్యారెట్‌, పాల‌కూర వంటి ఆహారాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది.
  • ఉద‌యాన నిద్ర‌లేవ‌గానే చ‌ల్ల‌ని నీటితో క‌ళ్ల‌ను క‌డుక్కోవాలి. క‌ళ్లు బాగా ఒత్తిడికి గురై మంట‌లుగా ఉన్న‌ప్పుడు కూడా చ‌ల్ల‌ని నీటితో క‌డుక్కోవ‌చ్చు. లేదంటే రెండు అర‌చేతులను బాగా రుద్ది క‌ళ్ల‌పై పెట్టుకోవాలి. దీని వ‌ల్ల వేడి క‌ళ్ల‌కు తాకి కంటి న‌రాలు రిలాక్స్ అవుతాయి.
  • ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్నే త‌దేకంగా చూస్తూ నెమ్మ‌దిగా క‌ళ్లు మూసుకోవాలి. మ‌ళ్లీ నెమ్మ‌దిగా క‌ళ్లు తెర‌వాలి. ఇలా క‌నీసం 5 సార్లు చేయాలి. దీంతో స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది.

End of Article

You may also like