

Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.


ఈ మధ్య టాలీవుడ్లో రీ-రిలీజ్ల హవా నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోల బర్త్డే, స్పెషల్ డే ల సందర్భంగా వాళ్ళ పాత సినిమాలను 4K ప్రింట్తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్బాబు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలు వాళ్ళ బర్త్డే సందర్భంగా విడుదలై రికార్డు కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
మరో వైపు చెన్న కేశవరెడ్డి విడుదలై 20 ఏళ్ళు అయిన సందర్భంగా ఆ చిత్రం కూడా రీ రిలీజ్ అయింది. అయితే ప్రభాస్ బర్త్ డే కి మాత్రం సూపర్ హిట్ సినిమాలైన వర్షం, బిల్లా సినిమా లతో పాటు రెబెల్ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలే. సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని, మరింతగా వసూళ్లని సొంతం చేసుకుంటున్నారు.

రెబెల్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే.. కారణాలేవైనా రెబెల్ సినిమా రీ రిలీజ్ చేయనున్న నేపథ్యం లో తమ అభిమాన హీరోల ఫ్లాప్ మూవీస్ కూడా రీ రిలీజ్ చెయ్యాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఏ మూవీస్ ఉన్నాయో చూడండి..
#1 చిరంజీవి – బిగ్ బాస్
విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో చిరంజీవి సరసన రోజా కథానాయికగా నటించింది.

#2 పవన్ కళ్యాణ్ – అజ్ఞాతవాసి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 2018లో విడుదలైన సినిమా. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.

#3 నాగార్జున – భాయ్
యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం లో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ నటించింది.

#4 వెంకటేష్ – సుభాష్ చంద్ర బోస్
హిస్టారికల్ డ్రామా గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రం లో వెంకటేష్ సరసన శ్రేయ, జెనీలియా నటించారు.

#5 నాని – వి

క్రైమ్ సస్పెన్సు థ్రిల్లర్ అయిన ఈ చిత్రం లో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు.
#6 బాలకృష్ణ – పరమ వీర చక్ర

దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించాడు
#7 మహేష్ బాబు – బ్రహ్మోత్సవం

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ కుటుంబ కథ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
#8 ఎన్టీఆర్ – శక్తి

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్. నిర్మాత అశ్వనీదత్ సొంత పతాకం వైజయంతీ మూవీస్ లో జూనియర్ ఎన్.టి.ఆర్, ఇలియానా నాయకా నాయికలుగా నటించారు.
#9 అల్లు అర్జున్ – వరుడు

దర్శకుడిగా గుణశేఖర్ పదవ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్, తమిళ నటుడు ఆర్య, భాను శ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించగా, సుహాసిని మణిరత్నం, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు.
#10 రామ్ చరణ్ – తూఫాన్

హిందీ, తెలుగు లో ఒకేసారి చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలైన ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా రామ్ చరణ్ సరసన నటించింది.
#11 ప్రభాస్-సాహో
ప్రభాస్ హీరోగా నటించిన సాహో భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి ఫ్లాప్ అయ్యింది. కానీ ఏదేమైనా ఈ సినిమాకి టాక్ మాత్రం బాగుంది అని అన్నారు. కాబట్టి సినిమా ఒకవేళ ఇప్పుడు విడుదల చేస్తే హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

#12 మంచు విష్ణు – సలీం

వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మంచు విష్ణు, ఇలియానా జోడీగా నటించారు.
నిన్నటి తరం తెలుగు సినిమా ప్రేక్షకులకు కళ్ళు చిదంబరం సుపరిచితులు. ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేవి. ఆయన పేరు కొల్లూరు చిదంబరం అయినప్పటికీ ఆయన “కళ్ళు” సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో అందరికి కళ్ళు చిదంబరంగానే గుర్తుండిపోయారు.
కొల్లూరు చిదంబరం ఆయన కళ్ళతోనే మనకి గుర్తుండిపోయారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయనను “కళ్ళు” చిదంబరం గా పిలుస్తుంది. అంతే కాదు. ఆయన నటించిన కళ్ళు సినిమా ఆయనకీ మంచి గుర్తింపు ను తెచ్చింది.
ఆయనకు ఈ సినిమాకి గాను రాష్ట్ర నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. తెలుగు లో ఆయన నటించిన “అమ్మోరు” సినిమా కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. చిదంబరం సినిమాల్లోకి వచ్చే ముందు ఆయన ఇంజనీర్ గా పనిచేసేవారట. ఆయన 2015 లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన అనారోగ్య కారణాల వలెనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కళ్ళు చిదంబరం కుమారుడు ఆయన మరణం వెనకాల ఉన్న కారణాలను వివరించారు.
సినిమాల్లోకి రాకముందు కళ్ళు చిదంబరం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. అంతేకాక నాటకాలపై ఆసక్తి ఉండడంతో ఆయన నాటకాలలో కూడా నటించేవారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు నాటకాలలో నటించడం కోసం కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఉద్యోగం విజయవాడలో చేస్తూ.. మరోవైపు నాటకాల కోసం హైదరాబాద్, చెన్నై ల మధ్య ప్రయాణాలు చేసేవారు. సమయానికి సరైన నిద్ర ఉండేది కాదు. దీనితో ఆయన కంటికి ఓ నరం పక్కకి జరిగి మెల్లకన్నులా వచ్చింది.
కళ్ళు చిదంబరానికి మొదట్లో మెల్లకన్ను ఉండేది కాదు. కానీ నాటకాలపై, సినిమాలపై ఉన్న ప్రేమ కారణంగా ఆయన ఆరోగ్యం మీదకు తెచ్చుకున్నారు. ఇక డాక్టర్లు కూడా ఇతర చికిత్స విధానాల ద్వారా మెల్లకన్నుని సరి చేసుకోవచ్చని చెప్పినప్పటికీ.. సినిమాల్లోకి వచ్చాక మెల్లకన్ను కలిసి వచ్చిందని.. కళ్ళు చిదంబరం చికిత్స చేయించుకోలేదు. ఆ తరువాత అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.
Watch Video:
బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షోలలో జబర్దస్త్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంతోమంది కెరియర్ కు పునాది వేసింది ఈ షో. ఇక సీనియర్ హీరోయిన్ రోజా లాంటి వాళ్ళు కూడా ఆర్థిక సమస్య లతో ఇబ్బంది పడుతున్న సమయంలో జబర్దస్త్ ఆమెను ఆదుకుంది.
కేవలం రోజా మాత్రమే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్న ధన్ రాజ్ , గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్ , చమ్మక్ చంద్ర, వేణు లాంటి వారు కూడా కేవలం జబర్దస్త్ ద్వారానే తమ ఉనికిని చాటుకున్నారు. ప్రస్తుతం సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు ఎంతోమంది జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి గత తొమ్మిది సంవత్సరాలు నుంచి రోజా, నాగబాబు నిరంతరాయంగా జడ్జిలుగా పనిచేశారు. కానీ పారితోషకం విషయంలో గొడవ రావడంతో నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారన్న విషయం తెల్సిందే.
#1 రోజా

సీనియర్ హీరోయిన్ గా, మంత్రిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రోజా కు సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఈమెకు మల్లెమాలవారు బాగానే పారితోషకాన్ని అందించారు. ఒక్కొక్క ఎపిసోడ్ కు రోజాకు సుమారుగా రూ.5 లక్షలు అందించారు. ఇక ఆ తర్వాత కాలంలో ఈమె పారితోషకం పెరిగిన విషయం తెలిసిందే. కానీ ఈమెకు ఇటీవల మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ జడ్జ్ స్థానానికి గుడ్ బై చెప్పింది.
#2 నాగబాబు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు హీరోగా ఎదిగే ప్రయత్నం చేసినప్పటికీ.. హీరో కాలేకపోయారు. కానీ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక రోజాతో పాటు నాగబాబు కూడా జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించారు. కానీ ఇండస్ట్రీలో రోజా కంటే తక్కువ గుర్తింపు ఉన్న నాగబాబుకు కేవలం ఎపిసోడ్ కు రూ.3 లక్షలు మాత్రమే అందించేవారు.
#3 ఇంద్రజ

ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి గుడ్ బాయ్ చెప్పిన ఇంద్రజ జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈమె ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.2.50లక్షలు పారితోషకంగా తీసుకుంటుంది.
#4 మనో

నాగబాబు స్థానంలో జడ్జి గా వచ్చిన ప్లేబ్యాక్ సింగర్ మనోకి ఒక్కో ఎపిసోడ్కు రూ.2 లక్షలు ఇచ్చారు.
#5 కృష్ణ భగవాన్

తాజాగా కృష్ణ భగవాన్ ఇంద్రజాతో కలిపి జడ్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈయనకు ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.2.50 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఇక మల్లెమాలవారు ఎప్పుడూ కూడా సినిమాలలో వీరికుండే ఇమేజ్ ను బట్టి పారితోషకం ఫిక్స్ చేస్తూ ఉంటారు.
Also Read: ఈ 10 మంది శాస్త్రవేత్తలు…వారు కనిపెట్టిన వాటివల్ల చనిపోయారని తెలుసా.? ఇంతకీ ఏం కనిపెట్టారు?
కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ గా మన జీవితాల్లోకి చొరబడి.. అతలాకుతలం చేసేసింది కరోనా వైరస్. ప్రశాంతం గా సాగిపోతున్న జీవన గమ్యాన్ని మార్చేసింది. కరోనా ముందు లైఫ్ ఒకలా.. ఇప్పుడు లైఫ్ వేరేలా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ కరోనా వల్ల మనం ఎదుర్కొన్న ఒక కొత్త అనుభవం.. రోజుల తరబడి ఇంట్లోనే ఉండిపోవడం. అంతకు ముందు ఎప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొని ఉండరు ప్రజలు. అయితే ఈ కరోనా వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్నాం. వాటిలో ప్రధానమైనది ఒత్తిడి.

ఈ కరోనా కారణం గా అందరూ ఇంట్లోనే ఉండిపోయారు కానీ అందరి మధ్య తెలియని గోడలు పెరిగిపోయాయి. కొందరు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబం తో హ్యాపీ గా గడిపి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

కానీ ఈ సమయం కొందరు మహిళలకు చాలా ఒత్తిడి కలిగించే ఫేజ్ గా మారింది. ఇంట్లో భర్త, పిల్లలకు ఎంతో ఇష్టం గా పనులు చేసే మహిళలు ఈ కరోనా కాలం లో చాలా ఒత్తిడికి గురయ్యారు. వారి పని పంచుకోలేక.. మనసులో మాటలు పంచుకోలేక ఎంతో ఇబ్బంది పడ్డారు మహిళలు. ఈ ఒత్తిడి కారణం గా వారికీ అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సరిగా ఆహారం తీసుకోక పోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం వంటివి వారి శరీరం లో అనేక మార్పులు వచ్చేలా చేస్తున్నాయి. అంతే కాకుండా ఊరికే అలసి పోవడం, చిన్న విషయాలకు విసుక్కోవడం, బాధపడటం ఇవన్నీ ఒత్తిడి ని తెలిపే లక్షణాలే. ఇటువంటి లక్షణాలను గుర్తించి కుటుంబ సభ్యులు వారికీ అండగా నిలవాలి.

ఒత్తిడితో బాధపడుతున్నట్టు వాళ్లకు తెలియకపోయినా.. ఇతరులు మాత్రం ఈజీగా గుర్తిస్తారు. పని ఎక్కువైనప్పుడు, భాగస్వామితో గొడవ జరిగేటప్పుడు, ఆర్థిక విషయాల్లో మీలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తారు. ఒత్తిడి ఎప్పుడో ఒకసారి వస్తే ఏం పర్లేదు కానీ.. ఎప్పుడూ దీనితో బాధపడితే మాత్రం ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

స్ట్రెస్ వల్ల రక్తపోటు దారుణంగా పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. శరీరం బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. ఇక ఈ సమయంలో లోతైన శ్వాసను తీసుకోవాలి. అయితే స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరూ ఇలా బిహేవ్ చేయరు. కొంతమంది ఏ విషయాన్నైనా లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. విషయాలను కఠినమైనవిగా తీసుకున్నవారే ఎక్కువగా స్ట్రెస్ కు గురవుతుంటారు.

శారీరక శ్రమ తగ్గి ఒత్తిడి పెరగటం వల్ల శరీరంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయన్నది మనకు తెలిసిందే. దీని వల్ల అనేక రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఒత్తిడి వల్ల మీ ఆలోచనలో మార్పులొస్తాయి. ఏకాగ్రత కోల్పోతారు. పనిపై శ్రద్ధ ఉండదు. పనిచేయలేకపోతుంటారు. మీ బ్రెయిన్ విశ్రాంతి లేకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా విసుగ్గానే ఉంటారు. ఊరికే చిరాకు పడతారు. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఆందోళనకు గురవుతుంటారు. తమను తామే తక్కువగా చేసుకుంటారు.
డిప్రెషన్ కు లోనవుతారు. ఎందరున్నా లోన్లీ గానే ఫీలవుతారు. అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి. మజిల్స్ కూడా నొప్పిగా ఉంటాయి. హెడేక్ వస్తుంది. తెల్లవార్లూ నిద్రుండదు. కాళ్లు, చేతులు చల్లబడతాయి. ఊరికూరికే నోరు ఎండిపోతుంది. ఛాతిలో నొప్పి కలుగుతుంది. చేతులు వణుకుుతాయి. ఏది మంచి ఏది చెడు అన్న విషయాలను గుర్తించలేకపోతారు. ఆలోచనలు నిలకడగా ఉండకపోవడం వంటి లక్షణాలు కనిస్తాయి.
ఈ స్ట్రెస్ ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే.. గుండెపోటుతో పాటుగా ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అధిక రక్తపోటు బారిన కూడా పడతారు. అలాగే డిప్రెషన్, షుగర్ వ్యాధి. యాంగ్జైటీ, ఊబకాయం, స్కిన్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు, పల్స్ రేటు మారడం, మతిమరుపు, హార్మోన్ ల అసమతుల్యత, అల్సర్, ఎప్పుడూ తినాలనిపించడం వంటి సమస్యలు వస్తాయి.
స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి అంటే..
ఒత్తిడికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ఇది మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి వల్ల పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే అప్పటికప్పుడే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అదెలాగో తెలుసుకుందాం పదండి.
#1
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువును తగ్గించడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది.

#2
సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడి స్థాయిలు ఎక్కువైనప్పుడు వెంటనే మీకు నచ్చిన సాంగ్స్ ను పెట్టుకుని వినండి.

#3
ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పనిపూర్తికాకపోతే చిరాకుతో పాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల మీ బాస్ మిమ్మల్ని అవమానించినప్పుుడు మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది.

పైన చెప్పినవన్ని కూడా ఒత్తిడిని తగ్గించే పద్ధతులే. ఇవే కాక ఇంట్లో ఒక చోట మీకు ప్రశాంతతనిచ్చేలా మొక్కలు, కుషన్స్, పుస్తకాల తో అరేంజ్ చేసుకోవడం, వంట, గార్డెనింగ్, డ్యాన్స్ చేయడం, బొమ్మలు వేయడం, బొమ్మలకి రంగులు దిద్దడం, ఏదైనా అల్లడం, ఏదైనా క్రాఫ్ట్ నేర్చుకోవడం, పావుగంట చిన్న కునుకు తీయడం, మీకు నచ్చే ఫొటోస్ చూసుకోవడం, చిన్న పాటి మెడిటేషన్, ఆక్యు ప్రెషర్ .. ఇలాంటి వన్నీ కూడా మీకు స్ట్రెస్ నుండి రిలీఫ్ని ఇస్తాయి.
సినిమా ప్రపంచంలో జరిగే ప్రతీ విషయం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. తమ అభిమాన స్టార్స్ సినిమా విడుదలైందంటే అభిమానులకు ఒక పెద్ద పండగ. తమ అభిమాన స్టార్స్ సెలబ్రేట్ చేసుకునే ప్రతి విషయం అభిమానులకు సంతోషంగా ఉంది.
మరి అలాంటి స్టార్స్ నే వివాహం చేసుకుంటే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అభిమానులను వివాహం చేసుకున్న ఆ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం…
#1 రజనీకాంత్

రజనీకాంత్ మరియు లతా జంట. తన కాలేజీ మ్యాగజైన్ స్టొరీ కోసం రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారు లతా. ఆ సమయంలో రజినీకాంత్ పై తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
#2 విజయ్
లండన్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబం సంగీతాది. ఈవిడ విజయ్ కి వీరాభిమాని. 1999లో విజయ్ సంగీత వివాహం జరిగింది. తన అభిమానినే పెళ్లి చేసుకున్న విజయ్ వివాహం అప్పట్లో ఒక సంచలనం వార్త.
#3 అమీర్ ఖాన్
లగాన్ సినిమా టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న కిరణ్ రావుతో ప్రేమలోపడ్డారు అమీర్ ఖాన్. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నారు. అమీర్ ఖాన్ నటన అంటే కిరణ్ రావు ఎంతో అభిమానించేవారు.
#4 మాధవన్
సరిత, మాధవన్ కండక్ట్ చేసే పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్ క్లాసులకు హాజరు అయ్యారు. మొదటి చూపులోనే మాధవన్ సరిత ప్రేమలో పడిపోయాడు. 1999లో వీళ్ల వివాహం జరిగింది.
#5 జితేంద్ర
శోభా కపూర్ జితేంద్ర కు పెద్ద అభిమాని. శోభా కపూర్ ఫ్లైట్ అటెండెంట్ గా ఉద్యోగం చేసేవారు. 1974లో శోభా కపూర్ మరియు జితేంద్రల వివాహం జరిగింది.
#6 దిలీప్ కుమార్
సైరాబానుకి చిన్నతనం నుంచి దిలీప్ కుమార్ అంటే ఇష్టం. ఆయన పైన ఇష్టం వ్యక్తంచేయడంతో 1966లో వీరి వివాహం జరిగింది.
#7 రాజేష్ ఖన్నా
డింపుల్ కపాడియా సినిమాలకు రాకముందు నుంచే రాజేష్ కన్నాకు వీరాభిమాని. ఈ విషయం తన సన్నిహితులతో తెలియజేయగా, వీరి అభిమానం కాస్త వివాహంగా మారింది.
#8 శిల్పా శెట్టి

వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాకు శిల్పా శెట్టి అంటే ఎంతో అభిమానం. 2009లో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాల వివాహం జరిగింది.
మీరు చాలాసార్లు రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు ప్రయాణం చేసేటప్పుడు అనేకసార్లు వంతెనలపై నుంచి ప్రయాణం చేసినట్లు మీకు గుర్తుందా . కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ గమనించి ఉండరు. అదేంటంటే నేల మీద కన్నా, రైలు వంతెన పై వెళ్లేటప్పుడు ఎక్కువ శబ్దం చేస్తుంది. మీరు అనేక సార్లు రైలు ప్రయాణం చేసిన ఈ విషయాన్ని దృష్టిలో కి వచ్చి ఉండదు.
మరి రైలు నేల మీద ప్రయత్నించినప్పటికీ, వంతెన మీద ప్రయత్నించినప్పటికీ శబ్దంలో గల తేడా ఎందుకు అని అనుకుంటున్నారా.. ఇప్పుడు మనం ఆ విషయం గురించే తెలుసుకోబోతున్నాము.
Also read : ట్రైన్” లో మూవీ షూటింగ్ కి ఎంత తీసుకుంటారో తెలుసా..? ఎంత సమయానికి ఛార్జ్ చేస్తారంటే?

రైలు ఎంతో బరువుగా ఉంటుంది దీన్ని డైనమిక్ లోడింగ్ అంటారు. వంతెన పై వెళ్తున్నప్పుడు రైలు బరువు వలన వంతెన ఎక్కువగా ప్రకంపిస్తుంది. వంతెన ఫ్రేమ్ ను క్రింద స్తంభాలకు బిగించినప్పటికి, ఆ ఇనుప ఫ్రేమ్ లో అధిక భాగానికి డ్యాంపింగ్ ఉండదు. అందుకే మనకి రైలు వంతెన పై వెళ్తున్నప్పుడు ఎక్కువ శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి కారణంగా వంతెన యొక్క ప్రకంపనలు ఏర్పడతాయి.

అదే భూమి మీద అయితే అంత శబ్దం రాదు. ఎందుకంటే భూమి మీద రైలు వెళ్తున్నప్పుడు ఆ పట్టాలు యొక్క ప్రకంపనలను క్రింద అమర్చిన సిమెంట్ స్తంభాలు వాటి క్రింద వేసిన కంకర రాళ్ళ గుట్ట స్తంభాల మధ్యలో అమర్చే విధంగా పోస్తారు . దానితో పూర్తి ఘర్షణ జరిగి మనకు ఎక్కువ శబ్దం వినపడదు.
పట్టాల మధ్యలో ఏర్పడిన చిన్న ఖాళీల పై నుండి రైలు చక్రం వెళ్ళినప్పుడు వచ్చే డక్-డక్ శబ్దం. ఆ ఖాళీలు లేనప్పుడైతే రెండు ఇనుప ముక్కలను ఒకదానిపై ఒకటి గీస్తే వచ్చిన శబ్దంలాగా ఉంటుంది. ఇంకా క్రాసింగ్ వద్ద పట్టాలు మారుతున్నప్పుడు వచ్చే శబ్దం.
Also Read: వంతెనపై ఉన్నప్పుడు చైన్ లాగితే…ట్రైన్ తిరిగి కదలాలంటే ఇంత కష్టమా.?

బోగీలకు ఉండే బఫర్లు ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు వచ్చే శబ్దం కంటే వంతెన మీద వెళ్తున్నప్పుడు ఈ శబ్దాలతో పాటు, డైనమిక్ లోడింగ్ వలన వచ్చే ప్రకంపనల శబ్దం అధికంగా ఉండడం వలన మనకి ఎక్కువ శబ్దం వస్తుంది.
సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందరు తమ ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ వస్తుంటారు. కెరీర్ పీక్స్ లో ఉంది అంటే పెళ్లి చేసుకోవడానికి చాలా మంది భామలు అంగీకరించారు. అవకాశాలు ఉన్నంతమేర కెరీర్ ను కొనసాగించాలనే భావిస్తుంటారు. అయితే.. మరికొందరు మాత్రం ఇందుకు విరుద్ధం గా తమకు నచ్చిన వారిని వివాహం చేసేసుకుని తిరిగి కెరీర్ ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటె.. కొందరు హీరోయిన్లకు పెళ్లి అయిపోయిందన్న సంగతే చాలా మందికి తెలియదు. ఈ లిస్ట్ ను మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1 ఆకాంక్ష సింగ్:

సుమంత్ హీరో గా నటించిన “మళ్ళీ రావా” సినిమా లో హీరోయిన్ గా నటించిన ఆకాంక్ష సింగ్ కు ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. కునాల్ సైన్ అనే ఓ సీరియల్ నటుడిని ఈమె 2012 లోనే పెళ్లి చేసుకున్నారు. పహిల్వాన్’, ‘దేవదాస్’ సినిమాలలో కూడా ఆమె నటించింది.
ఇవి కూడా చదవండి : Daily Horoscope: Rashi Phalalu 09.01.2023 ఈ రాశుల వారికి పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు
#2 రాధికా ఆప్టే:

రాధికా ఆప్టే బాలీవుడ్ నటి అయినప్పటికీ.. తెలుగు వారికి కూడా సుపరిచితమే. ‘లెజెండ్’ ‘లయన్’, “రక్త చరిత్ర వంటి సినిమాల్లో రాధికా నటించారు. ఆమె బెనెడిక్ట్ టేలర్ అనే వ్యక్తిని డేటింగ్ చేసారు. ఆ తరువాత 2013 లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.
#3 అదితి రావు హైదరి:

మణిరత్నం “చెలియా” సినిమా తో అదితి రావు హైదరి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ‘సమ్మోహనం’ ‘నవాబ్’ ‘పద్మావత్’ , “అంతరిక్షం” , “వి” సినిమాలు ఆమెకు మరింత అగుర్తింపు తెచ్చాయి. ఆమెకు వివాహమైందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె 2009 లోనే సత్యదేవ్ మిశ్రా ను వివాహం చేసుకున్నారు.
#4 నజ్రియా :

‘ రాజా రాణి’ సినిమా తో నజ్రియా తెలుగు వారికి కూడా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె నాని “అంటే సుందరానికి” సినిమా లో నటిస్తున్నారు. ఈమెకు కూడా 2014 లోనే హీరో ఫహాద్ ఫాజిల్ తో పెళ్లి అయిపొయింది. హీరో ఫహాద్ ఫాజిల్ కూడా “పుష్ప” మూవీ తో తెలుగు వారికీ విలన్ గా పరిచయం కాబోతున్నారు.
#5 సనా ఖాన్:

కళ్యాణ్ రామ్ “కత్తి” సినిమా తో తెలుగు వారికి పరిచయమైన సనాఖాన్ ‘గగనం’ ‘మిస్టర్ నూకయ్య’ సినిమాల్లో కూడా నటించారు. ఆమె లాస్ట్ ఇయర్ లోనే సయ్యద్ ను వివాహం చేసుకున్నారు.
#6 నీతి టేలర్ :

“మేం వయసుకు వచ్చాం” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన నీతి టేలర్ గత సంవత్సరమే పరీక్షిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
#7 షాలిని వడ్నీకట్టి:

‘భానుమతి అండ్ రామకృష్ణ’, ‘యురేకా’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన షాలిని కూడా వివాహమైంది. గతేడాది డైరెక్టర్ మనోజ్ బీదను షాలిని వివాహం చేసుకున్నారు.
#8 అనీషా అంబ్రోస్:

అనీషా అంబ్రోస్ “అలియాస్ జానకి అనే సినిమాలో నటించారు. “సర్దార్ గబ్బర్ సింగ్” లో కూడా అనీషా అంబ్రోస్ కు అవకాశం లభించింది. అయితే, అనుకోని రీసన్స్ వలన లాస్ట్ మినిట్ లో ఆమె తప్పుకున్నారు. “సెవెన్”, “గోపాల గోపాల” సినిమాల్లో కూడా అనీషా అంబ్రోస్ నటించారు. 2019 లోనే అనీషా అంబ్రోస్ గుణనాధ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
#9 మమతా మోహన్ దాస్ :

మమతా మోహన్ దాస్ తెలుగువారికి సుపరిచితమే. యమదొంగ, విక్టరీ, చింతకాయల రవి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. ఆమె 2011 లోనే పరాజిత్ పద్మనాభన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే 2012 లోనే వీరు విడిపోయారు.
పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులకు అతి ముఖ్యమైన బాధ్యత. వారు పెరిగే విధానం బట్టే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు.
తల్లిదండ్రుల నడవడికను పిల్లలు అనుసరిస్తుంటారు. ఒకసారి తల్లిదండ్రులు తెలుసో తెలియకో పిల్లల ముందు కొన్ని మాటలు కోపంతో అనేస్తుంటారు. కానీ పిల్లలు మనం చేసే ప్రతి పనిని గమనిస్తుంటారు. పిల్లల పెంపకంలో మనం ఎంతో జాగ్రత్త వహించాలి.

ఇప్పుడు మనం పిల్లల ముందు చెయ్యకూడని ఆ అయిదు పనులు ఏంటో తెలుసుకుందాం..
#1. అబద్దాలు చెప్పడం :
కొన్ని విషయాలలో తల్లిదండ్రులు అసలు విషయం గురించి చెప్పకుండా అబద్ధాలు చెబుతుంటారు. అదేవిధంగా ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా అబద్దం చెప్పమని అడుగుతారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు అది అలవాటుగా మారుతుంది.

చివరకు తల్లిదండ్రులు నేర్పించిన ఈ అబద్దం అనే మాటనే వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రతి విషయంలో తల్లిదండ్రులకు అబద్ధం చెప్పే విధంగా తయారవుతారు. దీనివలన భవిష్యత్తులో తల్లిదండ్రులు పిల్లలతో అనేక సమస్యలు ఎదుర్కొంటారు.
#2. బాడీ షేమింగ్ :
తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలను రూపురేఖల గురించి గాని, మాట తీరు గురించి గాని ఎప్పుడూ వంకలు పెట్టకూడదు. నువ్వు ఎక్కువగా తింటున్నావ్ నువ్వు చూడటానికి లావుగా ఉన్నావు అని తల్లిదండ్రులు అనడం వల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. వారు చేసే ప్రతి పనిలోను ఇబ్బంది పడుతుంటారు.

తనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు ముందు చెప్పడానికి వెనకాడతారు. ఇలా తల్లిదండ్రులు చేయడం అనేది చాలా పెద్ద తప్పు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మసౌందర్యం మిన్న అనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులు నేర్పించాలి.
#3. ఇతరులతో పోల్చడం :

మీ పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చకూడదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చుతారో, వారిలోని సొంతంగా అభివృద్ధి చెందే ఆత్మన్యూనతభావాన్ని చంపేసినవారు అవుతారు. దీనివల్ల పిల్లలకు అసూయ, ఈర్ష్య అనే భావనలు పెరుగుతాయి. ఈ విధంగా పిల్లలను ఇతరులతో పోల్చడం అనేది మనదేశంలో తల్లిదండ్రులు ఎక్కువగానే చేస్తుంటారు.
#4. క్రమశిక్షణ లేకపోవడం :

తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువు. తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని పిల్లలు గమనిస్తుంటారు. పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండడమే మంచిది. పిల్లలు కూడా తల్లిదండ్రులు చేసే పనిని అనుసరించి దారి తప్పే ప్రమాదం ఉంటుంది.
#5. అసహ్యకరమైన ప్రవర్తన :

ఒకసారి తల్లిదండ్రులు కోపంతో పిల్లల ముందు అసహ్యంగా మాట్లాడుకుంటూ గొడవ పడుతుంటారు. ఇలా చేయడం వలన పిల్లలు మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లలకు తెలియకపోవడమే మంచిది.
Note: Images used in this article are reference purposes only.
స్టార్ హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ఊహించని విధంగా ఈ మూవీ ప్లాప్ అయ్యింది. అయితే ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే కోరాలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

“శాకుంతలం చిత్రంపై మీ సమీక్ష ఏంటి..” అనే ప్రశ్న వచ్చింది కోరా లో.. దానికి లలిత ఊరకరణం అనే యూజర్ ఫన్నీ గా ఆన్సర్ ఇచ్చారు. ” ఈ సినిమా తీసిన వాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనుకుంటా.. అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో బోలెడన్ని గ్రాఫిక్స్ జంతుజాలం ఉంటాయి. ఆశ్రమ జీవన విధానం అంటే మరీ ప్రతి ఫ్రేమ్ లో ఇరుక్కొని అన్ని జంతువులు ఉండాలా అని అనుమానం కూడా వచ్చింది.

ఇక ఈ సినిమా మొత్తం పాపం ఆ గ్రాఫిక్స్ ఉద్యోగుల కష్టమే అనిపిస్తుంది. సమంత గారి పరిచయ దృశ్యం నుంచి.. గ్రాఫిక్స్ సీతాకోక చిలుకలని ఎగర కొట్టడానికి మన హీరో గారు సమంత పాదాల దగ్గర నుండి బాణంతో నిటారుగా ఓ CGI పూవుని పైకి వదిలే సరికి అవన్నీ పైకి ఎగిరిపోయి సమంత గారి సుందర వదనం హీరో గారికి దర్శనం ఇస్తుంది. పోనీ ఈ గ్రాఫిక్స్ సంగతి పక్కన పెడితే శకుంతల కథ అంటేనే ఒక అద్భుత ప్రేమ కావ్యం.

కానీ సమంత అంతటి నటీమణిని తెచ్చుకున్నప్పుడు సాధారణమైన ప్రేమ కథ రాసేస్తే సరిపోదు కదా.. అందుకే దుష్యంతుడు ప్రేమిస్తున్నా అని చెప్తే ‘ అమ్మా నాన్న ల ప్రేమ కి దూరమైన నేను…’ అంటూ ఏదో చెప్తుంది. ఆ డైలాగ్స్ కి ఆమె హావభావాలకి సంబంధం ఉండదు. కాళిదాసు గారు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలో, పిన వీరభద్రుడు గారు రాసిన శృంగార శాకుంతలంలో ఇలా లేనట్టు గుర్తు నాకు.

ఇక కథ క్లైమాక్స్ కి వచ్చేసరికి.. ఉంగరం చూశాక శకుంతల గుర్తొచ్చిన దుష్యంతుడు మద్య పానం చేస్తూ అర్జున్ రెడ్డి మోడ్ లోకి వెళ్తాడు. కానీ ఈ మూవీలో దుష్యంతుడు వేసుకునే దుస్తులు మాత్రం కలర్ఫుల్ గా ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సుల్లాగా.. ఇక సమంత జుట్టుకు తగిలించిన మొగ్గల దండలని చూస్తే, తల్లో పేలు గుర్తురాక మానదు. ఇక మధ్యలో మధుబాల, ప్రకాష్ రాజ్, ఆ కాలనేమి రాక్షసుల గోల.

భరతుడిగా వేసిన బుజ్జి పాప అర్హ ముద్దుగా నటించింది. ఈ సినిమాని అంత భారీ ఖర్చుతో, భారీ తారాగణంతో కాకుండా చక్కగా కొత్త తారలతో తక్కువ బడ్జెట్ లో ఓటీటీ కోసం తీసినా బాగుండేది. నా వరకు అయితే ప్రియంవద గా చేసినమ్మాయి శకుంతల పాత్ర చేస్తే బాగుండేది.” అని లలిత ఊరకరణం శాకుంతలం సినిమాని విశ్లేషించారు.
Also read: ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..? ఏంటి దీని కథ..?
