సుశీల.. తెలుగు సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. దాదాపు నలభై సంవత్సరాలుగా ఆమె తన సంగీత జీవితాన్ని కొనసాగించారు.
ఆమె తన పాటల ద్వారా ఎన్నో జాతీయ పురస్కారాలను కూడా పొందారు. గానకోకిలగా పేరు తెచ్చుకున్న సుశీలను కూడా బాధ పెట్టిన పాట ఒకటి ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సుశీల కన్నతల్లి అనే సినిమాతో నేపధ్య గాయనిగా పరిచయం అయ్యారు. అయితే కొన్ని పాటలను ఆమె తనకు ఇష్టం లేకపోయినా పాడాల్సి వచ్చింది. “డ్రైవర్ రాముడు” సినిమాలో “గుగ్గుగ్గుగ్గు గుడిసెందీ మమ్మమ్మమ్మ మంచముంది ” అంటూ ఆమె ఓ పాట పాడారు. ఇది పాడిన తరువాత ఆమె చాలా బాధపడ్డారట. ఇష్టం లేకపోయినా ఆ పాట పాడాల్సి వచ్చింది అంటూ బాధపడ్డారు.























