కరోనా మహమ్మారి తగ్గింది అని అనుకుంటూనే ఉన్న సమయం లో కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. సెకండ్ వేవ్ ఉద్ధృతం ఇంకా తగ్గలేదని.. గత 24 గంటలలో నమోదైన కేసులే చెబుతున్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తం గా 32,906 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే దాదాపు 2,020 మంది కరోనా కారణం గా ప్రాణాలు వదిలారు.

ఇప్పటివరకు 3,09,07,282 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 4,32,778 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తం గా 4,10,784 మంది కరోనా కారణం గా మృత్యువాత పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లోనే, తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళండి.



















































