కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి, మాస్కులు మన జీవితం లో భాగం అయ్యాయి. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ ను పాటించడం ద్వారా మనం కరోనా పై యుద్ధాన్ని చేస్తున్నాం. అయితే, లాక్ డౌన్ తరువాత అన్ని షాపింగ్ మాల్స్, స్టోర్స్ తెరుచుకున్నాయి. అందరు మాస్కును ధరించడం తప్పనిసరి చేస్తున్నారు. హోటల్స్ కి వెళ్లాలన్న, షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేయాలన్న మాస్క్ ని ధరించడం మాత్రం తప్పనిసరి. ఈ క్రమం లో హైదరాబాద్ లో ని ఓ షాపింగ్ స్టోర్ మాస్కుల వాడకం ప్రోత్సహించడానికి వినూత్నం గా ప్రయత్నించింది.

నగరం లోని ప్రముఖ స్టోర్ మక్దూమ్ బ్రదర్స్ మాస్క్ మహారాజా తో ముందుకొచ్చింది. ఈ స్టోర్ కు 132 సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. తాజాగా, ఈ స్టోర్ బయట 10 అడుగుల బొమ్మను ఏర్పాటు చేసారు. ఈ బొమ్మ కు ఫేస్ మాస్క్ లతో కుట్టబడిన సూటు ను వేశారు. ఇందుకోసం మొత్తం 250 మెడికల్ మాస్క్లను వినియోగించారు. మక్డూమ్ బ్రదర్స్ తయారుచేయించి న ఈ సూట్ ప్రపంచంలోనే ఎత్తైన బొమ్మగా రికార్డు సృష్టించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించి ఎవరికీ వారు రక్షణ పొందడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని స్టోర్ యజమానులలో ఒకరైన ఫైజ్ మొహియుద్దీన్ చెబుతుంటారు.

హైదరాబాద్ ను పాలించిన నిజాం రాజులకు మక్దూమ్ బ్రదర్స్ అందించారు. భారత్ కు వచ్చిన నాయకులకు వారి బ్రాండ్ దుస్తుల్ని అందిస్తూ.. ఈ బ్రాండ్ ను ప్రపంచానికే పరిచయం చేసారు. ఇంకా ఇతర ప్రముఖులకు, క్రికెటర్లకు, షేర్వాణీలకు కూడా మక్దూమ్ బ్రదర్స్ వారి బ్రాండ్ దుస్తులను అందించారు. తాజాగా, ఈ మాస్క్ మహారాజా సూట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పలు చిన్న వ్యాపారాలు సైతం ఈ సూట్ గురించి హర్షిస్తున్నారు. కనికరం లేని కరోనా పై పోరాటం చేయడానికి ఉన్న ఏకైక ఆయుధం మాస్క్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టోర్ ని మక్దూమ్ బ్రదర్స్ నాలుగవ తరం నడుపుతోంది. వీరు కూడా సామజిక అంశాలపై బాధ్యతాయుతం గా స్పందిస్తున్నారు.

లాక్ డౌన్ కారణం గా వీరి దుకాణం లో కూడా వ్యాపారం మందగించింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత ఈ మధ్యే తిరిగి పుంజుకుంటోందనిఫైజ్ మొహియుద్దీన్ తెలిపారు. రెండో వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపధ్యం లో పెద్ద సైజు లో ఉండే మాస్క్ ధరించి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే, కస్టమర్లలో మాస్క్ ధరించే అలవాటు ను పెంపొందించడం కోసం, మాస్క్ లు ధరించి వచ్చే కస్టమర్ల ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు ఫైజ్ మొహియుద్దీన్ తెలిపారు.
watch video:


























సినీ ఇండస్ట్రీకి న వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే , నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ సంచలనం సృష్టించింది నటి, హిందీ బిగ్బాస్-13 మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. పెద్ద నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాలు , సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమైన నటి రష్మీ దేశాయ్. సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13 లో థర్డ్ రన్నరప్ కూడా. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించింది. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.
పదమూడేళ్ల క్రిందట తాను కెరీర్ ప్రారంభించానని, అప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టానని, నటనపై ఇంట్రస్ట్ తో ఇటువైపొచ్చనని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆఫర్స్ ఇప్పిస్తాను అనే వంకతో సూరజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేకపోయేసరికి సూరజ్ నిజంగానే అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మాను . కానీ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రావాలంటే లైంగికంగా లొంగాల్సిందే అని చెప్పేవాడని, అలా చాలా సార్లు తనను లొంగగదీసుకునే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.
పెద్ద నిర్మాత యశ్ రాజ్తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని తన నెంబర్ తీసుకున్న సూరజ్. ఓసారి ఫోన్ చేసి ఆడిషన్కి రమ్మన్నాడు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్లో అతనొక్కడే ఉండడంతో డౌటొచ్చింది . దాంతో వెళ్లిపోతానని చెప్తే కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చి, అది తాగాల్సిందిగా బలవంతం చేశాడు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపాడని, దాన్ని తాగించి అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశాడని రశ్మి తెలిపింది.
అక్కడినుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి, ఆ తర్వాత అమ్మతో జరిగినదంతా చెప్పాను . దీంతో అమ్మ సూరజ్ ని పిలిపించి ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందని, ఈ పని నేనే చేసి ఉండాల్సిందని అనిపిస్తుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన రశ్మి చేసిన కామెంట్స్ తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వైరలవుతోంది.


































