సినిమాలో ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోతున్నారు ఈ మధ్య…సరైన డైలాగ్ చిన్నదో…పెద్దదో…ఆడియన్స్ కి రీచ్ అయితే చాలు వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది…ఒక్కోసారి ఆ డైలాగ్ వల్లే సినిమా మొత్తానికి క్రేజ్ ఏర్పడుతుంది.
తాజాగా కన్యాకుమారి అనే సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానాన్ని తెరకెక్కించిన దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్నారు. గీత్ సైని, శ్రీ చరణ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు.

టీజర్ మొత్తం హీరోయిన్ గీత్ సైని బాగా ఫేమస్ అయ్యారు.మొత్తంగా ఆమె కనిపించారు. ఈ టీజర్ చూస్తుంటే ఆమె చుట్టూనే కథ తిరగనుంది అని అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా టీజర్ ఎండింగ్ లో వచ్చిన డైలాగ్ మాత్రం బాగా ఫేమస్ అయింది. హీరోయిన్ ఒక చీరల షాప్ లో ఉండి రకరకాల చీరల గురించి చెబుతూ ఇలా నేర్చుకోవాలి అంటే చెప్పే డైలాగ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గుక్కతిప్పుకోకుండా చెప్పిన ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఈ డైలాగ్ కారణంగా సినిమా మీద ఆసక్తి పెరిగింది.
watch video :

నిజాంల హయాంలో సాలార్ జంగ్ I చేత 1872లో ‘మదర్సా-ఎ-అలియా’ స్థాపించబడింది. నగరంలోని అత్యంత పురాతనమైనది. రాజుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సంస్థ. 1949లో కింగ్ కోఠి ప్యాలెస్ సమీపంలో ఉన్న పాఠశాల ఆ తరువాత గన్ఫౌండ్రీ క్యాంపస్కు మార్చబడింది. 1960ల వరకు ఈ స్కూల్ హైదరాబాద్లోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటిగా ఉంది. ఈ పాఠశాల ఆంగ్లో-ఇండియన్లచే నిర్వహించబడింది. అయితే ఆపరేషన్ పోలో తర్వాత పాఠశాల నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.
ఇదే ఆ పాఠశాల పతనానికి కారణమైందని అంటారు. ఈ పాఠశాల భవనం వారసత్వ భవన లిస్ట్ లో చేర్చబడింది. ఈ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ల నుండి క్రీడా సౌకర్యాల వరకు అన్నింటిని కలిగి ఉంది. ఈ స్కూల్ నుండి చాలా మంది ప్రముఖులు బయటకు వచ్చారు. ఉదాహరణకు, నలుగురు గవర్నర్లు, అలీ యావర్ జంగ్ (మహారాష్ట్ర), మెహదీ నవాజ్ జంగ్ ( గుజరాత్), ఇద్రిస్ హసన్ లతీఫ్ (విమాన సిబ్బంది చీఫ్) ఈ స్కూల్ లోనే చదువుకున్నారు” అని మాజీ ఐఏఎస్ మరియు 1971 బ్యాచ్ పూర్వ విద్యార్థి మహమ్మద్ అలీ రఫత్ చెప్పుకొచ్చారు.
పూర్వ విద్యార్ధులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల చర్చలు జరిపారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు, పాఠశాలలో పదవ తరగతికి చెందిన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు అలియా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం విద్యార్థులకు 150 ప్యూర్ సిల్వర్ మెడల్స్ కూడా ప్రదానం చేశారు.
సంగీత దర్శకులు తమ సినిమాలలో ఒకటి లేదా రెండు పాటలు పడడం అందరికీ తెలిసిందే. అయితే ఆర్పీ పట్నాయక్ మాత్రం సినిమాలోని అన్ని పాటలు ఆయనే పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్పీ లాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా చాలా సినిమాలలో మొత్తం పాటలు పాడారు. అయితే టాలీవుడ్ లో ఈ సినిమా కోసం తెలుగు టాప్ 10 సంగీత దర్శకులు కలిసి ఒక పాటను పాడారు. ఆ సినిమా పేరు అందమైన మనసులో.
సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన తరువాత, ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వైపుకు వెళ్లారు. అలా 2008 లో మొదటి సారిగా ‘అందమైన మనసులో’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజీవ్, రమ్య నంబీషన్ జంటగా నటించారు. ఈ సినిమాలోని “అమ్మాయి నవ్వింది.. అబ్బాయికి నచ్చింది” అనే పాటను పది మంది ప్రముఖ సంగీత దర్శకులు ఆలపించారు.
ఈ పాటను ఆలపించిన వారిలో ఆస్కార్ గ్రహీత ఎం ఎం కిరవాణి, రాజ్, కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్, ఆర్ పి పట్నాయక్, రమణ గోగుల, చక్రి, శ్రీ కొమ్మినేని, వందేమాతరం శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ ఉన్నారు. పది మంది అగ్ర సంగీత దర్శకులు కలిసి పాడటం అనేది ప్రత్యేకమైనది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పాడటం అరుదైన విషయం అని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి పాట తెలుగులో రాదేమో. ఈ పాటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.



రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ సినిమా జో. ఈ చిత్రానికి హరిహరన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని విజన్ సినిమా హౌస్ బ్యానర్ పై నిర్మించారు. సిద్ధు కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 2023 లో నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల ఆదరణ పొందింది. జనవరి 15 నుండి ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, బాగా డబ్బున్న కుటుంబానికి ఏకైక వారసుడు జో (రియో రాజ్), చిన్నతనం నుండి జోకి ఐదుగురు మిత్రులు ఉంటారు. ఎక్కడికి అయినా ఆ ఫ్రెండ్స్ తో వెళ్తుంటాడు. జోకాలేజీలో, తన క్లాస్మేట్ గా కొత్తగా సుచి (మాళవిక మనోజ్) జాయిన్ అవుతుంది. కేరళకు చెందిన సుచి సెన్సిటివ్, మృదుస్వభావి కావడంతో ఆమెను ఇష్టపడతాడు. ఆమెను వేధిస్తున్న సీనియర్ నుండి సేవ్ చేస్తాడు. ఆ క్రమంలో ఇద్దరి ఆమధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
అయితే సుచి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. విషయం తెలిసిన సుచి ‘జో’ కి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి, తన తల్లిదండ్రులతో తమ పెళ్లి గురించి మాట్లాడమని చెబుతుంది. దాంతో ‘జో’ సుచి ఇంటికి వెళతాడు. వారి ప్రేమ గురించి తల్లిదండ్రులతో ప్రేమ, పెళ్లి గురించి ప్రయత్నిస్తాడు. కానీ వారి బంధువులు ‘జో’ ను కొడతారు. అది గోడవగా మారుతుంది. ఆ క్రమంలో సుచి తండ్రి క్రింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుచి జో పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జో చెప్పేది వినకుండా తనను ఇక మీదట కలవవద్దని చెప్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? వారిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించారా? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
వై ఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు రాజా రెడ్డి వివాహం ప్రియా అల్లూరితో ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లికి ఆహ్వానిస్తూ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
అంతేకాకుండా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఆహ్వాన పత్రికలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ నిశ్చితార్ధంకు నారా లోకేష్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఈ ఆహ్వానంను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల కోరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడుక పై అందరి దృష్టి పడింది. ఎవరెవరు హాజరు అవుతారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
సాయి పల్లవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉనడకపోయినా, ఆమె సోదరి పూజా కన్నన్ మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పూజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సాయి పల్లవికి, తనకు, సంబంధించిన ఫోటోలను పూజ షేర్ చేస్తుంటుంది. ఆమె తన అక్క దారిలోనే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2021లో విడుదలైన కోలీవుడ్ మూవీ ‘చిత్తిరాయి సెవ్వానం’ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. సముద్ర ఖని కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా తరువాత పూజాకన్నన్ సినిమాల పై దృష్టి పెట్టలేదు.
సాయి పల్లవి పెళ్లి విషయం గురించి బయటకు రాలేదు. అయితే పూజాకన్నన్ తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతనితో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ” నా అందమైన లిల్ బటన్ నిస్వార్థంగా ప్రేమించడం, సహనం, ప్రేమలో స్థిరంగా ఉండటం మరియు మనోహరంగా ఉండటం నేర్పించాడు. ఈ వినీత్ నా సూర్య కిరణం. క్రైమ్లో నా పార్ట్నర్, ఇప్పుడు, నా లైఫ్ పార్ట్నర్” అంటూ రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే కొందరు నెటిజెన్లు మాత్రం అక్క కన్నా ముందే పెళ్లిచేసుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందులో తప్పు ఏం ఉందని ఆమె పై అలా కామెంట్స్ చేస్తున్నారు. అలా ఎంతోమంది పెళ్లి చేసుకున్నారు. ఈరోజుల్లో ఇలాంటివి సర్వసాధారణం.
ఈటీవీ శ్రీదేవి డ్రామ కంపెనీ షోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షోని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక ఈషో ద్వారా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య గాజువాక లేడి కండక్టర్ ఝాన్సీ పల్సర్ బైక్ సాంగ్ కి డ్యాన్స్ వేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి రష్మి గౌతం యాంకర్ గా చేస్తున్నారు. వారం వారం కొత్త కొత్త థీమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చే శ్రీదేవి డ్రామ కంపెనీలో హైపర్ ఆది, ఫైమా, సత్య వంటి పలువురు పాల్గొన్నారు. జనవరి 7 న ప్రసారం అయిన శ్రీదేవి డ్రామ కంపెనీలో ఎప్పటిలానే కొందరు సింగర్స్ పాటలు పాడారు. హైపర్ ఆది స్కిట్ వంటివి ఆడియెన్స్ ని అలరించాయి.
అయితే ఈ షోలో నైటీ థీమ్ డ్యాన్స్ లో సత్య, ఫైమా తదితరులు నైటీలు ధరించి వేసిన డ్యాన్స్ వీడియోకి మాత్రం యూట్యూబ్ లో నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. “కొరియోగ్రాఫర్ కు బుద్దిలేదు అనుకుంటే ఆడేవారికి సిగ్గు ఉండక్కర్లేదా. ఆ ఇంద్రజ కు రష్మీకి వేసి ఆడిస్తే ఇంకా మంచి రేటింగ్ వస్తుంది కదా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సంక్రాంతి వచ్చిందంటే, కోస్తా తీరంలో కోళ్ల పందేలు జోరుగా సాగుతుంటాయి. సంక్రాంతి మూడు రోజుల పాటు ఈ పందాలు కొనసాగుతుంటాయి. వీటిని వృత్తిగా బ్రతుకుతున్నవారు ఉన్నారు. ఇక ఈ కోడిపందెలా కోసం ఇతర రాష్ట్రాల నుండే కాకుండా, విదేశాల నుండి సైతం వచ్చేవారు ఉన్నారు. జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా, ఈ పందేలు జరుగుతూనే ఉన్నాయి. పందెం రాయుళ్లు కోడిపందాల విషయంలో ఎంతో సీరియస్ గా ఉంటారు. కోడిపందాల నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. తమ కోడిపుంజే గెలవాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
కోనసీమ జిల్లా అమలాపురంలో కోడిపందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కోడి పందేల పేరుతో గుండాటలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో కోడి పందేలు 250 చోట్ల జరుగుతున్నాయి. కోడి పందెములు వేసేటప్పుడు కుక్కుట శాస్త్రాన్నిచదువుతారట. అయితే కోడి పందేలు అనేవి ఎలా మొదలు అయ్యాయో శ్రీ గరికపాటి నరసింహ రావు వివరించారు. ఆయన మాట్లాడుతూ ” కోడి పందేలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే పూర్వం, మహా యుద్దాలు తప్పవు అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు, యుద్ధాలు చేస్తే కొన్ని లక్షలమంది ప్రజలు చనిపోతారు.
అనవసరంగా పౌరుషాల కోసం, రాజ్య భాగం కోసం. ఈ పక్షం నుండి ఒక కోడిని, ఆ పక్షం నుండి ఒక కోడిని ఎంపిక చేసి, ఒక మంచి స్థలంలో రెండింటికీ పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోయినా లేదా పారిపోయినా వాళ్ళు ఒడిపోయినట్లు, మిగిలిన వారు గెలిచినట్టు అని చెప్పారంట. భారీ జన నష్టాన్ని తప్పించడం కోసం, యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పడం కోసం ఈ కోడి పందెలను ఏర్పాటుచేశారు. అందుకు ఉదాహరణ పల్నాటి యుద్ధం. ఇలాంటి పందెలను సంక్రాంతి పండుగకు ఆడటం తప్పు అయితే, జనవరి నెల అంతా ఆడటం, ఏడాది అంతా ఆడటం ఇంకా దుర్మార్గం” అని అన్నారు.