ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే సినిమా గురించి మాట్లాడుతున్నారు. అదే ప్రభాస్ హీరోగా నటించిన ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2898 ఏడి. సినిమాలో భారీ తారాగణం ఉంది. అంతకంటే భారీ బడ్జెట్ తో సినిమాని కూడా తెరకెక్కించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే మరొక సినిమా ఇది అవుతుంది అని ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన వీడియోలు చూస్తుంటే అర్థం అవుతోంది. రేపు ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరితో పాటు టీజర్ లో దృష్టిపడిన మరొక నటుడు పశుపతి. పశుపతి తమిళ నటుడు.

అయినా కూడా తెలుగులో గుర్తింపు పొందారు. తెలుగులో కొన్ని సినిమాల్లో మాత్రమే పశుపతి నటించారు. కానీ ఆయన నటనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే టీజర్ లో అందరి కంటే ఎక్కువ పశుపతి హైలైట్ అయ్యారు. ఈ సినిమా కంటే ముందే పశుపతి నటించిన ఒక సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. నిజ జీవితం ఆధారంగా ఆ సినిమా రూపొందింది. ఆర్య హీరోగా నటించిన సార్పట్ట పరంపర సినిమా ద్వారా పశుపతి తెలుగు వారికి కూడా దగ్గర అయ్యారు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల అయ్యింది. పా రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరో గురువు, మాజీ బాక్సర్ అయిన రంగయ్య అనే పాత్రలో పశుపతి నటించారు. పశుపతి ఈ సినిమాలో నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే మనకే బాధనిపిస్తుంది. అంత బాగా నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సమర అలియాస్ సామ్రాజ్యం (ఆర్య) కి బాక్సింగ్ అంటే చిన్నప్పటినుండి ఇష్టం ఉంటుంది. క్లాసులు కూడా ఎగగొట్టి బాక్సింగ్ చూడడానికి వెళ్లేవాడు. కానీ అతని తల్లి భాగ్యం(అనుపమ కుమార్) కి బాక్సింగ్ అంటే ఇష్టం ఉండదు.
ఈ కారణంగానే సామ్రాజ్యం ఉత్తర చెన్నైలో ఉన్న హార్బర్లో హమాలి కూలిగా పనిచేస్తూ ఉంటాడు. ఈ బృందాన్ని వాళ్ల గురువు, మాజీ బాక్సర్ అయిన మాజీ బాక్సర్ రంగయ్య (పశుపతి) నడిపిస్తూ ఉంటాడు. ఒకసారి రంగయ్యకి బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) వల్ల అవమానం జరుగుతుంది. అప్పుడు సామ్రాజ్యం బాక్సింగ్ లోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. 1975 ప్రాంతంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమాలో సెట్టింగ్స్ చాలా బాగా అనిపిస్తాయి.
అప్పటి కాలాన్ని గుర్తుచేసే లాగానే ఉంటాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ కి తోడు, టెక్నికల్ గా కూడా సినిమా బాగుండడం, మంచి స్క్రీన్ ప్లే ఉండడం, వీటన్నిటితో పాటు, సంతోష్ నారాయణన్ మంచి సంగీతం అందించడం కూడా ఈ సినిమాకి అదనంగా బలాన్ని ఇచ్చాయి. డబ్బింగ్ సినిమా చూస్తున్న ఆలోచన రాదు. డబ్బింగ్ లో కూడా అంత బాగా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా కూడా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్నట్టు ప్రకటించారు. 2026 లో ఈ సినిమా విడుదల అవుతుంది.


బాబూరావు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత ఏదైనా సాధించాలని హైదరాబాద్కు వచ్చారు. అయితే నగరానికి వచ్చిన తొలి రోజుల్లో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై కూడా పడుకున్నాడు. మొదట్లో బట్టల షాప్ లో పనిచేశారు. కొన్ని చిన్న ఉద్యోగాలను చేశాడు. హోటల్ లో పనిచేస్తే కనీసం తినడానికి ఆహారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో కేఫ్లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అలా కేఫ్లో క్లీనర్గా పనిచేయం ప్రారంభించిన బాబూరావు వెయిటర్గా ప్రమోషన్ పొందాడు. ఆ తరువాత బిస్కెట్లు, టీ తయారు చేశాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ 1978 నాటికి బాబురావు కేఫ్ను నడిపే స్థితి వచ్చాడు. కేఫ్ నడిపే కాంట్రాక్ట్ పై సంతకం చేశారు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, బాబూరావు కేఫ్ యాజమాన్యానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కష్టపడుతూ 1993 సంవత్సరం నాటికి కేఫ్ను సొంతం చేసుకోవడానికి అవసరం అయిన డబ్బును సంపాదించాడు. అప్పటి నుండి బాబూరావు ఓనర్ గా మారి, కేఫ్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. మూడు అవుట్లెట్ల యజమానిగా మారిన బాబూ రావు తన మూలాలను మర్చిపోలేదు.
ఈ కేఫ్ ద్వారా పేదవారికి సాయం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ షాపులో మిగిలిన బిస్కెట్లను, బ్రెడ్లను పేద వారికి పంచుతుంటారు. ఆయన తండ్రి కోరిక మేరకు 25 ఏళ్ల నుంచి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిలోఫర్ హాస్పిటల్ మరియు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న పేషంట్లకు, పేదవారికి ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఐదు వందల మందికి అల్పాహారం, మూడు వందల మందికి భోజనం అందిస్తున్నారు.





















