యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ విడుదల అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో శ్రీయా రెడ్డి నటించారు. రాధ రామ అనే క్యారెక్టర్ లో అలరించారు.
ఈ క్యారెక్టర్ సలార్ సినిమాకి కీలకంగా మారింది శ్రీయ రెడ్డి నటనకి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన వారందరూ శ్రీయా రెడ్డి ఎవరు అంటూ ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టారు. అయితే శ్రీయా రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటి ఆమె పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం….!

శ్రీయా రెడ్డి 28 నవంబరు 1983 లో జన్మించారు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. గిరి స్టార్టింగ్ లో యాంకర్ గా , విజెగా పనిచేశారు. తర్వాత పలు సౌత్ ఇండియా భాషల్లో కూడా నటించారు. శ్రీయా తండ్రి మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి. సినిమాల్లోకి రాకముందు ఎస్.ఎస్.మ్యూజిక్ చానల్లో వీడియో జాకీగా పనిచేసారురు. 2002లో సమురాయ్ అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. ఆమె నటించిన బ్లాక్, తిమిరు, కాంచీవరం వంటి సినిమాల్లోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దొరికాయి.

తర్వాత తెలుగు,మలయాళీ చిత్రల్లో కూడా నటించారు. శ్రీయా రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంతోటి ఎంట్రీ ఇచ్చారు తర్వాత 2006లో అమ్మ చెప్పింది అనే చిత్రంలో నటించారు. తర్వాత తెలుగులో మరే చిత్రంలోను నటించలేదు.తాజాగా ప్రభాస్ సలార్ సినిమాలో మళ్ళీ కనిపించారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రంలో కూడా శ్రీయా రెడ్డి కీలకపాత్రలో నటిస్తున్నారు



డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించిందని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా సలార్ మూవీలో ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడని టాక్. కథపరంగా ఎలా ఉన్నా సినిమాలో ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఉండడంతో ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట్లో ఎక్కడ చూసినా సలార్ మేనియా కనిపిస్తోంది.
అయితే ‘సలార్’ టీజర్ లో ఓ తాత, హీరో ప్రభాస్ని ‘డైనోసర్’తో పోల్చడం తెలిసిందే. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా ప్రమోషన్స్లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి కూడా ‘డైనోసర్ ఎపిసోడ్’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పడం తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన తరువాత జక్కన్నతో పాటు , ఫ్యాన్స్, ఆడియెన్స్ నిరాశ పడినట్టున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘సలార్ పార్ట్-1’ లో ఆ ఎపిసోడ్ మిస్ అయ్యింది. బహుశా పార్ట్-1 లో ఉండొచ్చేమో.
ఈ సన్నివేశం మాత్రమే కాకుండా మరో రెండు సన్నివేశాలు కూడా సలార్ పార్ట్-1 మిస్ అయినట్టు తెలుస్తోంది. సూరిడీ పాటలో భయపడి లేచిన పృధ్వీ రాజ్ తో ‘ఒరే నేనున్నా కదా పడుకో’ అంటూ ప్రభాస్, కి చెప్పే సీన్ కాగా, మూడవది కార్ సీన్, దాంతో ఈ సీన్స్ ఎందుకు పెట్టలేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సీక్వెల్ లో ఈ సీన్స్ ఉంటాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక కార్పొరేట్ కంపెనీ సంస్థ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్ చేతితో వ్రాసిన, రెండు పేరాల రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రింకూ పటేల్ అనే మహిళ మిట్షీ ఇండియా కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల ఆమె రాజీనామా చేశారు. రింకూ పటేల్ రాజీనామా లెటర్ వ్రాసే విషయంలో డిఫరెంట్ గా ఆలోచించింది.
డిసెంబర్ 15న తన మేనేజింగ్ డైరెక్టర్కి, పిల్లలు స్కూల్లో ఉపయోగించే నోట్బుక్లో కనిపించే ఒక రూల్ కాగితంపై వ్రాసిన చేతితో రాసిన రాజీనామా లేఖను సమర్పించారు. అంతేకాకుండా ఈ లేఖ స్టాక్ ఎక్స్ఛేంజ్కు కూడా పంపించారు. ఆ లేఖలో ” వ్యక్తిగత కారణాల” కారణంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్ట్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. లేఖ కాపీని డిసెంబర్ 21న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్లో పంచుకున్నారు.
అక్కడి నుండి అది సోషల్ మీడియాలోకి వచ్చింది. చేతిరాతతో రాసిన రాజీనామా లేఖ వైరల్గా మారింది. రాయిటర్స్ రిపోర్టర్ సేతురామన్ ఎన్ఆర్ రింకూ పటేల్ చేతితో రాసిన రాజీనామా లేఖ ఫోటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో షేర్ చేశారు. క్యాప్షన్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ‘తన పిల్లల రఫ్ నోట్ పుస్తకం నుండి ఒక పేజీని తీసుకుని, దానిలో రాజీనామా లేఖ వ్రాసినట్లు’ అనిపించిందని రాసుకొచ్చారు.
నటుడు రాజ్ బి. శెట్టి కన్నడ చిత్రసీమలో ఓ ట్రెండ్ ను సృష్టించారు. ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించారు. శెట్టి నటుడు మాత్రమే కాదు దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ కూడా. ఆయన నటించే చిత్రాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. యుక్ మొత్తే కతి, గరుడ గమన వృషభ వాహన చిత్రాలలో విభిన్నమైన కథలతో ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టిలకి మంచి స్నేహితుడు. ఈ ముగ్గురి నుండి సినిమా వస్తుందంటే కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఈ ఏడాది రాజ్ బి. శెట్టి మరొక డిఫరెంట్ మూవీ ‘టోబి’ తో ఆడియెన్స్ ని పలకరించారు. టోబి మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లీవ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, టోబీ ఒక విడిచిపెట్టిన పిల్లవాడు. చిన్నతనంలో అనేక వేధింపులకు గురి అవుతాడు. అతనికి పేరు కూడా లేదు. ఆ పిల్లవాడికి ఆశ్రయం ఇచ్చినవారు టోబీ అని పిలుస్తారు.
టోబీ కోపం ఎక్కువగా ఉంటుంది. అతనికి కోపం వచ్చినపుడు చంపేస్తాడు. టోబీతో పాటు అతని కోపం కూడా పెరుగుతుంది. విపరీతమైన కోపం వల్ల అతను పాపులర్ అవుతాడు. అతనికి నచ్చినవారు చెబితేనే ఏదైనా వింటాడు. అయితే కొందరు వ్యక్తిని కొందరు టోబీని స్వార్ధం కోసం వాడుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న టోబీ ఏం చేశాడు? వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.





ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో ఉన్న హుకుంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ లో సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు నుండి వచ్చిన గిరిజన పిల్లలు ఈ స్కూల్ లోనే చదువుకుంటూ, అక్కడే ఉంటున్నారు. ఆ పాఠశాలలో టీచర్లు, సిబ్బంది కలిపి 10 మంది వరకు ఉన్నారు. అయితే వారందరినీ అందరికీ నడిపించే హెడ్ మాస్టార్ మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆయన తన వృత్తిపరమైన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ, ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు.
ఈ పాఠశాలలో బాలాజీ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ ఆ పాఠశాలలోని విద్యార్థులను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. వారి తల్లితండ్రులు తమ పై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అక్కడి పిలల్లకు విద్య, వసతి సౌకర్యాలు చూస్తూ, ఓ కుటుంబ పెద్దలా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెడ్ మాస్టార్ లా కాకుండా, స్టూడెంట్స్ కు అవసరమైన సేవలను సైతం చేస్తున్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని బోధిస్తూ, స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతున్నారు.
ఆ క్రమంలో స్వయంగా తానే విద్యార్థుల యూనిఫామ్, హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బార్బర్ రాకపోవడంతో, జుత్తు పెరిగిపోయిన విద్యార్థులకు వారి సమ్మతితో హెడ్ మాస్టార్ బాలాజీ కత్తెర పట్టుకుని క్షురకుడులా మారి ఖాళీ సమయంలో హెయిర్ కట్ చేస్తున్నారు. ఆయన సందర్భాన్ని బట్టి స్టూడెంట్స్ కి అవసరమైన సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులు అందరు పాఠశాలలో క్రమశిక్షణతో కనిపించాలని, వారికి క్రమశిక్షణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఇలా సేవ చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ వెల్లడించారు.
