బాలీవుడ్ లో ఎప్పుడో స్టార్ డమ్ తగ్గి, రిటైర్ మెంట్ కు చేరువలో ఉన్న సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘గదర్ 2’ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘గదర్’ సీక్వెల్ గా వచ్చిన మూవీ ‘గదర్ 2’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి మాస్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పఠాన్ మూవీ 6 రోజుల కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసింది. ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ట్రాక్టర్లు కట్టుకుని జనాలు మల్టీప్లెక్సులకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
2001లో రిలీజ్ ‘గదర్’ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. పాకిస్తాన్లోని పొలిటికల్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన సకీనా (అమీషా పటేల్) తో అమ్మాయితో సిక్కు అయిన తారా సింగ్ (సన్నీ డియోల్) ల ప్రేమకథ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ఈ మూవీకి 22 ఏళ్ల తరువాత సీక్వెల్ గా వచ్చిన ‘గదర్ 2’ కు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కూడా సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు.
గదర్ 2 కథ విషయానికి వస్తే, ఇది తండ్రికొడుకుల చుట్టూ సాగే కథ. తారా సింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా పటేల్) సంతోషంగా జీవిస్తుంటారు. వీరి కుమారుడు చరణ్జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) పెద్దవాడవుతాడు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది. పాకిస్తానీ ఆర్మీతో పోరాడుతుండగా, సరిహద్దుల్లో చిక్కుకున్న ఆర్మీ యూనిట్కు సాయం చేయాల్సిందిగా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర రావత్ (గౌరవ్ చోప్రా) తారా సింగ్ ను అడుగుతాడు.
అందుకు అంగీకరించిన తారా సింగ్ ఇండియన్ఆర్మీ యూనిట్కు శ్యామ్ చేయడమే కాకుండా పాకిస్థాన్ సైనికులతో పోరాటం చేస్తాడు. ఈక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ తారాసింగ్ తో పాటుగా కొంతమంది ఇండియన్ సోల్జర్స్, ట్రక్ డ్రైవర్లను కూడా పట్టుకుని పాక్ జైలులో బంధిస్తారు. దీంతో సకీనా, చరణ్జీత్ సింగ్ చాలా బాధపడుతారు. తల్లి బాధను చూసి భరించలేని చరణ్జీత్ తండ్రిని భారత్ కు తీసుకురావడానికి సిద్ధపడతాడు. అతను ఎలా పాకిస్థాన్ వెళ్ళాడు? ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తండ్రిని కాపాడాడా? అనేది మిగలిన కథ.
హీరో సన్నీ డియోల్ తారా సింగ్ గా అద్భుతంగా నటించాడు. అమీషా పటేల్ పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఉత్కర్ష్ శర్మ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సిమ్రత్ కౌర్ అందంగా కనిపించింది. ముస్తాక్ ఖాన్, ఎహసాన్ ఖాన్, ముస్తాక్ కాక్ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఆడియెన్స్ తో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు, వివాదాలు, కోర్టులో కేసులు వేసే వరకు వెళ్ళింది. రామాయణంను మార్చి చూపించారని, రావణాసురుడి క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని, హనుమంతుడితో మాస డైలాగ్స్ చెప్పించారని, పేర్లు మార్చారని ఇలా ఎన్నోవివాదాలు వచ్చాయి.
తాజాగా కోరాలో “ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిపేరు శేషు అని పెట్టారు. దీని గురించి వివరించగలరా?” అనే ప్రశ్నను అడుగగా
ఆ పామే లక్ష్మణునిగా జన్మించింది. అందుకే ఈ సినిమాలో లక్ష్మణుని పూర్వ జన్మ పేరుతో శేషు అని పిలిచాడు రాముడు. ఇంకా మహావిష్ణువు యొక్క శంకు, చక్రాలు – భరత, శతృఘ్నులుగా, ఆయన సతీదేవి అయినటువంటి మహాలక్ష్మి దేవి సీతగా జన్మించారు” అని తెలిపారు.
జైలర్ మూవీ ఇప్పటివరకు 4 వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ మూవీలోని పలువురు నటులకు గుర్తింపు వచ్చింది. ఇంతవరకు వారు పలు సినిమాలలో నటించినా రాని పాపులారిటీ ఈ మూవీతో వచ్చింది. ఈ మూవీలోని నటులకు సంబంధించిన వివరాలను నెటిజెన్లు వెతికి మరి, వారి గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారి వివరాలు తెలిసిన తరువాత ఆశ్చర్యపోతూ, కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జైలర్ మూవీలో వేసుకున్న రజనీకాంత్ జైలర్ లో జైలర్లో తమన్నా లవర్ డైరెక్టర్ బాగున్నార బాలుగా నటించిన యాక్టర్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఆ నటుడి పేరు సునీల్ రెడ్డి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గత చిత్రాలలో కూడా సునీల్ రెడ్డి నటించాడు. డాక్టర్ మూవీలో మహాలి అనే పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత విజయయ్ దళపతి నటించిన బీస్ట్ మూవీలో కూడా నటించారు.
ఈ సునీల్ రెడ్డి మరెవరో కాదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి కుమారుడు. వైభవ్ రెడ్డికి అన్నయ్య. నటుడిగా మారకముందు సునీల్ రెడ్డి తండ్రి కోదండరామి రెడ్డి డైరక్షన్ చేసిన గొడవ, కాస్కో లాంటి తెలుగు సినిమాలకు సమర్పకుడిగా పనిచేశాడు.
జీవితంలో చాలామందికి ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటారు. కొందరు ప్రేమిస్తారు. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకుండానే ఆగిపోతుంది. ప్రేమలో విఫలం అయినవారు చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ ప్రేమను మర్చిపోలేరు. అయితే అసలు ఒక వ్యక్తికి ప్రేమ వివాహం జరుగుతుందా లేదా అనే విషయాన్ని తమ అరచేతిలో ఉండే గుర్తులను బట్టి తెలుసుకోవచ్చని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అరచేతిలో చూపుడు వేలు క్రింద ఉన్న స్థానాన్ని గురు స్థానం అని అంటారు.ఈ గురు స్థానం మీద క్రాస్ మార్క్ లాంటి గుర్తు ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అలాగే మరొక గుర్తు అరచేతిలోని శుక్ర స్థానం మీద ఉంటుంది. అరచేతిలో బొటన వేలు క్రింద ఉన్న స్థానాన్ని శుక్ర స్థానం అని పిలుస్తారు. ఈ శుక్ర స్థానం మీద ఒక చతురస్రం గుర్తు ఉన్నట్లయితే ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది.
అరచేతిలోని చిటికెన వేలు క్రింద ఉన్న స్థానాన్ని బుధ స్థానం అంటారు. ఈ బుధ స్థానం చివర నుండి అంటే చిటికెన వేలు చివర, అరచ్చటి చివర నుండి అడ్డంగా వ్యాపించి, రవిస్తానం వరకు కూడా వ్యాపించి ఉన్నా, అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అదే విధంగా అరచేతిలో బుద్ధి రేఖ మరియు ఆయుష్హు రేఖను కలుపుతూ ఒక నిలువు గీత ఉంటే అది కూడా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. పైన చెప్పిన ఈ నాలుగు గుర్తులలో ఏ రెండు గుర్తులు మీ అరచేతిలో ఉన్నా, వారికి ఖచ్చితంగా ప్రేమ వివాహం జరుగుతుందని హస్త రేఖా సాముద్రిక శాస్త్రం చెబుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఈ సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీకి వచ్చిన టాక్, కలెక్షన్స్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. చిరంజీవి మూవీకి ఇలాంటి కండిషన్ ఏమిటని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్ అని ప్రకటించినపుడే ఆడియెన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ మూవీ పై ఆశలు వదిలేసుకున్నారు. అయితే టీజర్, ట్రైలర్ మరియు మూవీ ప్రమోషన్స్లో చిరంజీవి, డైరెక్టర్, నిర్మాత చెప్పిన మాటలకు ఈ మూవీ పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. మహతి స్వరసాగర్ ఇంతకు ముందు చేసిన పాటలు హిట్ అయ్యాయి. దాంతో భోళా శంకర్ మూవీకి మంచి పాటలు ఇస్తాడనుకున్నారు.
ఈ మూవీలోనీ ఏ పాట కూడా చార్ట్ బస్టర్ అవలేదు. యూట్యూబ్లో కూడా ట్రెండ్ కాలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే మహతి స్వర సాగర్ తాజాగా ఈ విషయం పై స్పందించాడని తెలుస్తోంది. ఈ మూవీకి తాను ఇచ్చిన పాటలు, కంపోజిషన్ పట్ల అసంతృప్తితో ఉన్నానని, మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగా ఇవ్వలేకపోయానని అన్నట్టుగా సమాచారం. ఈ వార్త తెలిసిన నెటిజెన్లు, అంతా అయ్యాక అనుకుంటే ఏం వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
జాఫర్ సాదిక్ తమిళనాడులో ఈరోడ్లో 1995 జూలై 4 న జన్మించాడు. ప్రస్తుతం కోలీవుడ్ మరియు టాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నజాఫర్ నటుడు మాత్రమే కాదు. అతను కొరియోగ్రాఫర్ మరియు డాన్సర్. కోలీవుడ్ లో పాపులర్ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఉంగలిల్ యార్ ప్రభుదేవా’ రెండవ సీజన్లో 2వ స్థానం పొందిన తర్వాత జాఫర్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత అతను సొంతంగా ‘లిఫ్టోదర్స్’ అనే పేరుతో డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించాడు.
జాఫర్ అనేక ఈవెంట్లలో స్టేజ్ షోస్ ఇచ్చాడు. అలా అతను 500కి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో ఫిబ్రవరి 13న జరిగిన TedxGCT ఈవెంట్లో జాఫర్ సాదిక్ చేసిన డ్యాన్స్ తో మరింత పాపులారిటీ వచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ వేలమంది ఫాలోవర్స్ ను సంపాదించాడు. ప్రస్తుతం అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 506 K. జాఫర్ సాదిక్ ఓటీటీ ప్లాట్ఫారమ్ నెట్ఫ్లిక్స్ సినిమా సిరీస్ ‘పావ కాదైగల్’లో నారికుట్టిగా నటించాడు.
ఆ తరువాత కోలీవుడ్ లో లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ మూవీలో మొదటిసారిగా నటించాడు. గ్యాంగ్ లో మెంబర్ గా నటించినప్పటికీ అతని పాత్రకి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తరువాత అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలా జైలర్, విజయ్ దళపతి లియో, షారుక్ ఖాన్ జవాన్ సినిమాలలో నటిస్తున్నాడు.
మల్లికా షెరావత్ 1976 లో అక్టోబరు 24న హర్యానాలోని చిన్న గ్రామం మోథ్ లో జన్మించింది. ఆమె తండ్రి పేరు ముఖేష్ కుమార్ లాంబా. వారిది సంప్రదాయ కుటుంబం. ఆమె అసలు పేరు రీమా లాంబా. ఇండస్ట్రీలో రీమా పేరుతో ఇతర నటీమణులతో ఉండడంతో తన పేరును మల్లికా గా మార్చుకుంది. షెరావత్ మల్లికా తల్లి పుట్టింటి ఇంటి పేరు. తల్లి ఇచ్చిన మద్దతు వల్ల ఆ పేరును ఉపయోగిస్తున్నానని ఒక సందర్భంలో ఆమె చెప్పింది.
మల్లికా షెరావత్ మధుర రోడ్ లో ఉండే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ మిరాండా హౌస్ లో డిగ్రీ చేసింది. మల్లిక సినిమాల్లో నటించడం తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె ఇంట్లో నుండి పారిపోయి వచ్చి, హిందీలో ఎంట్రీ ఇచ్చింది. మర్డర్ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస సినిమాలలో నటిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
మలయాళ హీరో కున్చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్చకో బొబన్) ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు.
అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ.
లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.
జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ నటించారు. జైలర్ సక్సెస్ లో స్పెషల్ క్యామియోలు కీలకమైన పాత్రను పోషించాయి. డైరెక్టర్ ఈ మూవీ కోసం ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుండి శివ రాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, బాలీవుడ్ నుండి జాకీష్రాఫ్ వంటివారిని తీసుకున్నారు. వారి పాత్రలు కూడా బాగున్నాయి. వీరిలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆడియెన్స్ లో బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి సునీల్ తీసుకున్నారు. అది కూడా కామెడీ హీరో క్యారెక్టర్.
కోలీవుడ్ ఆడియెన్స్ కి ఈ క్యారెక్టర్ నచ్చినప్పటికి, తెలుగు ఆడియెన్స్ కొందరు మాత్రం సునీల్ పాత్రని ట్రోల్ చేసినట్టుగా ఉందని అంటున్నారు. మిగతా ఇండస్ట్రీల నుండి అగ్ర హీరోలను తీసుకుని, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో చూపించారని. తెలుగు నుండి సునీల్ వంటి నటుడిని తీసుకుని, కమెడియన్ గా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మూవీ హిట్ అయ్యిందని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ లో జరుగుతున్న వన్డే కప్ టోర్నీలో ఓపెనర్ పృథ్వీ షా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 23వ మ్యాచ్లో సోమర్సెట్ పై డబుల్ సెంచరీ చేసిన షా, అనంతరం డర్హామ్ పై కూడా సెంచరీ కొట్టాడు. డర్హామ్తో జరిగిన మ్యాచ్లో నార్తాంప్టన్షైర్ ఓపెనర్ గా వచ్చిన పృథ్వీ, 76 బంతుల్లో 7 సిక్సర్లు, 15 ఫోర్లతో 125 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ 125 రన్స్ తో పృథ్వీ షా ‘లిస్ట్ ఏ’ క్రికెట్లో మూడు వేల పరుగులను చేశాడు.
పృథ్వీ షా సాధించిన రికార్డులు..