పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించారు. భారీ అంచనాల, విమర్శల మధ్య ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ.240 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది.
ఒక వైపు వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, మరో వైపు ఈ చిత్రం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే డైలాగ్స్, పాత్రల వేషధారణ, గ్రాఫిక్స్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా మరొక విషయం వివాదస్పదంగా మారింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మొదలైన విమర్శలు, వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్ రిలీజ్ చేయడంతో గ్రాఫిక్స్ పైన, పాత్రల ఆహార్యం పైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్ రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ ఏర్పడింది. హనుమంతుడి కోసం ఒక సీట్ రిజర్వ్ చేయడంతో అందరు భక్తిభావంతో మూవీకి వెళ్లారు.
తీరా మూవీ చూసిన తరువాత మూవీ దర్శకుడిని విమర్శిస్తున్నారు. అసలు రామాయణం మూవీ ఎలా ఉండాలి ? ఎలా తీశారని విమర్శిస్తున్నారు. ఏ క్యారెక్టర్ ను స్పష్టంగా చూపించలేదని, హనుమంతుడి డైలాగ్స్ పై విమర్శిస్తున్నారు. ఈ మూవీలో రాఘవుడు, జానకి, శేషు అని రామాయణ పాత్రల పేర్లు మార్చారని మండిపడుతున్నారు. ఆదిపురుష్ మూవీలోని పాత్రలను హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా తీర్చిదిద్దారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం వివాదస్పదంగా మారింది.
రావణాసురుడు రాక్షసుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు మాంసాహారాన్ని ముట్టుకోరు. కానీ ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడుగా నటించిన సైఫ్ అలీఖాన్ పక్షికి మాంసాహారాన్ని తన చేతులతో స్వయంగా తినిపిస్తాడు. రావణుడు ఇలా ఎప్పటికి చేయడు. ఇంత పెద్ద తప్పు ఎలా చేసారు అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Ctnihgmh2FZ/?igshid=NjZiM2M3MzIxNA==
Also Read: “ప్రభాస్” తో పాటు… సినిమాల్లో “రాముడి పాత్ర” పోషించిన 12 హీరోలు..!

చాలా సంవత్సరాల నుండి సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాకేష్ మాస్టర్ కు 3పెళ్లిళ్లు జరిగినట్టు తెలుస్తోంది. మొదటి భార్య గురించి అంతగా తెలియదు. ఇక రెండవ వైఫ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కొడుకు చరణ్ గురించి అందరికి తెలుసు. లాక్ డౌన్ సమయంలో రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తో యూట్యూబ్ వీడియోలు చేశారు. రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులతో జరిగిన గొడవ కారణంగా రెండో భార్య తన నుండి విడిపోయిందని అన్నారు. తన వల్ల వారికి హాని ఉందని, అందుకే చనిపోయినా కూడా రావొద్దని చెప్పిందని ఎమోషనల్ అయ్యారు.
రాకేష్ మాస్టర్ రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీ అనే స్త్రీని మూడవ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే లక్ష్మీ తన డబ్బులన్నీ కాజేసి, తన ఫ్యామిలిని మోసం చేసిందని పలు ఇంటర్వ్యూలల్లో రాకేష్ మాస్టర్ ఆరోపించారు. అంతేకాకుండా తనను జైల్లో పెట్టించడానికి కూడా ప్రయత్నించిందని అన్నారు. దాంతో మానసికంగా క్రుంగిపోయిన రాకేష్ మాస్టర్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఉన్న ఒక అనాథశరణాలయంలో చేరారు. ఈ విషయన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలల్లో వెల్లడించారు.
రాకేష్ మాస్టర్ మరణం గురించి గాంధీ హాస్పటల్ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు మధ్యాహ్నం (ఆదివారం మధ్యాహ్నం) విరోచనాలు, వాంతులు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్ను హాస్పటల్ కి తీసుకొచ్చారు. కానీ అప్పటికే రాకేష్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్, డయాబెటిస్ కావడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన గంటకే మాస్టర్ ఆరోగ్యం ఇంకా విషమించింది. రాకేష్ మాస్టర్ ను బతికించేందుకు ప్రయత్నాలు చేసినా, విఫలమవడంతో 5 గంటలకు చనిపోయారని’ అని వెల్లడించారు.
కొంచెం విజ్ఞత, రామాయణం పైన అవగాహన ఉన్న వారందరి నుండి ఆదిపురుష్ మూవీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమాని భ్రష్టు పట్టించాయని అంటున్నారు. క్యారెక్టర్ల లక్షణాలు, సందర్భాల ఔచిత్యం గురించి పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా యాక్షన్ చిత్రాలకు రాసినట్టు డైలాగ్స్ రాశారు అని విమర్శిస్తున్నారు. దాంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
డైలాగ్స్ పై వస్తున్న విమర్శల పై తాజాగా స్పందించిన మనోజ్ ముంతాషిర్ శుక్లా తాను రాసిన డైలాగ్స్ ను సమర్థించుకునేలా ట్వీట్ చేశారు. దాంతో నెటిజెన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ ముంతాషిర్ శుక్లా చేసిన ట్వీట్ లో ‘ఆదిపురుష్ మూవీ కోసం తాను 4000 లైన్ల డైలాగ్స్ రాసానని, అందులో 5 లైన్లు మాత్రం కొందరిని బాధపెట్టాయని, రాముడిని, సీతను కీర్తించిన చాలా డైలాగ్స్ కన్నా ఈ డైలాగ్స్ బాధించినట్టుగా అనిపిస్తోంది. అందుకే నన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.
అయితే మూడు గంటల చిత్రంలో 3 నిమిషాలు ప్రజల ఊహకు భిన్నంగా రాయడంతో తనను సనాతన ద్రోహిగా చూస్తున్నారని మనోజ్ ముంతాషిర్ శుక్లా అన్నారు. నెటిజెన్లు ఈ మాటలు రచయిత మనోజ్ అహంకారాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. డైలాగ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా తప్పులు ఉన్నాయి కదా? మనం ఇంత చెప్తే వీళ్ళకి మాత్రం కేవలం డైలాగ్స్ విషయం మాత్రమే అర్థం అయ్యిందా? అంటున్నారు. ఊహలకు భిన్నంగా కాదు, రామాయణంలోని మౌలిక స్ఫూర్తికి భిన్నంగా, కించపరిచేలా డైలాగ్స్ రాసినందుకు బాధ కలుగుతుందని అంటున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్లు నటించారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి కోసం ఒక సీటు కేటాయించాలని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను కోరడం ద్వారా ఆదిపురుష్ మూవీ ప్రమోషన్లను మొదలుపెట్టారు. రామాయణ పారాయణం చేసినా, రాముడి కథను ప్రదర్శించినప్పుడు ఆ స్థలంలో హనుమంతుడు ఉంటాడని తన తల్లి చెప్పేదని, ఆ విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పాడు.
ఓం రౌత్ చెప్పినట్లుగానే థియేటర్లలో హనుమంతుడి కోసం సీటును కేటాయించడం, ఆ సీటులో హనుమంతుడి ఫోటో పెట్టి పూజించడం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల వేషధారణను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓం రౌత్ 2015లో చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.
ఓం రౌత్ ‘హనుమంతుడు చెవిటివాడా? నా బిల్డింగ్ చుట్టు ఉన్న వాళ్ళు హనుమాన్ జయంతి రోజు చాలా పెద్ద సౌండ్ పెట్టి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. దానికి తోడు అన్నీ అసంబద్ధమైన పాటలు.” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ప్రస్తుతం నెటిజెన్లు మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడు కోసం ఒక సీటు రిజర్వ్ అని చెప్పిన ఓం రౌత్, అప్పుడేమో ఇలా అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
“విరాటపర్వం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది.”
“నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాట పర్వం నాకు ఒక సెల్ఫ్ డిస్కవరి లాంటిది. తీయబోయే చిత్రాలకు ఉపోద్ఘాతం లాంటిది.”

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ పై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్, పాత్రల వస్త్రధారణ పై మరియు పాత్రల చిత్రీకరణ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మూవీ డైరెక్టర్ ఓం రౌత్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ పై నెట్టింట్లో చర్చ జరుగుతున్న సమయంలో ఓం రౌత్ పాత ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. అది కూడా 2016లో చేసిన ట్వీట్.
దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు తెరపైకి తీసుకొచ్చి, ఓం రౌత్ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఓం రౌత్ ఆ ట్వీట్ లో షారుక్ ఫ్యాన్ సినిమాతో పొలుస్తూ మరాఠీ సినిమా ‘సైరాట్’ పై ప్రశంసలు కురిపించాడు. అయితే షారుక్ ఫ్యాన్స్ అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం రౌత్ ‘మరాఠీ సినిమా ‘సైరాట్’ షారుఖ్ ‘ఫ్యాన్’ సినిమాని క్రాస్ చేసి 80 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది’ అని ట్వీట్ చేశాడు.
ఆదిపురుష్ సినిమాతో ట్రోల్ అవుతున్న ఓం రౌత్ను షారుక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అది కూడా షారుక్ ఒక సందర్భంలో కర్మ గురించి చేసిన ట్వీట్ తో ట్రోల్ చేస్తున్నారు. 500 కోట్ల ‘ఆదిపురుష్’ సినిమా కన్నా 4 కోట్ల బడ్జెట్తో తీసిన ‘సైరాట్’ మూవీ వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఏషియన్ మల్టిప్లెక్స్ థియేటర్స్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ కి ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఏషియన్ సినిమాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టనర్ షిప్ తో ఏఏఏ సినిమాస్ అమీర్ పెట్ లో నిర్మించారు. తాజాగా ఈ మల్టిప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించారు. ఈ వేడుకకు తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.
అమీర్ పెట్ లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన సత్యం థియేటర్ ని పడగొట్టి, ఏఏఏ సినిమాస్ ని నిర్మించారు. 3 లక్షల స్క్వేర్ ఫీట్ లో దీనిని నిర్మించారు. పార్కింగ్ కోసం 2 ఫ్లోర్స్ ని కేటాయించారంట. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉండగా, ఒక్కో స్క్రీన్ 1 67 ఫీట్ల పొడవుతో బార్కో లంజెర్ ప్రొజెక్షన్ తో చిత్రాలను ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
రెండవ స్క్రీన్ ఎపిక్ లక్సన్ స్క్రీన్. ముంబైలో తప్ప ఎక్కడ ఈ LED స్క్రీన్ లేదట. ఏఏఏ సినిమాస్ ద్వారా ఈ టెక్నాలజీని మొదటిసారిగా హైదరాబాద్ కి పరిచయం చేస్తున్నారు. ఇక ఈ స్క్రీన్ కి ప్రొజెక్టర్ తో పని లేదంట. కనెక్షన్ ద్వారానే మూవీ ప్లే అవుతుంది. మిగిలిన 3 స్క్రీన్స్ 4K ప్రొజెక్షన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం కలిగి ఉంటుందట. ఆడియెన్స్ కి మూవీ చూస్తే ఇలాంటి థియేటర్ లోనే చూడాలనే అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.
రామాయణం ఇతిహాసంలోని ప్రధాన పాత్రల్లో శూర్పణఖ కూడా ఒకటి. ఆమె లంకాధిపతి రావణాసురుడి చెల్లెలు. శూర్పణఖ రాముడు వనవాసంలో ఉన్న సమయంలో చూసి ఇష్టపడుతుంది. ఆ విషయం గురించి రాముడికి చెబుతుంది. అయితే ఆ సమయంలో లక్ష్మణుడు వచ్చి శూర్పణఖ ముక్కును కొస్తాడు. ఈ క్యారెక్టర్ ను ఆదిపురుష్ సినిమాలో చూపించారు. తేజస్విని పండిట్ శూర్పణఖ క్యారెక్టర్ లో నటించింది.
ఆదిపురుష్ సినిమాలో క్రూరమైన శూర్పణఖగా కనిపించిన తేజస్విని పండిట్ నిజ జీవితంలో ఆమె ఒక స్టార్ హీరోయిన్. మరాఠా సినీ ఇండస్ట్రీలో తేజస్విని పాపులర్ హీరోయిన్. తేజస్విని పండిట్ 2004 లో రిలీజ్ అయిన మారాఠి సినిమా ‘అగా బాయి అరేచా’ తో సినీ కెరీర్ మొదలు పెట్టింది. ఆమె తొలి సినిమాలోనే నెగిటీవ్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. తేజస్విని సినిమాలలోనే కాకుండా టెలివిజన్ ఆడియెన్స్ కూడా ఆకట్టుకుంది.
తేజస్విని బెస్ట్ హీరోయిన్ గా అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందింది. తేజస్విని తెరపైనే కాకుండా బయట కూడా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. తేజస్విని తన చిన్ననాటి ఫ్రెండ్ భూషణ్ బోప్చేని 2012లో పెళ్లి చేసుకున్నారు. భూషణ్ బిజినెస్ రామేశ్వర్ రూప్చంద్ బోప్చే కుమారుడు. తేజస్విని పండిట్ ఇటీవల వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉటుంది. తరచు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.