ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
జబర్దస్త్ ప్రోగ్రాం లకి యాంకర్లుగా అనసూయ, రష్మీ గౌతమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా రష్మీ కి జబర్దస్త్ వలన ఫేమ్ బాగా వచ్చింది. ఈమె షోస్ ఏ కాదు సినిమాల్లో కూడా చేస్తోంది.

సౌమ్య రావు ఇప్పుడు జబర్దస్త్ లో రష్మీ కి బదులు వచ్చింది. సౌమ్య రావు ఎవరో కాదు ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీమంతుడు అనే సీరియల్ నటి. జబర్దస్త్ హోస్ట్ అయిన ఇంద్రజ సౌమ్య రావుని పరిచయం చేయడం జరిగింది. పైగా ఇందు మేరకు ఓ ప్రోమో కూడా విడుదల అయ్యింది.

ఈ కొత్త యాంకర్ పైన పంచ్లు కూడా వేశారు. హైపర్ ఆది, కృష్ణ భగవాన్ ఇలా అందరినీ నవ్వించేసారు. పైగా ఆమె కూడా కౌంటర్లు వేసింది. అవి కూడా అందర్నీ నవ్వించేశాయి. ఇక ఇప్పుడు సౌమ్య రావు జబర్దస్త్ షో నుండి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది అనేది వైరల్ అవుతోంది. సౌమ్య రావు జబర్దస్త్ షో నుండి ఒక్కో ఎపిసోడ్ కి రూ. 85 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సౌమ్య రావు మూలాన జబర్దస్త్ కి ఎక్కువ రేటింగ్ వస్తే పారితోషకం పెంచచ్చు.

తిరు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే క్రమంలో అనూష, రంజనిలను ప్రేమిస్తాడు అయితే వారు అతన్ని ప్రేమించరు. నిరాశలోకి వెళ్ళిన అతన్ని వాళ్ల తాత శోభన స్నేహాన్ని, ప్రేమగా చెప్పడంతో అక్కడ నుండి కథ మలుపు తీసుకుంటుంది.
అయితే ఈ సినిమా అభిమానులకు నచ్చినప్పటికి, సూపర్ హిట్ అయినప్పటికీ మరికొంత మందికి నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కోరాలో ఈ సినిమా గూర్చి చర్చ జరుగగా, ఈ సినిమాలో మూడు ప్రధాన లోపాలను కలిగి ఉన్నట్టుగా
1. నిత్యా మీనన్ (శోభన) తనకు ప్రేమ కలిగిన వెంటనే తెలియజేసి ఉండాలని, అలా అప్పుడే చెప్పకుండా ఇరవై ఏళ్లు ఎందుకు ఎదురుచూసిందని, ధనుష్ (తిరు) తన తాత శోభన గురించి చెప్పేవరకు కూడా శోభన పై అతనికి ఏమీ అనిపించదు.
2. ఎదిగిన మనిషికి ఎదుటివారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియకుండా ఎలా ఉంటాడు. అది కాకుండా అతనికి ఎటువంటి ఫిలింగ్స్ లేకున్నా అతని తాత అతన్ని తప్పుదారి పట్టించాడు. ఇది కూడా అర్దం లేని విషయమే.
3.ఈ సినిమా ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా దిగజార్చిందని, వారు నిజంగా స్నేహితులు అయినప్పటికీ, అసంబద్ధ కారణాలతో వారిని ఒకరినొకరు ప్రేమించేలా చేసింది.
డైరెక్టర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ మంచి స్నేహితుడిగా ఎందుకు ఉండలేడు. ఇది 1980ల కాలం కాదు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా లేదు. మీరు 2022లో ఉన్నారు.ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, మూర్ఖత్వం ఇంజెక్ట్ చేయవద్దు అని అంటున్నారు.
అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి,ఏం చేయాలి అనే దానిపై సమీరా ఫ్యాన్స్ కి సలహాలు కూడా ఇచ్చారు. వీక్లీ 4 సార్లు యోగా, బ్యాడ్మింటన్ చేయడంతో పాటు,అప్పడప్పుడు ఉపవాసం చేస్తూ బరువు తగ్గనని తెలిపారు అంతేకాకుండా సోషల్ మీడియాలో బరువు పెరిగిన ఫోటోను, తర్వాత సన్నగా అయిన ఫోటోను షేర్ చేసి ఎంతోమందికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారు. ఇక సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ అనుభవాల్ని వెల్లడిస్తానని ముందే ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన సమీరా, ఆ తరువాత ఆ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ కాబోయే తల్లులకు ధైర్యాన్ని ఇస్తూ ఆదర్శంగా నిలుస్తునాన్నారు.
అంతేకాకుండా బిడ్డకు పాలివ్వడం వల్ల అందం చెడిపోతుందని రకరకాలుగా బయట సమాజం మాట్లాడుకుంటుంది. అలా అనుకోవడం సరికాదని చెబుతోంది. గోవాలో ఉంటున్న ఆమె రోజువారీ విశేషాలు, ఆరోగ్య చిట్కాలు, వంటలు వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో, నెటిజన్లతో పంచుకుంటూ అలరిస్తున్నారు. ఇక ఈ నేచురల్ బ్యూటీ అంటూ సమీరారెడ్డి మేకప్ లేకుండా పెట్టిన డీగ్లామరస్ ఫోటోలు ఒకవైపు వైరల్ అవుతుంటే,మరోవైపు వాటికి ట్రోల్స్ కూడా వస్తున్నాయి.అయిన ట్రోల్స్ అన్నిటికీ సమీరా ధీటుగా కౌంటర్లు ఇస్తుంటారు.
స్పైడర్ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ధీటుగా విలన్ గా భైరవుడు అనే క్యారెక్టర్ లో ఎస్.జె సూర్య అద్భుతంగా నటించారు.
ఈ అబ్బాయి పేరు సంజయ్. శ్మశానంలో పుట్టి పెరిగిన అబ్బాయిగా చక్కటి నటనను ప్రదర్శించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత అతన్ని ‘స్పైడర్ సంజయ్’ అని పిలుస్తున్నారు. ఈ మూవీ తరువాత సంజయ్ పలు తమిళ సినిమాలలో నటించాడు. మాగముని, జాక్ పాట్, గజినీకాంత్, ఎచ్చరిక్కై తుగ్లక్, దర్బార్ వంటి సినిమాలలో నటించాడు.
సంజయ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ పేరు కుట్టి టాకీస్. ఇందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫుడ్ రివ్యూలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలోను సంజయ్ యాక్టివ్ గా ఉంటాడు. పాపులర్ సాంగ్స్ కు డాన్స్ చేసిన వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు.
1949వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు 18 ఫిబ్రవరిన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. అయితే నాగేశ్వరరావు తన వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ జంట తమ 78 సంవత్సరాల ప్రయాణంలో భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో తమ వైవాహిక జీవితం ద్వారా చూపించారు. వీరికి ఐదుగురు పిల్లలు నాగార్జున, వెంకట్ రత్నం, సరోజ, సత్యవతి, నాగ సుశీల.
అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. మాయాబజార్, బ్రతుకు వీధి, సంసారం, ఆరాధన, దొంగ రాముడు, అర్ధాంగి, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరికం, మాంగల్య బలం, శాంతినివాసం, భార్య భర్తలు, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, బాటసారి, ధర్మదాత, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ను తెలుగు సినిపరిశ్రమకి అందించారు
1970ల లో తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకు రావటంలో ముఖ్య పాత్రను పోషించారు. 1976వ సంవత్సరంలో తన భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి తెలుగు సినిమాకు మౌలిక సదుపాయాలను అందించారు. అక్కినేని నాగేశ్వరరావుతెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు.



ఇంకొందరు ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు రెస్టారెంట్స్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. వేలకు వేలు బిల్లులు అయినా కూడా కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. కాగా, డిల్లీలోని లజపత్ నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లును చూసిన వారు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, అది ఒక రెస్టారెంట్ బిల్లు, అందులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖనీ,షాహిపన్నీర్, రైతా మరియు కొన్ని చపాతీలు ఆర్డర్ చేసారు. అయితే మొదటి రెండు వంటకాలకు(దాల్ మఖనీ, షాహిపన్నీర్) 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు. ఆశ్చర్యానికి గురి చేసేటు వంటి విషయం మొత్తం బిల్లు కేవలం 26 రూపాయలు. అంటే అప్పట్లో బిల్లులు చాలా తక్కువ. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక చిప్స్ ప్యాకెట్ రేటుకి సమానం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరలయ్యింది.



అదేం ఇంప్రెస్ చేసే స్టోరీ కాదు. ఆ సినిమాలో కథనం సరిగ్గా లేదు, ఇలా చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ గాలోడు సినిమా 11 రోజుల్లో 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాని 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల చేస్తే, టార్గెట్ పూర్తి చేసి, లాభాల్లోకి వచ్చి, ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా ముందుకెళ్తోంది. అయితే నిజానికి ఇది సుడిగాలి రేంజుకు చాలా పెద్ద విజయమే. ఇది పూర్తిగా సుధీర్ వ్యక్తిగత విజయం అని చెప్పాలి. బుల్లితెర పై తను తెచ్చుకున్న క్రేజ్ కూడా ఈ విజయానికి కారణం అయ్యింది.
వెండితెర పై కమెడియన్ పాత్రలు చేసే చాలామంది నటులు హీరోలుగా ప్రయత్నించి విఫలమైన ఉదంతాలు బోలెడు ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెడితే సుడిగాలి సుధీర్ ఓ టీవీ షోలలో కామెడీ చేసే క్యారెక్టర్ మాత్రమే, ఈమధ్య కాలంలో టివి షోస్ కి హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. సుధీర్ లో డాన్సర్, ఫైటర్ ఉన్నాడు. అయితే అన్నింటి కన్నా మంచి నటుడు ఉన్నాడు. అయితే సుధీర్కు సమయం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో గాలోడు సినిమాకు థియేటర్లు దొరికాయి. అయితే, పెద్ద పెద్ద హీరోల సినిమాలు డిజాస్టర్లు అవుతుంటే, ఒకప్పుడు అనామకుడు అని వెక్కిరింపుకు గురైన సుడిగాలి సుధీర్ హిట్ కొట్టాడు.