హైదరాబాద్ లో ఓ మహిళ తన భర్తతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. అది కూడా తక్కువ ధరలకు ఎక్కువ ఆహారాన్ని అందిస్తున్నారు. వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్ ను అందిస్తున్నారు. అది కూడా రోజువారీ కష్టపడుతూ పనిచేసేవారికి అందుబాటులో ఉండేలా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు.
ఇన్ అర్బీటాల్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ లో పదకొండు అయ్యిందంటే చాలు. అక్కడికి ఫుడ్ కోసం చాలామంది వస్తారు. సాయి కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఆహారం టేస్టీగా ఉండడం, తక్కువ ధరలకు ఎక్కువ ఆహారం ఇస్తుండడంతో వారి ఫుడ్ బిజినెస్ బాగా సాగుతోంది. వంట అంతా ఆమె చేస్తుంది. ఆమె మాట్లాడుతూ, ఉదయం 5 గంటలకు వంటలు చేసుకుని, 11 గంటలకు షాప్ ఓపెన్ చేస్తామని చెప్పారు.

సాయి కుమారి దగ్గర ప్లేట్ వెజ్ కి 60 రూపాయలు కాగా, నాన్ వెజ్ ప్లేట్ 80 రూపాయలకు అందిస్తున్నారు. బాగార వంటి రైస్ ఐటెమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ లో గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ వంటి ప్లేట్ కు ఒక ఐటెం చొప్పున అందిస్తున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఈమె బాగా ట్రెండ్ అవ్వడంతో…అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎంతో మంది వెళ్లారు. ఎంతో మంది వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కూడా కట్టారు యూట్యూబ్ చానెల్స్. అయితే ఇప్పుడు ఈ పాపులారిటీ ఆమెకి పెద్ద కష్టం తెచ్చిపెట్టింది.

అక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలనీ చాలామంది అక్కడికి బారులు తీశారు. దీంతో అక్కడ రద్దీ ఎక్కువైపోతంది. అక్కడికి వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేయడంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అక్కడ భోజనం అమ్మడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ట్రాఫిక్ జాం అవుతుందని రోడ్డుపై బిజినెస్ చేయడానికి అనుమతి లేదు అని పోలీసులు చెప్పారు. ట్రక్ లో నుండి ఫుడ్ దింపనివ్వకుండా ఆమెని అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసారు.
ట్రాఫిక్ పోలీసులు మరియు కుమారి ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది. వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ బిజినెస్ ఎందుకు ఆపించట్లేదు. పబ్లిక్ ని మేము రమ్మని పిలిచామా.? మీడియాని మేము పిలిచామా? అంటూ అన్నారు. మాపై ఎందుకు కక్ష కడుతున్నారు అన్నారు. మీడియా వల్లే ఇలా జరిగింది కాబట్టి మీడియా వాళ్లే నాకు న్యాయం చేయాలని ఆమె అన్నారు.









అయితే అదే టైమ్ కి , డిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్లో నారాయణ్ ఆప్టే, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే నిద్రలో ఉన్నారు. బిర్లా హౌజ్ లో గాంధీ అల్పాహారం చేసిన తరువాత, తనని కలిసేందుకు వచ్చిన ఓల్డ్ ఫ్రెండ్ రుస్తమ్ సోరాబజీతో కొంత సమయం మాట్లాడారు.ఆ తరువాత డిల్లీలో ముస్లిం నాయకులను కలిసి ‘మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను’ తెలిపారు.
గాంధీజీని ఆయన సన్నిహితులు ప్యారేలాల్, సుధీర్ ఘోష్ లండన్ టైమ్స్లో ప్రచురించిన ‘నెహ్రూ, పటేల్ మధ్య అభిప్రాయబేధాలు’ అనే వార్త గురించి మాట్లాడమని కోరారు. అందుకు గాంధీజీ సాయంకాలం ఈ విషయం గురించి వారిద్దరి ముందు ప్రస్తావిస్తానని అన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో వల్లభాయ్ పటేల్, తన కుమార్తె మనుబెన్తో పాటు గాంధీని కలిసారు. వారు ప్రార్థనా టైమ్ 5 గంటల దాటే వరకూ సంభాషించారు. అయితే మరో వైపు బిర్లా హౌస్కి గాడ్సే, అతని స్నేహితులు టాంగాలో బయలుదేరారు. హౌస్కి 2 వందల గజాల దూరంలో టాంగా ఆపి, అక్కడే దిగారు.
ఎడమవైపున ఉన్న నాథూరామ్ గాడ్సే, గాంధీజీ వైపుకి చూసి వంగడంతో, ఆయన పాదాలకు గాడ్సే నమస్కరిస్తాడేమో మనుబెన్ భావించింది. కానీ గాడ్సే మనుని విసురుగా తోసుకుంటూ ముందుకి వెళ్ళాడు. దాంతో ఆమె చేతిలోని మాల, బుక్ కిందపడిపోయాయి. ఆమె వాటికోసం కిందకు వంగారు. సరిగ్గా ఆ సమయంలో గాడ్సే పిస్టల్ తీసి వరుసగా మూడు సార్లు గాంధీ ఛాతీ పైన, పొట్ట పైన కాల్చాడు. గాంధీజీ నోటి వెంట రామ్….రా…మ్” అనే మాటలు వచ్చాయి. మరుక్షణంలో గాంధీజీ శరీరం నేలకొరిగింది.


