భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె పై ఈ చిత్రంలో లీడ్ రోల్స్ లో నటించిన బెల్లీ, బొమ్మన్ దంపతులు ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం, లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది.
సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ ఇచ్చిన మాట తప్పడంతో ఈ వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. బెల్లీ, బొమ్మన్ దంపతులు తాజాగా రెండు కోట్ల లీగస్ నోటీస్ను దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ పంపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ సినిమా చిత్రీకరణ సమయంలో తమకు సహాయం చేస్తానని డైరెక్టర్ కార్తికి మాట ఇచ్చారని, బెల్లీ, బొమ్మన్ దంపతులు చెబుతున్నారు. ఆమే ఇచ్చిన మాటను ఇంతవరకు నెరవేర్చలేదని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా ఇల్లు, తన మనవరాలు చదువుకు సాయం, వాహనం కోసం మూవీకి వచ్చిన కలెక్షన్స్ లో కొంత ఇస్తానని చెప్పారని లీగల్ నోటీసులో తెలిపారు.
ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ నుండి దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ పురస్కారాలు పొందారని బెల్లీ, బొమ్మన్ దంపతులు చెప్పారు. అయితే తమకు మాత్రం ఏమి చేయలేదని, ఆస్కార్ వచ్చిన తరువాత జరిగిన సన్మాన సభల్లో కూడా ఆస్కార్ ను పట్టుకోనివ్వలేదని వారు పేర్కొన్నారు. ఆ డాక్యుమెంటరీలో నటించిన తరువాత తాము ప్రశాంతత పోగొట్టుకున్నామని ఆ దంపతులు తమ బాధను వ్యక్తం చేశారు.
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిర్మాణ సంస్థ బెల్లీ, బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణల పై స్పందించి, వారు చెప్పే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తికి గోంజాల్వెస్ కు బెల్లీ, బొమ్మన్ దంపతులు రెండు కోట్ల పరిహారం ఇవ్వాలంటూ లీగల్ నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని మరొక కోణం..! అసలు ఏం ఉంది ఇందులో..?

పోలీసులు వీరప్పన్ పట్టుకుని కాల్చి చంపిన తర్వాత, ఒక్క ప్రశ్న మిగిలిపోయింది. వీరప్పన్ ఎవరు? అతను నేరస్థుడా లేదా తిరుగుబాటుదారుడా? అని రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది హంట్ ఫర్ వీరప్పన్’. దీనిని సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ 4 ఎపిసోడ్లుగా రూపొందింది. నాలుగు ఎపిసోడ్లను రెండు దశాబ్దాల పాటు సాగిన వీరప్పన్ చరిత్ర గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ది ఫారెస్ట్ కింగ్, ది బ్లడ్ బాత్, ది రివల్యూషనరీ మరియు ది వే అవుట్ అనే ఎపిసోడ్లలో వీరప్పన్ స్టోరీని వివరించారు.
ముందుగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి భయంకరమైన, అంతుచిక్కని బందిపోటుగా ముద్రపడిన వీరప్పన్ ని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఎన్నుకుంది అనే విషయాన్ని మొదటి ఎపిసోడ్ లో వివరించారు. 37 ఏళ్ల వయసులో వీరప్పన్ తనను పెళ్లి చేసుకోమని అడిగాడని ముత్తులక్ష్మి చెప్పింది. ఆ సమయంలో తనకు పద్నాలుగు లేదా పదిహేనేళ్లు, అని ఆమె గుర్తుచేసుకుంది. వీరప్పన్ వేట కార్యకలాపాలను చేస్తూ, పేదలకు సహాయం చేయడం ద్వారా మంచి పేరు సంపాదించి, నాయకుడిగా మారారు. ఆ తర్వాత చందనం స్మగ్లర్గా మారాడు.
అడ్డుగా వచ్చిన నలుగురు పోలీసు అధికారులను, అటవీ అధికారి శ్రీనివాస్ను కనికరం లేకుండా కాల్చి చంపుతాడు. రెండవ ఎపిసోడ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విసిరిన ప్రతి సవాలును వీరప్పన్ ఎలా ఎదుర్కొన్నాడో, ఎలా వెంటాడు అనే వాటిని వివరించారు. ఆ తరువాత ఎపిసోడ్లలో వీరప్పన్ కోసం మొదలుపెట్టిన ‘ఆపరేషన్ కుకూన్’ లో వీరప్పన్ కోసం జరిగిన వేటలో అతను తప్పించుకోవడం, ఆ క్రమంలో చేసిన హత్యలు, అతను స్వాధీనం చేసుకున్న అటవీ భూముల గురించి వివరిస్తారు.
సూపరింటెండెంట్ ‘రాంబో’ గోపాలకృష్ణన్ వీరప్పన్ కోసం నల్లూరు గ్రామస్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, కర్ణాటక స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేత నల్లూరు గ్రామాన్ని కాల్చి వేయడం, కస్టడీలో చేసే హింసలు వంటి వాటి గురించి ఈ సిరీస్ ప్రస్తావించారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని పట్టుకున్న సమయంలో పోలీసులు ఆమెపై హింసను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ డాక్యుమెంటరీకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సునాద్ వ్యాఖ్యాతగా పనిచేశారు.
వీరప్పన్ పై సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఆవిష్కృతం అయ్యాయి. వీరప్పన్ మాజీ ముఠా సభ్యులు చెప్తున్న ప్రకారం అతను అన్యాయం, అసమానతల పై పోరాటం చేశారు. పేదవారికి భారీగా డబ్బును పంచాడు. అందుకే కొందరు అతన్ని రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. భయంకరమైన నేరస్థుడైన వీరప్పన్ లో కూడా సానుకూల లక్షణాలు ఉండవచ్చు. ఆ లక్షణమే తనను కూడా రక్షించగలదా? అనే ప్రశ్నతో దర్శకుడు ఈ సిరీస్ కు ముగింపును పలికారు.
రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జైలర్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ, తమన్నా, టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఆగస్ట్ 10న తెలుగు, తమిళ బాషలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జైలర్ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. మూవీ యూనిట్ కొద్ది రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ తీసుకున్న పారితోషికం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జైలర్ సినిమా కోసం రజినికాంత్ రూ.110 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఈ విషయం విన్న స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారట. సీనియర్ అగ్ర హీరోలలో ఈ రేంజ్ లో పారితోషికం తీసుకుంటూ రజినికాంత్ రికార్డ్స్ సృష్టిస్తున్నారు.
ఇండియాకి స్వాతంత్య్రం రాకముందు బ్రిటీషర్లు భారతీయుల పై చేసిన ఆరాచకాలు మరియు అన్యాయాలను చూపిస్తూ ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన రోజు, ఆ మరుసటి రోజున ఏం జరిగిందనే విషయంతో ఇప్పటివరకు ఎవరూ చిత్రాలను తెరకెక్కించలేదు. ఆ పాయింట్ తో వచ్చిన చిత్రమే ఈ ‘ఆగస్ట్ 16 1947’. డైరెక్టర్ మురగదాస్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్.ఎస్ పొన్కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సెంగాడు అనే చిన్నపల్లెటూరు దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. ఆ ఊరిని బ్రిటీష్ జనరల్ అయిన రాబర్ట్ శాసిస్తుంటాడు. ప్రజలందరిని బానిసలుగా చూసే రాబర్ట్, ఎదురుతిరిగిన ప్రజలను కిరాతకంగా చంపుతూ ఉంటాడు. దాంతో అక్కడి వారు భయపడుతూ జీవిస్తుంటారు. అయితే రాబర్ట్ కు జస్టిన్ అనే కుమారుడు ఉంటాడు. అతను స్త్రీలోలుడు. జస్టిన్ నుండి తమ అమ్మాయిలను కాపాడుకునే మార్గం లేకపోవడంతో తమకు పుట్టిన ఆడపిల్లలను ఊరివారే చంపేస్తుంటారు.
కానీ సెంగాడు జమీందారు తమ కుమార్తె తేన్మల్లి (రేవతిశర్మ)ను చంపలేక, రహస్యంగా తన తన భవనంలోనే పెంచుతాడు. అందరిని ఆమె చిన్నప్పుడే చనిపోయిందని నమ్మిస్తాడు. జమీందారు కుటుంబానికి, జస్టిన్ దగ్గర పనిచేసే పరమాన్ (గౌతమ్ కార్తిక్) కు తప్ప ఆమెకు బ్రతికి ఉన్నట్టు ఎవరికి తెలియదు. పరమాన్ కి జస్టిన్ చేసే అరాచకాలను సహించలేక, ఎదురించాలని అననుకున్నప్పటికి, ప్రజల సహాయం లేకపోవడంతో మౌనంగా భరిస్తుంటాడు. అతను తేన్మల్లిని ప్రేమిస్తుంటాడు.
ఆమె ఆ నాలుగు గోడల మధ్యనుండి బయటికి రావాలని భావస్తుంది. ఈ క్రమంలోనే ఒక రోజు తేన్మల్లి జస్టిన్ దృష్టిలో పడుతుంది. అతని నుండి తేన్మల్లిని కాపాడడం కోసం పరమాన్ ఏం చేశాడు? ఆమెకు తన ప్రేమ గురించి చెప్పాడా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంగతిని ఆ ఊరి ప్రజల దగ్గర దాచిపెట్టి, అరాచకాలను చేస్తున్న రాబర్ట్ కు ఆ ఊరి ప్రజలు ఎదురు తిరిగారా? లేదా అనేది మిగతా కథ.
ఈ చిత్రం కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. 1947 నాటి ప్రజల వేషధారణ, సెటప్, భాషల్ని వాస్తవంగా డిజైన్ చేసుకున్నాడు. కథకు తగినట్టుగా నటీనటులు చక్కగా నటించారు. కానీ దర్శకుడు తాను అనుకున్న స్టోరీని తెరపై చూపించడంలో తడబడటంతో మూవీ మొదటి నుంచి క్లైమాక్స్ వరకు బోరింగ్గా సాగిన ఫీల్ వస్తుంది. లవ్ స్టోరీ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. పరమాన్ గౌతమ్ కార్తిక్ చాలా సహజంగా నటించాడు. తేన్మల్లిగా రేవతిశర్మ నటన తేలిపోయింది. రాబర్ట్, జస్టిన్ పత్రాలు చేసిన నటులు విలన్స్ గా బాగా నటించారు.
ప్రభాస్, కృతి సనన్ లు సీతారాములుగా నటించిన ఈ చిత్రాన్ని తానాజీ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించామని, రిలీజ్ కు ముందు మేకర్స్ అన్నారు. కానీ మూవీ రిలీజ్ అయిన తరువాత విజువల్ ఎఫెక్ట్స్ పైనా, పాత్రల వస్త్రధారణ పైన, ముఖ్యంగా రావణుడి పత్ర చిత్రీకరణ పైన తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. లంక సెట్ ను కూడా హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రావణుడు వాహనంగా ఉపయోగించిన పక్షిని, రావణాసురుడి పది తలలను ఒకేవరుసలో చూపించకుండా ఒకదాని పైన మరొక వారుసను చూపించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ప్రభాస్ రాజు ఫ్యాన్ పేజ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో రావణాసురుడి తలలను అలా చూపించడాన్ని సపోర్ట్ చేసినట్లుగా ఉంది. ఆ వీడియోలో “మనకు తెలిసిన సింపుల్ విషయం.
అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు ఓం రౌత్ కు తెలియదనుకోవాలా? అయితే దానికి కూడా ఒక ఆధారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై రావణుడి దశకంఠ రూపం 10 తలలు అడ్డంగా ఒకేవరుసలో కాకుండా త్రికోణాకారంలో 3 అంచెలలో అమర్చబడి కనిపిస్తాయి. ఆదిపురుష్ సినిమాలో అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై ఉన్నట్టుగానే చూపించారు” అని చెప్పుకొచ్చారు.
అనారోగ్యంతో హాస్పటల్ చేరిన గద్దర్, గుండెకు సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా జరిగినప్పటికీ, గతంలో ఆయకు ఉన్న లంగ్స్ సమస్య కారణంగా తిరిగి కోలేక, అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణించక ముందు జులై 31న తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. హాస్పటల్ ఉండగానే ఆ లేఖను విడుదల చేశారు.
అందులో గద్దర్ ఈ విధంగా రాసుకొచ్చారు. తన పేరు గుమ్మడి విఠల్. తన పాట పేరు గద్దర్ అని, తన బ్రతుకు సుదీర్ఘ పోరాటం అని, తన వయస్సు 76 ఏళ్ళు. తన వెన్నుముకలో ఉన్న బుల్లెట్ వయస్సు 25 ఏళ్లు. తాను ఇటీవల సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు.
గుండె సంబంధిత చికిత్స కోసం అమీర్ పేట్ లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేరానని, జూలై 20 నుండి ఈరోజు వరకు పరీక్షలన్ని చేయించుకుని, ట్రీట్మెంట్ తీసుకుంటూ మెల్లగా కుదుట పడుతున్నాను. కొలుకుని, ఆరోగ్యంతో తిరిగి మీ వద్దకి వస్తానని, సాంస్కృతిక ఉద్యమంను తిరిగి మొదలుపెట్టి, ప్రజల యొక్క రుణం తీర్చుకుంటానని లేఖలో వెల్లడించారు. కానీ ఆయన హాస్పటల్ లోనే కన్నుమూసి, అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆ విషయాన్ని తలచుకుని మరింతగా గద్దర్ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘బిజినెస్ మెన్’ మూవీ మహేష్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు డైలాగ్ లు, యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ చాలా ఆకట్టుకున్నాయి. గత ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ రీరిలీజ్ అయ్యింది. అప్పుడు మొదలైన రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసగుతూనే ఉంది. ఇక ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బిజినెస్ మెన్’ రీరిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంట. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1.36 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కే ఈ రేంజ్ లో వసూలు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో డబ్బు, స్టేటస్ అంటే చాలా ఇష్టపడే పాత్రలో నటించిన అమ్మాయి పేరు ఆయేషా శివ. ఈమె కెనడాలో జన్మించిన భారతీయ నటి.
ఈ మూవీలో తన డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఆయేషా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. అలా బాలీవుడ్ మూవీలో చూసి, పూరీ జగన్నాథ్ ఆయేషాను ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసాడు. బిజినెస్ మెన్ మూవీ తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటించలేదు. రీసెంట్ గా ఆయేషాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ మరణ వార్త తెలిసి, ముందుగా పద్ధతిగా ఆయన మరణానికి బాధపడుతూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికి ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో గద్దర్ ఫ్యాన్స్ కరాటే కళ్యాణి పై మండిపడ్డారు.
తాను అయితే ఏ విషయం అయినా మొదట మనం పాటించి, ఆ తరువాత అమలు పరచాలని భావిస్తాను. కానీ గద్దర్ అందర్నీ అడవిదారి పట్టించి, తన కుమారుడిని మాత్రం అమెరికాకు పంపించారు. సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్లన్ని అందరికీ నచ్చనవసరం లేదు. అందరికి నచ్చేలా పోస్ట్లు పెట్టలేం, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం తన పద్దతిని మార్చుకోనని, ఎవరు తిట్టినా పట్టించుకోనని, తన పోస్ట్లు తన ఇష్టం అని చెప్పుకొచ్చారు.
హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలని ఒకే చేస్తూ, ఆ చిత్రాలలో నటిస్తూ ఉత్సాహంగా కొనసాగుతున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత చిరంజీవి పలు చిత్రాలలో నటించినప్పటికీ, వాటిలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సాధించింది. మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ ‘వేదాళం’ కు రీమేక్గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఆదివారం (ఆగస్టు 6న) ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ 2 రోజుల క్రితమే సెన్సార్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ నిడివి రెండు గంటల 39 నిమిషాల 49 సెకెన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ‘భోళా శంకర్’ సినిమాకి సెన్సార్ బోర్డు జారీ చేసిన రిపోర్టు బయటకు వచ్చింది. ప్రధానంగా ఈ చిత్రంలో మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలకు వచ్చే సమయంలో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికను హైలైట్ చేశారు. అదే కాకుండా డ్రగ్స్ సన్నివేశాల సమయంలోనే కూడా ఇలాంటి హెచ్చరికను పెట్టించారు.
అంతేకాకుండా ఈ మూవీలో ఇంటర్వెల్కు ముందుగా వచ్చే సన్నివేశంలో హీరో చిరంజీవి విలన్ తలను నరకడం హింసాత్మకంగా ఉందని, 6సెకెన్లు ఉన్న ఈ సీన్ కట్ చేశారు. ఈ సీన్ ప్లేస్ లో చిరంజీవి, తమన్నా క్లోజప్ షాట్ను జతపరిచారు. అలాగే ఇటీవల దసరాలో కూడా ఉన్న ఒక పదంతో వచ్చే డైలాగును సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేయించారని రిపోర్టులో చూపారు.
1. బండెనక బండి కట్టి – మా భూమి: