ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా పేరు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. తెలుగు చిత్రాలలో ఇప్పటికే 3 స్పెషల్ సాంగ్స్ చేసింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ మూవీలో కూడా ఒక ఐటెం సాంగ్ చేసింది.
అయితే ఈ పాట హిట్ అవుతుందో లేదో కానీ, ఊర్వశి రౌతేలా చేసిన ఒక ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఆ ట్వీట్ కి నెటిజెన్లు ఊర్వశిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇన్నాళ్లూ ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు ఒక ట్వీట్తో అనే కంటే ట్వీట్లోని రాసిన పదంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు ఆ ట్వీట్ కి సంతోషంతో కూడా కామెంట్లు పెడుతున్నారు. బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ కు విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది.
ట్రోల్ చేసేంతగా ఆ ట్వీట్ లో ఏముంది అంటే “మా చిత్రం #BroTheAvatar రేపు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం @పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ స్పేస్ను చేసుకోవడం సంతోషంగా ఉంది. మరణించిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక వ్యక్తి సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేదే ఈ కథ.’’ అని ఊర్వశి రౌతేలా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అని అనడంతో నెటిజన్లు, ప్రత్యర్ధి పార్టీల ఫ్యాన్స్ మాత్రం ఊర్వశిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆనందపడుతున్నారు. ఊర్వశి రౌతేలా ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాంటి కామెంట్స్ చేశారు. తమిళ మూవీ ‘ది లెజెండ్’ మూవీ ప్రమోషన్స్ లో అరుళ్ శరవణన్ ను పదేళ్ల తరువాత తమిళనాడు చీఫ్ మినిస్టర్ అవుతారని ఊర్వశి రౌతేలా అన్నారు. ఇప్పుడు ఆ వీడియో క్లిపింగ్ ను, ఈ ట్వీట్ కింద కామెంట్స్ లో షేర్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు.
I have seen this before👀 https://t.co/iNk5RmXJiR pic.twitter.com/lr3yx8lt5G
— PrayushKhanna🤴 (@prayushkhanna12) July 27, 2023
Also Read: BRO REVIEW : “పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కల్కి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా కల్కి 2898 ఏడీ సినిమాకి సీక్వెల్ ఉంటుందని వినిపిస్తోంది. ఈ విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలాగే మూవీలో ప్రభాస్ను ఎందుకు తీసుకున్నారనే విషయం గురించి కూడా మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడు తాను ఆలోచించడం లేదని నాగ్ అశ్విన్ అన్నారు. అలాగే ఈ మూవీ ఫ్రాంచైజీ గురించి కూడా ఇంత వరకు ఏం ప్లాన్ చేయలేదని చెప్పారు.
ఇక ‘కల్కి 2898 ఏడీ’ స్టోరీ రాసుకునే సమయంలో ఎవరు హీరో అయితే బాగుంటుందని ఆలోచించానని అన్నారు. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ను ఊహించుకునే ఈ స్టోరీ రాసుకున్నానని తెలిపారు. ఈ స్టోరీ కోసం తన ఆలోచనలో ప్రభాస్ మాత్రమే ఉన్నాడని, అందుకే ప్రభాస్ నే ఈ మూవీకి హీరోగా ఎంచుకున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
వల్లిపురం వసంతన్ ను నామ్ డి గెర్రే కెప్టెన్ మిల్లర్ అని పిలుస్తారు. శ్రీలంకలోని వేర్పాటువాద తమిళ మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) లో వసంతన్ సభ్యుడు. అతనే LTTE మొట్ట మొదటి బ్లాక్ టైగర్ గా పిలవబడ్డాడు. మిల్లర్ 1966లో జనవరి1న శ్రీలంకలో జన్మించాడు. అతను తున్నలైకి చెందిన వ్యక్తి. అతని తండ్రి బ్యాంక్ మేనేజర్, అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వసంతన్ పాయింట్ పెడ్రోలోని హార్ట్లీ కాలేజీలో చదువుకున్నాడు.
బ్లాక్ జులై తమిళ వ్యతిరేక అల్లర్ల వల్ల బాధితులయినవారి బాధలను చూసి తీవ్రంగా ప్రభావితమైన వసంతన్ 1983లో LTTEలో డ్రైవర్గా చేరాడు. ఒక సంవత్సరం తర్వాత అతను LTTE సభ్యుడుగా మారాడు. అప్పుడే అతనికి నామ్ డి గెర్రే మిల్లర్ (మిల్లర్) అనే పేరు వచ్చింది. వడమరచ్చి ఆపరేషన్ (ఆపరేషన్ లిబరేషన్) టైమ్ లో శ్రీలంక ఆర్మీ నెల్లియాడి మధ్య మహా విద్యాలయాన్ని స్వాధీనం చేసుకుని సైనిక స్థావరంగా మార్చింది. భారీగా పటిష్టపరచబడిన ఆ స్థావరాన్ని స్వాధీనం చేసుకోవాలని LTTE నిర్ణయించింది.
దాని కోసం బాంబులతో నింపిన వాహనాన్ని ఆ స్థావరం మధ్యలోకి తీసుకెళ్లాడానికి మిల్లర్ తనకు తానే ముందుకు వచ్చాడు. దానికి ముందుగా మిల్లెర్ 1987లో జూన్29 కుటుంబాన్ని, స్నేహితులను కలిశాడు. అదే ఏడాది జూలై 5న LTTE ఒక ట్రక్కులో బాంబులను నింపారు. ఆ తరువాత మిల్లర్ ఆ ట్రక్కును నడుపుకుంటూ నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో ఉన్న ఆర్మీ క్యాంపులోకి తీసుకెళ్ళాడు. సైనికులు కాల్పులు జరపడంతో మిల్లర్ చనిపోయాడు. కాని ట్రక్ వెళ్తూ ప్రధాన భవనంలోకి దూసుకెళ్లి అక్కడ పేలిపోయింది.
పేలుడుతో బస్సు అంత పరిమాణంలో పెద్ద బిలం ఏర్పడింది. మిల్లర్ ట్రక్కును అనుసరిస్తూ వెళ్ళిన ఇతర LTTE కార్యకర్తలు ఆర్మీ శిబిరం మీద దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎంతో మంది సైనికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ సంఘటన అంతా వీడియో తీయబడింది. మిల్లర్ చనిపోయిన తరువాత కెప్టెన్గా పదోన్నతి పొందాడు. మిల్లర్ LTTEలో గౌరవనీయమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అంతేకాకుండా LTTE ఆత్మాహుతి విభాగం బ్లాక్ టైగర్స్ చిహ్నం పై మిల్లర్ ముఖ చిత్రాన్ని పెట్టారు.
జూలై 5ను బ్లాక్ టైగర్స్ డే గా మార్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు బ్లాక్ టైగర్ అమరవీరులందరిని స్మరించుకునే రోజు. నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో మిల్లర్ బంగారు విగ్రహంతో పాటు ఒక మందిరాన్ని కూడా నిర్మించారు. అయితే 1996లో శ్రీలంక సైన్యం వడమరచ్చి ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మిల్లర్ మందిరాన్ని ధ్వంసం చేశారు. కానీ స్థానికులు మిల్లర్ విగ్రహాన్ని దాచిపెట్టారు.
2002లో నార్వేజియన్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సమయంలో కొత్త స్మారక ఫలకంను మరియు మిల్లర్ విగ్రహంను తిరిగి స్థాపించారు. యుద్ధం మళ్ళీ ప్రారంభమైన తర్వాత, 2006లో ఆగస్టు23న మిల్లర్ విగ్రహం పై దాడి చేసి ధ్వంసం చేశారు. అలాగే మందిరం యొక్క అవశేషాలను, మిల్లర్ విగ్రహం ఉన్న వేదిక, రాతి స్మారక ఫలకంను కూడా సైన్యం ధ్వంసం చేసింది.


రామిరెడ్డి టాలీవుడ్ లో అంకుశం సినిమా ద్వారా నట జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ మూవీలో ‘స్పాట్ పెడుతా’ అనే ఒక్క డైలాగ్తో ఆడియెన్స్ భయపడేలా చేశారు. దాంతో ఆయన పేరు అంకుశం రామిరెడ్డిగా మారింది. అసలు పేరు గంగసాని రామిరెడ్డి, ఆ మూవీ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించారు. రామి రెడ్డి ఇండియాలోని అన్ని భాషల సినిమాలలో నటించారు.
1959లో జనవరి 1న జన్మించిన రామిరెడ్డి కెరీర్ మొదట్లో సినిమాల వైపు దృష్టి సారించలేదు. జర్నలిస్ట్ కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అది పూర్తి కాగానే ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్గా చేరారు. అందులో భాగంగా సినీ సెలెబ్రెటీల ఇంటర్వ్యూలను రామిరెడ్డి తీసుకునేవారు. ఆ క్రమంలో రామిరెడ్డి ఒకసారి ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. అప్పుడు రామిరెడ్డి ప్రతిభను చూసి ముగ్ధుడైన కోడి రామకృష్ణ తను తీయబోయే సినిమాలో రామిరెడ్డికి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు.
అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీనే అంకుశం. ఈ మూవీ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీనే రామిరెడ్డి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ మూవినే బాలీవుడ్ లో ప్రతిబంధ్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఆ మూవీలో కూడా విలన్ గా రామిరెడ్డి నటించాడు. అక్కడ ప్రతిబంద్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో చిరంజీవి కంటే విలన్ గా నటించిన రామిరెడ్డి యాక్టింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అయింది. దాంతో బాలీవుడ్ లో రామిరెడ్డి భారీగా అవకాశాలు వచ్చాయి.
90వ దశకంలో, బాలీవుడ్లో రామిరెడ్డి పాపులర్ ఫేస్గా నిలిచారు. తెలుగు, హిందీలో నటిస్తూనే రామిరెడ్డి ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించారు. అలా ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రిష్ పూరి, ప్రేమ్ చోప్రా, డానీ డెంజోంగ్పా,అమ్జాద్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ వంటి విలన్లకు ఏ విధంగా తీసిపోని అరుదైన యాక్టర్ అయిన రామిరెడ్డి జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
రామిరెడ్డి చివరి వరకు తన నటనతో ఆడియెన్స్ ని అలరించాలని కోరుకున్నారు. కానీ 2010లో ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కాలేయ క్యాన్సర్తో ఉందని వైద్యులు గుర్తించి, రామిరెడ్డికి తెలిపారు. రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆఖరి రోజుల్లో అయితే రామిరెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. చివరికి 2011 లో ఏప్రిల్ 14న 52 ఏళ్ల వయసులో రామిరెడ్డి కన్నుమూశారు.
చనిపోయే కొద్ది రోజుల ముందు నుండే భార్య, పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో ఆయన నరకం అనుభవించారని రామిరెడ్డి సన్నిహితులు చెబుతుంటారు. రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలుస్తోంది. ఆయన కుమారుడు ప్రస్తుతం తండ్రి రామిరెడ్డి పేరుతో స్వీట్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నారని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానులు ఎలా సంబరాలు జరుపుకుంటారో తెలిసిందే. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ జాతర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ సంబరాలు ప్రారంభం అయ్యాయి.
పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీ తమిళ హిట్ సినిమా వినోదయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీతో పోలిస్తే తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి కీలక పాత్రలలో నటించారు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని మీమ్స్ శాసిస్తున్నాయి. గతంలో వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఈ ట్రెండ్ ఉండేది. ప్రస్తుతం ఇండియాలో కూడా మీమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే చిత్రాల పై కూడా ఫన్నీ మీమ్స్ చేసి నెటిజన్లు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన బ్రో మూవీ రిలీజ్ పై కూడా నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.






ఈ షో తొలి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి హీరో నానిలు హోస్ట్ గా చేశారు. ఆ తరువాత సీజన్స్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తికాగా, ఏడవ సీజన్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఏడవ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ అని సోషల్ మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది.
ఆ లిస్ట్ ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 లో ఈటివి ప్రభాకర్, యాంకర్ నిఖిల్, ఢీ కొరియోగ్రాఫర్ పండు, సింగర్ మోహన భోగరాజు, టిక్ టాక్ దుర్గారావు జంట, హీరో సాయిరోనక్, యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ వర్ష, సీరియల్ నటి శోభా శెట్టి లతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లుగా సమాచారం. మొత్తం 21 కంటెస్టెంట్స్ లో లీక్ అయ్యింది ఈ పది పేర్లు మాత్రమే.
మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లు మరికొన్ని రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అగ్రిమెంట్ల విషయంలో కొంత జాప్యం జరుగుతున్నందున స్టార్ మా ఛానెల్ కూడా షో ఎప్పటి నుంచి మొదలుపెడతారనే విషయం చెప్పడం లేదు. ప్రస్తుతానికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ టీమ్ కి ఏపీ హై కోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.








