సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వచ్చిందంటే చాలు అభిమానుల సందడి ఇంతా కాదు. ఆయన నడక, స్టైల్, యాక్టింగ్, ప్రతిదీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే ఇప్పుడు ఆఖరికి ఆయన సినిమా టైటిల్ కూడా… ఓ డైరెక్టర్ పొట్ట కొట్టే అంత ఇంపాక్ట్ చూపిస్తోంది. ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొస్తోంది. అసలు ఏమ్ జరిగిందంటే!!
ముందు ఒక మాట ఏంటంటే రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదల అవ్వడానికి రెడీగా ఉంది. కానీ ఈ సినిమాలో ఏదో సీన్ కో, లేక అందులోని నటులకో వచ్చిన సమస్య కాదు.

ఈ సినిమాకు ఎంతో ముఖ్యమైన టైటిల్ వల్లే పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే తమిళ్ లో జైలర్ పేరుతో రజినీకాంత్ తో భారీ సినిమా వస్తోంది. కానీ ఇదే టైటిల్ తో మలయాళ దర్శకుడు సక్కిర్ మడథిల్ కూడా ఓ సినిమా చిత్రీకరిస్తున్నారు. అక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. వాస్తవానికి తలైవా సినిమా వస్థే చాలా మంది మరో సినిమా వైపు కన్నెత్తి చూడరు. అలాంటిది ఒకటే పేరుతో రెండు సినిమాలు వస్తె అందరూ కచ్చితంగా రజినీకాంత్ సినిమానే చూస్తారు.

అలా జరిగితే సక్కిర్ మడథిల్ చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆయన ఈ సినిమా టైటిల్ మార్చమంటూ అప్పటికే సన్ పిక్చర్స్ వారిని సక్కిర్ మడథిల్ వేడుకోగా… అటు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఈ సినిమాను మడథిల్ కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారట. దీనికోసం తన కూతురి నగలు అమ్మి, కారు అమ్మేసి, త్వరగా అప్పు తీరిచుకోవచ్చులే అని ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుని మరీ ఈ సినిమాను తన సొంత డబ్బులతో నిర్మించానని చెప్పారు.

1957 లో జరిగిన నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా సక్కిర్ మడథిల్ ది. దీనికి జైలర్ అనే టైటిల్ 2021 లోనే రిజిస్టర్ చేయించానని… కానీ తర్వాతే తెలిసింది కొద్దిరోజులకు ఈ టైటిల్ తో రజినీకాంత్ – నెల్సన్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసిందట. మరి ఇప్పటికే సన్ పిక్చర్స్ వారిని వేడుకున్నా కూడా ఎటువంటి స్పందన రాలేదు… కనీసం రజినీకాంత్ గారైన అయినా స్పందిస్తే నా జీవితం బాగుపడుతుందని… లేకపోతే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా అప్పుడప్పుడు వస్తోందని వాపోయారు. మరి చివరికి ఏమవుతుందో, రజినీకాంత్ స్పందిస్తారో లేదో చూడాలి.
ALSO READ : “బ్రో” మూవీలో “సాయి ధరమ్ తేజ్ రెండవ చెల్లెలు” గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

బ్రో మూవీలో సాయి తేజ్ కి ఇద్దరు సిస్టర్లు ఉంటారు. వారిలో ఒకరు ప్రియా వారియర్ కాగా, రెండవ సిస్టర్ గా యువ లక్ష్మి నటించింది. ఆమె అసలు పేరు యువశ్రీ లక్ష్మి. ఆమె కోలీవుడ్ నటి, తమిళంలో పలు సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు లోని కారైకాల్ లో 2000వ సంవత్సరంలో డిసెంబర్ 25న జన్మించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన యువలక్ష్మికి భరతనాట్యం అంటే చాలా ఆసక్తి. ఆ నృత్యం నేర్చుకున్న ఆమె జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులను పొందింది.
ఆమె మొదటిసారి 2016 లో వచ్చిన అమ్మ కనక్కు అనే తమిళ చిత్రంలో అమలా పాల్ మరియు సముద్రఖనితో కలిసి నటించింది. ఆ తరువాత సముద్రఖని ‘అప్పా’ లో ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ‘ఆకాశమిత్తయి’ అనే సినిమా ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత శివకార్తికేయన్ నటించిన ‘వేలైకారన్ ‘ రాఘవ లారెన్స్ మూవీ కాంచన 3లో కూడా సహాయక నటి పాత్రలో యువ లక్ష్మి నటించింది. సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సీతమ్ సినిమాలో కూడా యువ లక్ష్మి కీలక పాత్రలో నటించింది. దూరదర్శన్ లో ప్రసారం అయిన సూపర్ కుటుంబంలో కూడా చేసింది. బ్రో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
















ఇటీవల వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాలో హీరోకు ‘గురక’ సమస్య ఉన్నట్టే, ‘జానకి జానే’ మూవీలో హీరోయిన్ కు ‘భయం’ అనే మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో ఈ మూవీలో చూపించారు. సైజు కురుప్, నవ్య నాయర్ ప్రధాన పాత్రలలో నటించగా, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, అనార్కలి మరికర్, షరఫ్ వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి జానకి (నవ్య నాయర్), చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఫ్యామిలీ భారం ఆమె పైనే పడుతుంది. అమ్మతో ఉంటూ ఒక ప్రెస్ లో వర్క్ చేస్తుంటుంది. అయితే జానకికి భయం ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఎవరైనా మాట్లాడినా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా, చీకటిగా ఉన్న చాలా భయపడుతుంది. ఒకసారి భయంతో జానకి స్పృహ తప్పి పడిపోగా, రోడ్ కాంట్రాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ (సైజు కురుప్) రక్షించి, ఇంటికి తీసుకెళ్తాడు.
జానకిని ప్రేమించిన ఉన్ని ముకుందన్ వారి పెద్దలను ఒప్పించి మరి జానకిని పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగుతున్న వీరి లైఫ్ లో ఎదురైన అనుకోని సంఘటన ఏమిటి ? దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అయిన షాజీ (కొట్టాయం నజీర్), మార్టిన్ (జార్జ్ కోరా) ఎలా ఉపయోగించుకున్నారు? దానివల్ల ఉన్ని, జానకి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఆఖరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
ఇన్నాళ్లూ ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు ఒక ట్వీట్తో అనే కంటే ట్వీట్లోని రాసిన పదంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు ఆ ట్వీట్ కి సంతోషంతో కూడా కామెంట్లు పెడుతున్నారు. బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ కు విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది.
ట్రోల్ చేసేంతగా ఆ ట్వీట్ లో ఏముంది అంటే “మా చిత్రం #BroTheAvatar రేపు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం @పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ స్పేస్ను చేసుకోవడం సంతోషంగా ఉంది. మరణించిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక వ్యక్తి సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేదే ఈ కథ.’’ అని ఊర్వశి రౌతేలా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అని అనడంతో నెటిజన్లు, ప్రత్యర్ధి పార్టీల ఫ్యాన్స్ మాత్రం ఊర్వశిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కల్కి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా కల్కి 2898 ఏడీ సినిమాకి సీక్వెల్ ఉంటుందని వినిపిస్తోంది. ఈ విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలాగే మూవీలో ప్రభాస్ను ఎందుకు తీసుకున్నారనే విషయం గురించి కూడా మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడు తాను ఆలోచించడం లేదని నాగ్ అశ్విన్ అన్నారు. అలాగే ఈ మూవీ ఫ్రాంచైజీ గురించి కూడా ఇంత వరకు ఏం ప్లాన్ చేయలేదని చెప్పారు.