పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ ’బ్రో‘. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ’వినోదియ సిత్తం‘ మూవీకి రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
తమిళంలో దర్శకత్వం వహించిన డైరెక్టర్ సముద్రఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ లో సముద్రఖని చేసిన దేవుడి పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ది అతిథి పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంలో పవన్ ఎంతసేపు కనిపిస్తాడో ఇప్పుడు చూద్దాం..
‘బ్రో’ మూవీలో పవన్ కళ్యాణ్ టైమ్ గాడ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో తన పాత్ర చిత్రీకరణను కేవలం 3 వారాల్లో పూర్తి చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఈ మూవీలో చేసేది గెస్ట్ క్యారెక్టర్ అని ఫ్యాన్స్, నెటిజెన్లు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయం పై సాయిధరమ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో 80-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ మూవీలో 80-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు. సినిమా మొదటి పదిహేను నిమిషాలు పవన్ కళ్యాణ్ లేకుండా స్టోరీ నడుస్తుందని వెల్లడించాడు. ఆ సమయంలో తన పాత్ర పైనే స్టోరీ నడుస్తుందని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. అప్పటి నుండి క్లైమాక్స్ వరకు పవన్ క్యారెక్టర్ కొనసాగుతుందని, తన వెంటే ఎప్పుడూ ఉండే క్యారెక్టర్ పవన్ దని తెలిపాడు. మూవీలో గంట 50 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.
మూవీలో తనకు ఒక డ్యూయెట్, పవన్ తో కలిసి మరో పాట ఉంటుందని, మిగిలిన రెండు సాంగ్స్ మాంటేజ్ తరహా పాటలని తెలిపాడు. పవన్ నటించింది దేవుడి పాత్రే కానీ గోపాల గోపాల సినిమాలో ఉన్నట్టు సీరియస్ గా ఉండదని, ఎంటర్టైనింగ్ గా, ఫ్యాన్స్ కు నచ్చేలా సముద్రఖని, త్రివిక్రమ్ తీర్చిదిద్దారని చెప్పాడు. పవన్ చాలా సరదాగా ఈ క్యారెక్టర్ ను చేశారని, ఇద్దరి మధ్య ఉండే బంధం ఈ మూవీకి హైలైట్ అని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.
Also Read: ప్రభాస్ “కల్కి 2898 AD” లో ఉన్న సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… ఆ సినిమాల నుండి కాపీ కొట్టారా..?

ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీలో కమల హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటాని కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండగా, నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ మూవీ భారతీయ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. ఈ గ్లింప్స్ తో ఆ విషయాన్ని మర్చిపోయేలా చేశారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అయితే కొందరు నెటిజెన్లు మాత్రం ఈ గ్లింప్స్ ని 2 హాలీవుడ్ సినిమాలని కలిపి తీసినట్టుగా ఉందని అంటున్నారు. హాలీవుడ్ సినిమాలు డూన్, స్టార్ వార్స్ ని కలిపి తీసినట్టుగా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక బీజీఎం ఐతే అదే సంతోష్ నారాయణ్ కాబట్టి ‘దసరా’ సినిమా బీజీఎం విన్నట్టుగా ఉందని అంటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ K’ టైటిల్ రివీల్ అయింది. ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ను ప్రకటించారు. ఇక ‘ప్రాజెక్ట్ k’ లో ఏముంది? అనే విషయాన్ని గ్లిమ్ప్స్ రూపంలో చూపించారు. ఈ గ్లిమ్ప్స్ నిడివి 1 నిముషం 16 సెకన్ల ఉంది. ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించబోతున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. “ప్రపంచాన్ని చీకటి కమ్మినపుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడే అంతం మొదలవుతుంది ” అని ప్రారంభం అయిన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించేలా ఉంది.
శాన్డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్లో విడుదలైన తొలి భారతీయ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డ్ సృష్టించింది. ఈ వేడుకలో కమల్ హాసన్, హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి తదితరులు సందడి చేశారు. ఇది ఇలా ఉంటే ‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.







తాజాగా రిలీజ్ అయిన ప్రాజెక్ట్ K ప్రభాస్ ఫస్ట్ లుక్ లో సూపర్ హీరోలా ఉన్న బాడీకి ప్రభాస్ తలను అతికించినట్లుగా ఉందని ప్రభాస్ అభిమానులే నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. నెటిజెన్లు ఈ పోస్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజెన్లు రిలీజ్ అయిన పోస్టర్లలో ఏది బాగుందో తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల ఇటీవల కాలంలో స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల నుండి పోస్టర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరుకారం మూవీ నుండి మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ పై నెటిజెన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 నుండి అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లుఅర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
మే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. తాజాగా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ ఆరు సినిమాల పోస్టర్లలో పుష్ప, గుంటూరుకారం సినిమాల పోస్టర్లు బాగున్నాయని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ K మూవీని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ 2024లో జనవరి 12న రిలీజ్ కానుంది. హాలీవుడ్లో ప్రాజెక్ట్ కే సందడి మొదలైంది. మరి కొన్ని గంటల్లో ప్రాజెక్ట్ కే టైటిల్ గ్లింప్స్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్, కమల్ హాసన్, రానా వంటివారు అమెరికా చేరుకున్నారు.
ప్రాజెక్ట్ కే యూనిట్ కు స్వాగతం చెప్తూ అక్కడి వారు ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే సాండియాగోలో జరుగుతున్నఈ ఈవెంట్కు దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని, ప్రస్తుతం అక్కడ ‘హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్’ సమ్మె జరుగుతోంది.
దీపికా పదుకొనే ఈ అసోసియేషన్లో మెంబర్ గా ఉన్నారు. సమ్మె జరుగుతుండడంతో అందులోని మెంబర్స్ అయిన నటీనటులు సినీ ఈవెంట్స్ కానీ, ప్రమోషన్స్ లో కానీ పాల్గొనకూడదని యూనియన్ పేర్కొంది. అందువల్ల ప్రాజెక్ట్ K ఈవెంట్కు దీపిక హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారట.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరి నటులు కూడా నటిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కీలక పాత్రలో నటిస్తోంది. టైం ట్రావెల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి గ్లింప్స్ రేపు(జులై 21) విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో ప్రభాస్ ఐరన్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. గత చిత్రాలతో పోలిస్తే ‘ప్రాజెక్ట్ K’ లో ప్రభాస్ కొత్తగా కనిపించాడు. ఈ పోస్టర్ ను డిజైన్ చేసిన వ్యక్తి పేరు నిఖిల్ అనుదీప్. ఇతను ఒక గ్రాఫిక్ డిజైనర్. ఈ పోస్టర్ కన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి మూవీ పోస్టర్, వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ రష్మిక నటిస్తున్న మూవీ పోస్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
హిరణ్యకశ్యప సినిమాని రానా చేస్తాడని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా కామిక్ కాన్లో ఈ సినిమాని రానా ప్రకటించాడు. తన సొంత సంస్థలోనే ఈ సినిమాను రానా నిర్మించనున్నాడు. అమరచిత్ర కథ కామిక్స్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రాయనున్నాడు. అయితే హిరణ్యకశ్యప మూవీని గుణశేఖర్ 2019లోనే ప్రకటించారు. ఇది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు, హీరోగా రానాను ప్రకటించారు.
గుణశేఖర్ ఏళ్ల తరబడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పై వర్క్ చేశారు. ఈ చిత్రం గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. తాజాగా రానా ప్రకటించడంతో గుణశేఖర్ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఆయన చేసిన ట్వీట్ ఆ మూవీ గురించే అని అంటున్నారు. ట్వీట్ లో గుణశేఖర్, ‘దేవుడిని మీ స్టోరీకి ప్రధాన ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది’ అని రాసుకొచ్చాడు.
గుణశేఖర్ ఇందులో ఎవరి పేరును వెల్లడించనప్పటికీ, రానా, త్రివిక్రమ్ లను లక్ష్యం చేశారని సమాచారం. తన కష్టాన్ని మరిచిపోయి ఆ సినిమాని వేరే వారికి అప్పగించిన రానా, ఈ మూవీకి స్క్రిప్ట్ అందిస్తున్న త్రివిక్రమ్ లకు నైతికత లేదని గుణశేఖర్ ఫీల్ అవుతున్నట్టు నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొందరు గుణశేఖర్ కు సపోర్ట్ చేస్తూ రానా, త్రివిక్రమ్ లను తిడుతున్నారు.