ఇటీవల జబర్దస్త్ కమెడియన్ వేణు ‘బలగం’ మూవీ ద్వారా దర్శకుడిగా మారి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ దర్శకుడిగా మారి ‘నాతో నేను’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ గా పేరు గాంచిన సాయి కుమార్, ఆదిత్యా ఓం, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. బుల్లితెరపై తన కామెడీతో అలరించిన శాంతి కుమార్ దర్శకుడిగా తెరకెక్కించిన ‘నాతో నేను’ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, జీవితంలో ఎన్నో కష్టాలు పడి, ఉన్నత స్థానానికి ఎదిగిన కోటీశ్వరరావు(సాయికుమార్) సడెన్ గా చనిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలో కోటీశ్వరరావు ఉండే గ్రామానికి వచ్చిన ఒక స్వామిజీ అతని కష్టాన్ని విని ఒక వరమిస్తాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పవద్దని అంటాడు. స్వామిజీ కోటేశ్వరరావుకు ఇచ్చిన వరం ఏమిటి? వరం పొందిన తరువాత కోటేశ్వరరావు జీవితంలో కష్టాలు పోయాయా? కోటేశ్వరరావు జీవితంలో నాగలక్ష్మీ (దీపాళీ), దీప (ఐశ్వర్య) ఎవరు అనేవాటికి సమాధానమే మిగిలిన కథ.
మనిషి అనే దానికన్నా డబ్బు మీదే ఆధారపడి జీవితం నడుస్తోంది అనే కథతో తెరకెక్కిన సినిమా. 20, 40, 60 వయసు స్టేజ్ ల వారీగా సాగిన ఈ స్టోరీలో సాయికుమార్, సాయి శ్రీనివాస్, ఆదిత్యా ఓం, పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ సీన్స్ ను దర్శకుడు నడిపించిన విధానం బాగుంది. మంచి చేసినపుడు అది ఎక్కడికి పోదు అనే విషయాన్ని చక్కగా చూపించారు. కోటీశ్వరుడిగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. సాయికుమార్ డైలాగ్లు బాగున్నాయి.
ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన వ్యక్తిగా ఆదిత్య ఓం, బ్రేకప్ అయిన యువకుడిగా సాయి శ్రీనివాస్ చక్కగా నటించారు. రాజీవ్ కనకాల, సీవీఎల్ నరసింహరావు బాగా నటించారు. సాయి శ్రీనివాస్, ఐశ్వర్య క్యారెక్టర్లు యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. తొలిసారి డైరెక్షన్ చేసిన శాంతి కుమార్ స్టోరీనే బాగా రాశారు. కానీ తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. ఫీల్ గుడ్ మూవీ అందించేందుకు ప్రయత్నించారు. ఎంత డబ్బు సంపాదించిన మనిషికి మన అనుకునే తోడు లేకపోతే వారి జీవితంలో సంతోషంగా ఉండదు అనడానికి నిదర్శనమే ‘నాతో నేను’ మూవీ.
Also Read: ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..! అంతగా ఏం ఉంది ఇందులో..?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2989 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ హాలీవుడ్ మూవీలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో, ‘గ్రేట్ జాబ్ నాగి మరియు వైజయంతి మూవీస్. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాని తెరకెక్కించడం చాలా కష్టమైన పని, మీరు దీన్ని సాధ్యం చేసారు. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఇక మిగిలింది ఒక్క ప్రశ్న మాత్రమే, మూవీ రిలీజ్ ఎప్పుడు’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై జక్కన్న సన్నిహితులు, ఫాలోవర్స్, నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు. బాహుబలి మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ ‘రిలీజ్ డేట్ గురించి అడుగుతోంది ఎవరో చూశారా అని సరదాగా ట్వీట్ పెట్టారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ స్మైల్ ఎమోజీలు పెట్టాడు.
రాజమౌళి శోభు యార్లగడ్డ ట్వీట్ కి ‘అంటే అది’ అని పాపులర్ అయిన లక్ష్మి సినిమాలోని బ్రహ్మానందం మీమ్ తో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ రాజమౌళిని ఉద్దేశించి ‘మీరు చాలా స్వీట్. చాలా హంబుల్. మీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ట్వీట్ చేశారు.
ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భవిష్యత్తులో రాబోయే యుగాంతానికి సంబంధించిన స్టోరీ అని తెలుస్తుంది. సూపర్ పవర్స్ ఉన్న ఒక హీరో ప్రజలను ఎలా కాపాడాడు అనే థీమ్ తో తెరక్కెకుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్లింప్స్ లో ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సైన్యం కనిపిస్తుంది. వాళ్ళందరికి లీడర్ గా నటించిన నటుడి పేరు శాశ్వత ఛటర్జీ.
ప్రముఖ బెంగాలీ నటుడు. ఈ యాక్టర్ ఈ మూవీతోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన శాశ్వత ఛటర్జీ, ఎన్నో సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విద్యాబాలన్ నటించిన కహానీ మూవీ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత జగ్గా జాసూస్, దిల్ బేచారా, దోబారా, ధాకడ్ వంటి హిందీ చిత్రాలలో నటించారు.






‘బ్రో’ మూవీలో పవన్ కళ్యాణ్ టైమ్ గాడ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో తన పాత్ర చిత్రీకరణను కేవలం 3 వారాల్లో పూర్తి చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఈ మూవీలో చేసేది గెస్ట్ క్యారెక్టర్ అని ఫ్యాన్స్, నెటిజెన్లు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయం పై సాయిధరమ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో 80-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ మూవీలో 80-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు. సినిమా మొదటి పదిహేను నిమిషాలు పవన్ కళ్యాణ్ లేకుండా స్టోరీ నడుస్తుందని వెల్లడించాడు. ఆ సమయంలో తన పాత్ర పైనే స్టోరీ నడుస్తుందని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. అప్పటి నుండి క్లైమాక్స్ వరకు పవన్ క్యారెక్టర్ కొనసాగుతుందని, తన వెంటే ఎప్పుడూ ఉండే క్యారెక్టర్ పవన్ దని తెలిపాడు. మూవీలో గంట 50 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.
మూవీలో తనకు ఒక డ్యూయెట్, పవన్ తో కలిసి మరో పాట ఉంటుందని, మిగిలిన రెండు సాంగ్స్ మాంటేజ్ తరహా పాటలని తెలిపాడు. పవన్ నటించింది దేవుడి పాత్రే కానీ గోపాల గోపాల సినిమాలో ఉన్నట్టు సీరియస్ గా ఉండదని, ఎంటర్టైనింగ్ గా, ఫ్యాన్స్ కు నచ్చేలా సముద్రఖని, త్రివిక్రమ్ తీర్చిదిద్దారని చెప్పాడు. పవన్ చాలా సరదాగా ఈ క్యారెక్టర్ ను చేశారని, ఇద్దరి మధ్య ఉండే బంధం ఈ మూవీకి హైలైట్ అని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.
అయితే కొందరు నెటిజెన్లు మాత్రం ఈ గ్లింప్స్ ని 2 హాలీవుడ్ సినిమాలని కలిపి తీసినట్టుగా ఉందని అంటున్నారు. హాలీవుడ్ సినిమాలు డూన్, స్టార్ వార్స్ ని కలిపి తీసినట్టుగా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక బీజీఎం ఐతే అదే సంతోష్ నారాయణ్ కాబట్టి ‘దసరా’ సినిమా బీజీఎం విన్నట్టుగా ఉందని అంటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ K’ టైటిల్ రివీల్ అయింది. ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ను ప్రకటించారు. ఇక ‘ప్రాజెక్ట్ k’ లో ఏముంది? అనే విషయాన్ని గ్లిమ్ప్స్ రూపంలో చూపించారు. ఈ గ్లిమ్ప్స్ నిడివి 1 నిముషం 16 సెకన్ల ఉంది. ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించబోతున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. “ప్రపంచాన్ని చీకటి కమ్మినపుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడే అంతం మొదలవుతుంది ” అని ప్రారంభం అయిన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించేలా ఉంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.



