అటు సినిమాలతో, ఇటు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు అన్న తర్వాత వారి జీవితం తెలిసిన పుస్తకం లాంటిదే.
వారి వ్యక్తిగత విషయాలు కూడా అందరికీ తెలుస్తాయి. అలా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి పవన్ ఎప్పుడూ ప్రస్తావించక పోయినా కూడా అందరికీ తెలుసు. వేల సంఖ్యలో అభిమానులు మరియు అభిమాన సంఘాలు ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఇటు సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అందరికీ పవన్ కళ్యాణ్ రెండవ భార్య అయిన రేణు దేశాయ్ మరియు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్యగా ఉన్న లేజీనావో గురించి బాగా తెలుసు కానీ ఆయన మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 1997 ప్రాంతంలో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయితో పెద్దల సమక్షంలో పవన్ కళ్యాణ్ వివాహం జరిగింది.

పెద్దలు కుదిరిచి చేసిన పెళ్లి వివాహం తర్వాత మనస్పర్ధలు కారణంగా విడాకుల వరకు వెళ్ళింది. 2007 లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో విడాకుల భరణం కింద పవన్ కళ్యాణ్ కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు నందినికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2010 లో అమెరికాకు చెందిన కృష్ణారెడ్డి అనే డాక్టర్ ని వివాహం చేసుకొని నందిని ప్రస్తుతం ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.

పరస్పరం పసగనప్పుడు విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన భార్యకు ఎప్పుడూ అన్యాయమైతే చేయలేదు. ఆమెకు జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా ఆస్తిని పంచి ఇచ్చారు. అయితే అనవసరంగా ఈ విషయం ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఇటు పవన్ కళ్యాణ్ కే కాదు అటు ఆయన అభిమానులకు కూడా ఎంతో బాధాకరంగా ఉంది.
ALSO READ : “ప్రాజెక్ట్ K” ఈవెంట్కు హాజరు కానీ “దీపికా పదుకొనే”.. కారణం ఏమిటంటే..?

తాజాగా రిలీజ్ అయిన ప్రాజెక్ట్ K ప్రభాస్ ఫస్ట్ లుక్ లో సూపర్ హీరోలా ఉన్న బాడీకి ప్రభాస్ తలను అతికించినట్లుగా ఉందని ప్రభాస్ అభిమానులే నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. నెటిజెన్లు ఈ పోస్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజెన్లు రిలీజ్ అయిన పోస్టర్లలో ఏది బాగుందో తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల ఇటీవల కాలంలో స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల నుండి పోస్టర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరుకారం మూవీ నుండి మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ పై నెటిజెన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 నుండి అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లుఅర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
మే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. తాజాగా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ ఆరు సినిమాల పోస్టర్లలో పుష్ప, గుంటూరుకారం సినిమాల పోస్టర్లు బాగున్నాయని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ K మూవీని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ 2024లో జనవరి 12న రిలీజ్ కానుంది. హాలీవుడ్లో ప్రాజెక్ట్ కే సందడి మొదలైంది. మరి కొన్ని గంటల్లో ప్రాజెక్ట్ కే టైటిల్ గ్లింప్స్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్, కమల్ హాసన్, రానా వంటివారు అమెరికా చేరుకున్నారు.
ప్రాజెక్ట్ కే యూనిట్ కు స్వాగతం చెప్తూ అక్కడి వారు ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే సాండియాగోలో జరుగుతున్నఈ ఈవెంట్కు దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని, ప్రస్తుతం అక్కడ ‘హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్’ సమ్మె జరుగుతోంది.
దీపికా పదుకొనే ఈ అసోసియేషన్లో మెంబర్ గా ఉన్నారు. సమ్మె జరుగుతుండడంతో అందులోని మెంబర్స్ అయిన నటీనటులు సినీ ఈవెంట్స్ కానీ, ప్రమోషన్స్ లో కానీ పాల్గొనకూడదని యూనియన్ పేర్కొంది. అందువల్ల ప్రాజెక్ట్ K ఈవెంట్కు దీపిక హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ చిత్రం పై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరి నటులు కూడా నటిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కీలక పాత్రలో నటిస్తోంది. టైం ట్రావెల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి గ్లింప్స్ రేపు(జులై 21) విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో ప్రభాస్ ఐరన్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. గత చిత్రాలతో పోలిస్తే ‘ప్రాజెక్ట్ K’ లో ప్రభాస్ కొత్తగా కనిపించాడు. ఈ పోస్టర్ ను డిజైన్ చేసిన వ్యక్తి పేరు నిఖిల్ అనుదీప్. ఇతను ఒక గ్రాఫిక్ డిజైనర్. ఈ పోస్టర్ కన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి మూవీ పోస్టర్, వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ రష్మిక నటిస్తున్న మూవీ పోస్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

హిరణ్యకశ్యప సినిమాని రానా చేస్తాడని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా కామిక్ కాన్లో ఈ సినిమాని రానా ప్రకటించాడు. తన సొంత సంస్థలోనే ఈ సినిమాను రానా నిర్మించనున్నాడు. అమరచిత్ర కథ కామిక్స్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రాయనున్నాడు. అయితే హిరణ్యకశ్యప మూవీని గుణశేఖర్ 2019లోనే ప్రకటించారు. ఇది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు, హీరోగా రానాను ప్రకటించారు.
గుణశేఖర్ ఏళ్ల తరబడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పై వర్క్ చేశారు. ఈ చిత్రం గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. తాజాగా రానా ప్రకటించడంతో గుణశేఖర్ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఆయన చేసిన ట్వీట్ ఆ మూవీ గురించే అని అంటున్నారు. ట్వీట్ లో గుణశేఖర్, ‘దేవుడిని మీ స్టోరీకి ప్రధాన ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది’ అని రాసుకొచ్చాడు.
గుణశేఖర్ ఇందులో ఎవరి పేరును వెల్లడించనప్పటికీ, రానా, త్రివిక్రమ్ లను లక్ష్యం చేశారని సమాచారం. తన కష్టాన్ని మరిచిపోయి ఆ సినిమాని వేరే వారికి అప్పగించిన రానా, ఈ మూవీకి స్క్రిప్ట్ అందిస్తున్న త్రివిక్రమ్ లకు నైతికత లేదని గుణశేఖర్ ఫీల్ అవుతున్నట్టు నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొందరు గుణశేఖర్ కు సపోర్ట్ చేస్తూ రానా, త్రివిక్రమ్ లను తిడుతున్నారు.


“బేబీ సినిమా ఎలా ఉంది? దానిపై మీ రివ్యూ ఏంటి?” అని కోరాలో ప్రశ్నించగా, దానికి
కాకపోతే కొన్ని ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉంటాయంటే అసలు ఈ సినిమా తీయడం నిజంగా అవసరమా ? అన్న భావన కలుగుతుంది. ఆ కోవలోకే ఈ “బేబీ ” సినిమా వస్తుంది. డైరెక్టర్ సాయి రాజేష్ హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో మనల్ని నవ్వించాడు. కలర్ ఫోటో లాంటి సినిమాకు కథ రాసి జనాల గుండెలను తాకాడు. కానీ బేబీ లాంటి సినిమా తీసి విజయమైతే సాధించాడు కానీ, ఒక దర్శకుడిగా తన స్థాయిని బాగా తగ్గించుకున్నాడు. ఇందులో కథ గురించి చెప్పడానికి ఏమి లేదు ట్రైలర్ లో చూపించిందే.
ఒక స్కూల్ అమ్మాయి ( వైష్ణవి చైతన్య ) అబ్బాయిని (ఆనంద్ దేవరకొండ ) ప్రేమిస్తుంది. అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. వైష్ణవి మట్టుకు ఇంజనీరింగ్ కాలేజీ దాకా వెళుతుంది. అక్కడ ఉండే కొత్త పోకడలకు పూర్తిగా ఆకర్షితురాలై తన ప్రవర్తన, అలవాట్లు, డ్రెస్సింగ్, ఆలోచనలు అన్ని మార్చేసుకుంటుంది. స్వతహా మొదటి నుంచి వైష్ణవికి రిచ్ లైఫ్, గిఫ్టుల మీద ఆశ ఎక్కువ ఉండటం వలన తప్పు దారి పడుతుంది. అక్కడ కలిగే కొత్త పరిచయాలు, అట్లాగే విరాజ్ కొత్తగా తన జీవితంలోకి రావడం, అతనితో స్నేహాన్ని మించిన బంధం.
ఒకేసారి ఆనంద్, విరాజ్ ఇద్దరితో ఆడుకోవడం, చెడు స్నేహాలు, ఇలా ఒక్కో పరిస్థితి వలన తెలియకుండానే వైష్ణవి ఒక ఊబిలో పడిపోతుంది. ఇంకా క్లైమాక్స్ ఏంటి అని స్క్రీన్ మీద చూడాలి. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఉంది. సినిమాలో క్యారెక్టర్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లే ఉంటాయి. ఉదాహరణకు ఆనంద్, వైష్ణవి, విరాజ్, కుసుమ, సీత వంటివి. ఈ మధ్యన మన తెలుగు దర్శకుల పంథా ఎలా ఉందంటే బయట టీనేజ్ పిల్లలు, లేదా 20ల్లో ఉన్న వాళ్ళు బాతులు బాగా వాడుతారు. కాబట్టి, బయట జరిగిందే చూపిస్తున్నాం కదా అని అంటారు.
ముఖ్యంగా అమ్మాయిలను నెగటివ్ గా చూపించడం అనేది Rx 100 తో ఊపందుకుంది. 2005 లో మన్మథలో చూపించారు. ఇప్పడూ అది బ్యాక్ టూ బ్యాక్ చూపిస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు బ్రహ్మ రథం పడుతున్నారు . అందరు అమ్మాయిలు ఇలా ఉన్నారని కాదు కానీ, బహుశ సమాజంలో అమ్మాయిల్లో వస్తున్న మార్పుని దర్శకుడు చూపించే ప్రయత్నం చేసాడని అనిపించింది. సినిమా హిట్ అయింది అంటే జనాలు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు అని అర్ధం. బహుశ కొన్ని పరిస్థితులు బయట అలానే ఉన్నాయేమో అనిపించింది.
ఫ్యామిలిస్ ఈ సినిమా చూడటం అనేది చాలా దూరం. ఒక్క టీనెజర్స్, కాలేజీ స్టూడెంట్స్ తప్ప ఈ సినిమాని ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఆ దశలో ఉన్న వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇప్పడీ తరం అమ్మాయిలు అబ్బాయి ఈ సినిమా లో చూపించిన విరాజ్, వైష్ణవిలాగానే ఉన్నారు. అబ్బాయిలు చాలా మంది తమని ఆనంద్ దేవరకొండ క్యారక్టర్ తో తమని తాము పోల్చుకుంటారు. ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాతో దర్శకుడు ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. దాదాపు అదే పంథాలో ఈ సినిమా కూడా సాగుతుంది.
కాకపోతే ఈ సినిమాలో వైష్ణవి పరిస్థితుల వలన చెడిందైతే, ఆర్ ఎక్స్ 100 లో హీరోయిన్ క్యారెక్టర్ పరమ వరస్ట్ గా ఉంటుంది. నటినటుల గురించి మాట్లాడుకోవాలి అంటే, ముందుగా వైష్ణవి గురించి చెప్పాలి. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో అందరికి తెలిసిన వైష్ణవి. బేబీలో చాలా బాగా నటించింది. ఒక స్కూల్ అమ్మాయిగా, కాలేజీ అమ్మాయిగా, చెడు దోవ పట్టిన అమ్మాయిలాగ వేరియేషన్స్ చాలా అద్భుతంగా చూపించింది. ఎక్కడ కూడా మోనోటనీ రాలేదు. ప్రతి క్యారక్టర్ లో కొత్తగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. బాడీ లాంగ్వేజ్ కూడా మారింది.
మొదట చేసిన తీన్మార్ డాన్స్ నుంచి,టెన్త్ క్లాస్ అమ్మాయిగా, ఆనంద్ ప్రేయసిగా, ఆ తరువాత ఒక హై క్లాస్ అమ్మాయిగా విరాజ్ కు కలరింగ్ ఇచ్చేడప్పుడు, మందు తాగి ఆనంద్ తో మాట్లాడేటప్పుడు, బాడీ లాంగ్వేజ్ కానీ, వేరియేషన్ కానీ అద్భుతంగా చూపించింది. వైష్ణవి పాత్రని బాగా పండించింది. వైష్ణవి స్టార్ హీరోయిన్ కాకపోవచ్చు. కాని ఐశ్వర్య రాజేష్ లా మంచి నటిగా గుర్తింపు పొందుతుందని అనుకుంటున్నాను. ఆనంద్ నటనతో తన ప్రత్యేకతను చాటాడు. ప్రేయసి మోసం చేస్తే ఒక ప్రియుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆ బాధను బాగా చూపించాడు.
మనసారా ప్రేమించిన అమ్మాయి గుండెల్లో గుచ్చితే ఎలా ఉంటుందో చాలా బాగా తెలిసేలా నటించాడు. విరాజ్ ఉన్నంతలో బాగానే చేసాడు. ఇంకా మిగతా వాళ్లంతా వాళ్ళ వాళ్ళ పరిధుల్లో బాగానే నటించారు. సినిమా కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా, సాగుతుంది. ఒక్క ప్రీ క్లైమాక్స్ మాత్రమే బాగా సాగదీసినట్టు అనిపించింది. విరాజ్ క్యారక్టర్ విషయంలో మట్టుకు దర్శకుడు రాజేష్ కొంచెం కంఫ్యూజ్ చేసాడు. విరాజ్ వైష్ణవిని ప్రేమిస్తున్నాడా? కామిస్తున్నాడా ? అన్న క్లారిటీ లేకుండా చేసాడు.
కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది సినిమా రిచ్ గా కనిపించి కానీ ఎక్కడ కూడా చిన్న సినిమాలాగా అనిపించలేదు. మొదటి నుంచి ఫేమస్ అయిన ” ఓ రెండు మేఘాలిలా ” పాట మంచి ఫీల్ ఉన్న టైంలో సినిమాలో వస్తుంది. అనంత శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ చాలా అద్భుతంగా రాసాడు. మన్మధ, ఆర్ ఎక్స్ 100, బేబీ లాంటి సినిమాలతో ఇప్పుడు హీరోయిన్లు ఎంత బ్యాడ్ అయితే అంతగా జనాలు పడి పడి చూస్తున్నారా? అన్న భావన కలిగేలా దర్శకులు మార్చేశారు. ఈ సినిమా చూడాలి అంటే 22 ఏళ్ళ వాళ్ళ లాగ ఫీల్ అయ్యి చూడాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలము.
ఫ్యామిలిస్ ఇంకా లేడీస్ మట్టుకు ఈ సినిమాకు కచ్చితంగా దూరంగా ఉండొచ్చు. ఒక నెల తరువాత ఓటీటీలో ఫ్రీగా వచ్చింది కదా అని కక్కుర్తి పడి అందరి ముందర చూడొద్దు సినిమాలో చాలా చోట్ల, సీన్లు, బూతులు ఉంటాయి. ఇళ్లలో పెద్దవాళ్ళ ముందర లేదా పిల్లల ముందర పరువు పోతుంది. ఇయర్ ఫోన్స్ యే శరణ్యం, తస్మాత్ జాగ్రత్త. వన్ లైన్ రివ్యూ దీని గురించి రాయాలి అంటే ” Oh baby.. సినిమా హిట్ అయితే కొట్టావు కానీ తెలుగు సినిమా స్థాయిని ఇంకో 4 మెట్లు దిగజార్చావు, ఈ తరం అబ్బాయిలకు అమ్మాయిల మీద అనుమానాలు పెంచావు” అని బేబీ గురించి చెప్పారు.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12


