భారీ అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రం భారీ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ గ్రాఫిక్స్ సరిగ్గా లేని కారణంగా మరియు కొన్ని డైలాగ్స్ కారణంగా ఈ చిత్రం విపరీతమైన నెగెటివిటీని ఫేస్ చేసింది. జూన్ 16వ తారీఖున విడుదలైన ఈ చిత్రం పది రోజులు కూడా గడవకముందే బ్యాన్ చేయాలి అనే రేంజ్ లో ప్రేక్షకులు డిమాండ్ చేశారు అంటే చిత్రంపై ఎటువంటి దుష్ప్రభావం పడి ఉంటుందో ఆలోచించండి.

స్వర్ణ లంకను బొగ్గు లంకగా చూపించడం, హనుమంతుడి చేత మాస్ డైలాగ్స్ చెప్పించడం లాంటి పలు అభ్యంతర సన్నివేశాల వల్ల ఈ చిత్రానికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు సినిమాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ మరియు పోస్ట్ ల వల్ల చిత్రం ఇమేజ్ కూడా బాగా దెబ్బతినింది. దీని ప్రభావం నేరుగా సినిమా కలెక్షన్స్ మీద పడింది.సినిమా విడుదలైన వీకెండ్ తీసి పక్కన పెడితే ఆ తర్వాత కలెక్షన్స్ పెద్దగా ఏమీ రాలేదు.

ఈ మూవీ ని నమ్ముకొని భారీ కలెక్షన్స్ వస్తాయని ఆశించిన డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ యజమానులు లబోదిబోమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలుపుకొని 82 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ మరియు 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ఈ చిత్రం సంపాదించింది. ఇక కర్ణాటకలో 12 కోట్లు ,తమిళనాడులో 2.40 కోట్లు , కేరళలో 87 లక్షలు రాబట్టింది. ఇక హిందీలో విడుదలైన ఈ చిత్రం నార్త్ ఇండియా అంతా కలిపి 70 కోట్ల షేర్ కలెక్షన్స్ సంపాదించింది.

ఓవర్సీస్ పరిస్థితి అంతే…వీకెండ్ లో మంచి కలెక్షన్స్ వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా అక్కడ కూడా సినిమా కలెక్షన్స్ విపరీతంగా పడిపోయాయి. మొత్తానికి 25 కోట్ల రేంజ్ వరకు షేర్ వసూలు అయ్యాయి అని తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తానికి ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో కలిపి 240 కోట్లు వసూలు చేసింది అంటే ఇంకా దగ్గర దగ్గర 49 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ తగ్గాయి. అంటే సినిమాకు పెట్టిన పెట్టుబడిలో దాదాపు 45 కోట్లకు పైగా నష్టం వచ్చిందని అర్థం. కంటెంట్ కనెక్ట్ కాకపోతే ఎంత భారీ చిత్రమైనా బోల్తా పడాల్సిందే అనడానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్.






2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డ వివాహం గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ అందరు కలిసి వీరి పెళ్లి వేడుకను ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో భారీగా ఖర్చు పెట్టి, రాజస్థాన్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్యల పెళ్లి జరిపించారు. అప్పట్లో వీరి పెళ్లి గురించి దేశవ్యాప్తంగా మీడియా కవరేజ్ చేసింది. నిహారిక పెళ్లి కోసం సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ జంట అన్యోన్యంగా కనిపించింది.
కానీ గత కొంతకాలం నుండి నిహారిక, చైతన్యలు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. వీటి పై మెగా కుటుంబంలోని వారెవరూ స్పందించలేదు. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డకు విడాకులు మంజూరు చేసినట్లు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వెల్లడించింది. ఇదే విషయన్ని నిహారిక, చైతన్య సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
నిహారిక చైతన్యలు ఎందుకు విడిపోయారనే విషయం అయితే బయటికి రాలేదు.
పూజాహెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత వరుసగా సినిమాల ఆఫర్లు రావడంతో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ పూజాహెగ్డే వరుసగా హిట్లను అందుకుంది. ఇక డైరెక్టర్లకు కూడా పూజాహెగ్డే లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అలా మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది.
అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పూజాహెగ్డే నటించిన 5 సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. దాంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే ను తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగిన తరువాత ఆమె ఆ మూవీ నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పూజాహెగ్డే తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో పూజాహెగ్డే ఒక యంగ్ హీరోతో నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. ‘విరూపాక్ష’మూవీతో విజయం సాధించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో పూజహెగ్డే నటిస్తోందని తెలిసింది. ఈ మూవీని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించనున్నారు. దర్శక నిర్మాతలు ఈ మూవీ కోసం ఇప్పటికే పూజాహెగ్డేను సంప్రదించారని, పూజా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికార ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం.
మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి సినిమాలతో ఆడియెన్స్ ని పలకరించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబి’ తో ఆడియెన్స్ ముందుకి మరోసారి రాబోతున్నాడు. ఈ సినిమాని సాయిరాజేష్ నీలం తెరకెక్కించాడు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా, యాక్టర్ విరాజ్ అశ్విన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికే ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ మూవీ రిలీజ్ కు ముందే హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పై చాలా బజ్ క్రియేట్ అయ్యింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది. జులై 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే సెన్సార్ జరిగే సమయంలో ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడంతో ఆ డైలాగులను మ్యూట్ చేయాలని సెన్సార్ చిత్రబృందాన్ని కోరినట్టు తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా కొన్ని విజువల్స్ ని కట్ చేశారని సమాచారం.
ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకి ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీని అందరు ఒక మిడిల్ క్లాస్ యువకుడి లవ్ స్టోరి అని అనుకున్నారు. అయితే తాజాగా బేబీ సినిమా సెన్సార్ అప్ డేట్ గురించి తెలియడంతో అభిమానులు కంగారుపడుతున్నారట. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆడియెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సౌందర్య ఈ మూవీలో హీరోయిన్ పాత్ర లో నటించగా రమ్యకృష్ణ మాత్రం నెగిటివ్ రోల్ చేసింది. ఆనాడు రమ్యకృష్ణకు మంచి నటిగా మరింత పేరు తెచ్చిన పాత్రల్లో ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్ ఉంటుంది.
రమ్యకృష్ణ తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటి నుండి తెలుసని రవికుమార్ చెప్పుకొచ్చారు. అయితే రమ్యకృష్ణ, సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ చేయాలని చెప్పగానే రమ్యకృష్ణ మాత్రం ఆ సీన్ చేయనని రవి కుమార్ కు చెప్పరట. అయితే సౌందర్య మార్కెట్ ఎక్కువ అని నా మార్కెట్ తక్కువ అని రమ్యకృష్ణ చెప్పారట. కానీ సౌందర్య మాత్రం నువ్వే చెయ్యాలి.
అంటూ ఆమె కాళ్లు తన ముఖం పై పెట్టుకున్నారని కె.ఎస్.రవికుమార్ వెల్లడించారు. కానీ రమ్య కృష్ణ ఆ సమయంలో ఏడ్చారని కామెంట్ చేశారు. ఆ షాట్ రియల్ అని కె.ఎస్.రవికుమార్ తెలియజేశారు. అందులో రమ్యకృష్ణ సౌందర్య నటించారని డుప్ ఏమీ లేదని రవికుమార్ అన్నారు. ఈ మూవీ కె.ఎస్.రవికుమార్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఆయన అన్నారు.
వారసుడు మూవీ తరువాత స్టార్ హీరో విజయ్ దళపతి మరో తెలుగు దర్శకుడితో చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ దర్శకుడే గోపీచంద్ మలినేని. ఈ ఏడాది వీరసింహారెడ్డితో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ హీరో విజయ్ ను కలిసి కథ వినిపించించారని, మొదటి సిట్టింగ్లోనే విజయ్ కథను ఓకే చేశారని టాక్ వచ్చింది. గోపీచంద్ చెప్పిన స్టోరీ విజయ్కి బాగా నచ్చిందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దాంతో వీరిద్దరి కాంబో పై అధికారిక ప్రకటన వస్తుందని అంతా భావించారు.
కానీ, అదే టైంలో విజయ్ దళపతి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో మూవీని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. గోపీచంద్ తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభు విజయ్కి స్టోరి వినిపించారు. దాంతో గోపీచంద్ చెప్పిన స్టోరి పక్కన పెట్టారు. కారణం ఏమిటా అని ఆరా తీసిన తమిళ మీడియా వార్తల ప్రకారం, వచ్చే రెండు ఏళ్లలో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.
వెంకట్ ప్రభు చెప్పిన కథలో లోకల్ కంటెంట్ మరియు స్థానిక రాజకీయాల గురించి ప్రస్తావన ఉంటుందట. అందుకే ఈ కథను ఒకే చేశారని, ఈ మూవీని వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసి, ఆ తర్వాత పాలిటిక్స్ వైపు వస్తారని అంటున్నారు. ఇటీవల విజయ్ మూడేళ్ళ పాటు సినిమాలకు విరామం ఇస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా జవాన్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవించందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రివ్యూ రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 12సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని జాగ్రత్తగా, స్టోరీ అంతగా అర్ధమయ్యే అవకాశం ఇవ్వకుండా గ్రాండ్ విజువల్స్ తో ఎడిట్ చేశారు. షారుఖ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్ లో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిన వెర్షన్లు పెట్టారు.
‘ఎవరు నేను, ఏవరిని కాను, తెలియదు. తల్లికిచ్చిన మాట కావచ్చు. నేరవేరని లక్ష్యం కావచ్చు’ అంటూ మొదలైన ప్రివ్యూ ఆద్యంతం షారుక్ డైలాగ్స్, లుక్స్, యాక్షన్ తో ఆకట్టుకుంది. ఇందులో షారుక్ పోలీస్ డ్రెస్ లో, ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. ఇక చివర్లో గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచారు. ‘ఇది ఆరంభం మాత్రమే’ మరియు ‘నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు’ అని చెప్పే షారుక్ డైలాగ్స్ ప్రివ్యూకి హైలైట్ గా నిలిచాయి.
విజయ్ సేతుపతి లుక్ బాగుంది. అయితే ఆయన పాత్రని రివీల్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె యాక్షన్ షాట్ బాగుంది. స్టైలిష్ ఆఫీసర్ గా నయనతారను చూపించారు. ఇది ఇలా ఉంటే జవాన్ ట్రైలర్ ప్రివ్యూ పై సోషల్ మీడియాలో లు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.



