సాధారణంగా చాలా సినిమాల్లో ముందు ఒక హీరోని అనుకొని, తర్వాత ఒక హీరో ఆ సినిమా చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అలా ఎంతో మంది హీరోలకి మొదట ఒక సినిమా కథ వెళ్లడం, కొన్ని కారణాల వల్ల వారు ఆ సినిమా చేయకపోవడం, ఆ తర్వాత మరొక హీరో ఆ సినిమా చేయడం అనేది జరుగుతూ ఉంటాయి.
అలా కొంత మంది హీరోలు ఎంతో పెద్ద హిట్ సినిమాలని మిస్ చేసుకున్నారు. విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా నటించిన హిట్ సినిమా దేశముదురు. ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ స్టైల్ అన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హన్సిక హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యారు.

అయితే ఈ సినిమా కథని అంతకుముందు మరొక హీరోకి వినిపించారు. ఆ హీరో ఎవరో కాదు సుమంత్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమా కథని సుమంత్ కి వినిపించారు. హీరో ఒక సన్యాసినితో ప్రేమలో పడతాడు అని డైరెక్టర్ స్టోరీ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత కొన్ని కారణాలవల్ల సుమంత్ ని ఈ కథ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో సుమంత్ ఈ సినిమాని చేయలేను అని చెప్పేశారు.

అప్పుడు ఈ కథ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అల్లు అర్జున్ ఈ కథ విని సినిమా చేస్తానని చెప్పారు. అలా అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో చేసి మరొక హిట్ అందుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు బాల గోవింద్ పాత్రలో అల్లు అర్జున్ ని తప్ప మరొక నటుడిని ఊహించుకోలేము అని అన్నారు. అల్లు అర్జున్ చేసిన డాన్స్, యాక్షన్ అవన్నీ కూడా ప్రేక్షకులకి తెగ నచ్చేసాయి.

అందుకే ఈ సినిమాకి ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. అందులో అల్లు అర్జున్ డైలాగ్స్ చెప్పిన స్టైల్ కూడా ప్రేక్షకులకు డిఫరెంట్ గా అనిపించింది. ఒకరకంగా అల్లు అర్జున్ ని స్టార్ గా మరొక మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఈ సినిమాతో అల్లు అర్జున్ హిట్ కొట్టారు. మాస్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నారు.













విజువల్ వండర్ గా రూపొందిన ‘ఆది పురుష్’ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించిగా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్. హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ప్రదర్శించే ధియేటర్లలో ఒక సీటును ఆంజనేయస్వామి కోసం కేటాయిస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీనిపై కొందరు ప్రమోషనల్ స్టంట్ అని అంటే, కొందరు శ్రీరాముడి కథ చెప్తున్నప్పుడు ఆంజనేయస్వామి కోసం సీటు వదిలితే తప్పు ఏమిటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో రక రకాల చర్చలు జరుగుతున్న క్రమంలో తాజాగా వాట్సాప్ మెసేజ్ ఒకటి వైరల్ గా మారింది. ఆదిపురుష్ సినిమా చూసే సమయంలో పాటించాల్సిన నియమాలు అంటూ వాట్సాప్ గ్రూప్ లలో తిరుగుతోంది. ఆ నియమాలు ఇవే..
ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ఏపీ, తెలంగాణలో అన్ని ఏరియాల హక్కుల కోసం భారీగా పోటీ ఏర్పడింది. దీని ఫలితంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ప్రభాస్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాలలో 3వ స్థానానికి చేరింది. ఈ చిత్రం కంటే ముందు బాహుబలి 2 సినిమా 122 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
ఆదిపురుష్ మాత్రమేకాకుండా ప్రభాస్ గత 4 సినిమాలకు కూడా ఏపీ, తెలంగాణలో వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. బాహుబలి 2 సినిమాకి రూ.122 కోట్లు, సాహో సినిమాకి రూ.121.60 కోట్లు, రాధే శ్యామ్ సినిమాకు రూ.105.20 కోట్లు, ఆదిపురుష్ సినిమాకి రూ.120 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ విధంగా ప్రభాస్ గత 4 సినిమాలకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలోమొత్తం రూ. 468.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా బిజినెస్ చేసిన ఒకే ఒక హీరోగా ప్రభాస్ రికార్డును క్రియేట్ చేశాడు.
‘ఆదిపురుష్’ చిత్రం రీలీజ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడిగా తమ అభిమాన స్టార్ ను వెండితెర పై వీక్షించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచాయి. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణ మహాకావ్యాన్ని కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. రామాయణ కథ అందరికి తెలిసిన స్టోరీనే అయినా ఓం రౌత్ టేకింగ్, గ్రాఫిక్స్ ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు, వివాదాలు వచ్చాయి. కొన్ని ఇంకా కొనగుతున్నాయి. వీటి మధ్యే జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తనకు తానే ఓవర్సీస్ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ చిత్రం పై నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.
‘ఆదిపురుష్’ టార్చర్ అని, ప్రభాస్, కృతి సనన్ బ్యాడ్లక్ బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుందని ట్వీట్ చేశాడు. ‘పెద్ద స్టార్స్, భారీ బడ్జె్, వీఎఫ్ఎక్స్ ఉన్న భారీ చిత్రం. కానీ ఈ మూవీలో సోల్ లేదు. నటీనటులందరు వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్ మీకు యాక్టింగ్ క్లాసులు అవసరం’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ప్రభాస్ కి ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా? ఈ రేంజ్ కి వచ్చారు అంటే అంత స్కిల్ ఉండబట్టే కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ చూడకుండా రివ్యూ ఏంటని అని తిడుతున్నారు.
ఒకప్పడు హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన శరత్కుమార్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వారసుడు, పీఎస్ 2 సినిమాల ద్వారా ఆడియెన్స్ ను పలకరించారు. శరత్ కుమార్ డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాన పత్రలో నటించిన తమిళ చిత్రం ‘పోర్ థోజిల్’ విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రిలీజ్ అయినప్పటి నుండి పాజిటివ్ తెచ్చుకున్న ఈ మూవీ, కోలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే తిరుచ్చి అనే ఊరులో ఒక సైకో అమ్మయిలను వరుసగా చంపేస్తుంటాడు. ఆ సైకో ఎవరు? అతను అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు. కొత్తగా పోలీస్ జాబ్ లో చేరిన ప్రకాష్ (అశోక్ సెల్వన్) ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. ఇలాంటి చిత్రాలు గతంలో ఎన్నో వచ్చాయి. కానీ ఈ చిత్రంలో స్క్రీన్ప్లే ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉండడంతో ఆడియెన్స్ ని స్టోరీతో పాటు ప్రయాణించేలా చేస్తుంది.
కొత్త దర్శకుడు అయినప్పటికీ విఘ్నేష్ రాజా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్తగా పోలీసు డిపార్ట్మెంట్ లో చేరిన వ్యక్తిగా అశోక్ సెల్వన్, సీనియర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య ఉండే ఇగో, సీన్స్ చాలా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ గా టాలీవుడ్ మూవీ ఉయ్యాల జంపాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్, ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, తాను నేను, సినిమా చూపిస్తా మావ, రాజు గారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. హిందీ సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో ఆమె నటించిన 1920:హార్రర్ ఆఫ్ ద హార్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది.
ఈక్రమంలో అవికా గోర్ ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనిలో ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. “దక్షిణాది ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. అక్కడ స్టార్ హీరోల పైనే ఇండస్ట్రీ నడుస్తోంది. అక్కడి ఆడియెన్స్ కూడా స్టార్స్ చిత్రాలనే చూస్తారని, టాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ.” అని అవికా గోర్ కామెంట్స్ చేసింది. నెటిజెన్లు అవికా గోర్ కామెంట్స్ పై మండిపడుతున్నారు. తెలుగు చిత్రాలలో నటించి, గుర్తింపు వచ్చిన తరువాత అదే ఇండస్ట్రీ పై ఇలాంటి కామెంట్లు చేయడం సరి కాదని అంటున్నారు.
రణబీర్ కపూర్,సందీప్ రెడ్డి వంగా వంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ టి సీరీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 11న 5 భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా యానిమల్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. టీజర్ లో స్కల్ మాస్క్ పెట్టుకొన్న ఒక గ్యాంగ్ హీరో రణబీర్ కపూర్ పై అటాక్ చేయడం, రణబీర్ వారిపై అటాక్ చేయడంతో ఆ గ్యాంగ్ భయంతో పరుగులు తీస్తారు. ఈ టీజర్ రక్తపాతాన్ని తలపించింది.
అయితే ఇందులో చూపించిన యాక్షన్ సీన్స్ 2003లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ‘ఓల్డ్ బాయ్’నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి కాపీ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ మూవీ కూడా స్క్వాడ్ గేమ్స్, ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్, ఓల్డ్ బాయ్ లాంటి కొరియన్ సినిమలను మిక్స్ చేసి, తీశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ టీజర్ రిలీజ్ తరువాత సందీప్ రెడ్డి వంగాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.