ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న చిత్రం ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో నటించడం, ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన కథలు ఆదరణ పొందుతున్నాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించారు. ఆయనకు జంటగా సీతాదేవి పాత్రలో హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16న ఈమూవీ రిలీజ్ కానుంది. ఓవర్సీస్ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఆదిపురుష్ రివ్యూ ఇస్తూ ట్వీట్ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘ఆదిపురుష్’ చిత్రం రీలీజ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడిగా తమ అభిమాన స్టార్ ను వెండితెర పై వీక్షించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచాయి. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణ మహాకావ్యాన్ని కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. రామాయణ కథ అందరికి తెలిసిన స్టోరీనే అయినా ఓం రౌత్ టేకింగ్, గ్రాఫిక్స్ ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు, వివాదాలు వచ్చాయి. కొన్ని ఇంకా కొనగుతున్నాయి. వీటి మధ్యే జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తనకు తానే ఓవర్సీస్ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ చిత్రం పై నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.
‘ఆదిపురుష్’ టార్చర్ అని, ప్రభాస్, కృతి సనన్ బ్యాడ్లక్ బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుందని ట్వీట్ చేశాడు. ‘పెద్ద స్టార్స్, భారీ బడ్జె్, వీఎఫ్ఎక్స్ ఉన్న భారీ చిత్రం. కానీ ఈ మూవీలో సోల్ లేదు. నటీనటులందరు వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్ మీకు యాక్టింగ్ క్లాసులు అవసరం’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ప్రభాస్ కి ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా? ఈ రేంజ్ కి వచ్చారు అంటే అంత స్కిల్ ఉండబట్టే కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ చూడకుండా రివ్యూ ఏంటని అని తిడుతున్నారు.
Also Read: సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది..!..! ఈ సినిమా గురించి తెలుసా..?