యాంకర్ అంటే హాస్యాన్ని పండిస్తూ.. నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వాలి. ఇలా చేస్తే యాంకర్లకు అస్సలు తిరుగు ఉండదు. సెన్సాఫ్ హ్యూమర్, భాషపై పట్టు కూడా ఉంటే కెరీర్ లో విఫలం అనేది ఉండదు. పైగా ఇవి కెరీర్ కి ప్లస్ అవుతాయి. యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే.
ఆమె కోసం మనం కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్ వంట షోస్ లో రష్మీ యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ రష్మికి తెలుగు అంతగా రాకపోవడమే మైనస్ అని చెప్పవచ్చు. ఆమె తెలుగుని పట్టి పట్టి మాట్లాడుతుంది. కేవలం ఆమె గ్లామర్ తోనే ఆకర్షిస్తుంది.
తాజాగా రష్మీ రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకరింగ్ చేసింది. అయితే నవీన్ పోలిశెట్టి వచ్చే వరకు రష్మీ యాంకరింగ్ చేయడంలో ఇబ్బంది పడలేదు. కానీ నవీన్ పోలిశెట్టి వచ్చి ఎనర్జీని అంతా ఉపయోగించే సరికి రష్మీ సైలెంట్ అయ్యిపోవలసి వచ్చింది. ఇంత పెద్ద వేదికని అవకాశంగా రష్మి మార్చుకోవాల్సింది కాస్త వృధా అయిపోయింది. అయితే నవీన్ అతనికి తెలియకుండానే రష్మి కెరీర్ ని చిక్కుల్లో పడేసాడు అని అంటున్నారు.