రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా రాజధాని ఫైల్స్. తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సంఘటనలతో ముడిపడిన సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మొన్న యాత్ర 2 రిలీజ్ అయింది కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అంటూ మరొక సినిమా వచ్చింది.
ఈ సినిమా ఫిబ్రవరి 15న విడుదలైంది. సినిమా కథ ఏమిటంటే అరుణ ప్రదేశ్ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది స్టేట్లో రాజధానిని ఐరావతిగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాజధాని నిర్మాణం కోసం భూములు కావాల్సి ఉంటుంది. అధికారులు ఊరూరా తిరిగి భూములు సేకరిస్తారు.

రైతు నాయకుడు( వినోద్ కుమార్) ప్రోద్బలం తో రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకుంటారు. అయితే రాజధాని నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా తర్వాత ఎన్నికలు జరగటం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చిన కొత్త సీఎం ( విశాల్ పట్నీ) నాలుగు రాజధానుల పేర్లని తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. గత ప్రభుత్వం స్థాపించిన రాజధానిని మనం పూర్తి చేయటం ఏమిటి అని పీకే సలహా ఇవ్వటంతో రాజధాని పనులు ఆగిపోతాయి రైతులు రోడ్డున పడతారు రైతు నాయకుడి సమక్షంలో నిరసన తెలియజేశారు.

వీరి నిరసనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం అరాచకాలను చూసిన రైతు నాయకుడు కొడుకు గౌతమ్ కూడా జనంతో కలుస్తాడు. అయితే పీకేతో కలిసి సీఎం వేసిన ఎత్తుగడలేమిటి? ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఏం చేశారు? రాజధాని విషయంలో దర్శకుడు ఇచ్చిన పరిష్కారం ఏమిటి అనేది సినిమా. ఈ సినిమాలో పాత్రలు తప్పితే నటులు కనిపించరు. వాణి విశ్వనాథ్ వినోద్ కుమార్ అంత బాగా నటించారు. వారి కుమారుడు గౌతమ్ గా అఖిలన్ నటించాడు.

ముఖ్యమంత్రి,ఎంపీలు, ఎమ్మెల్యేలుగా నటించిన నటులు నిజ జీవితం వ్యక్తుల్ని గుర్తు చేస్తూ ఆ పాత్రలలో మంచి అభినయం ప్రదర్శించారు. పీకే కెమెరా, సంగీతం, కూర్పు అన్ని పర్వాలేదనిపించాయి. ఈ సినిమాకి వాస్తవ నేపద్యం, భావోద్వేగాలు మాటలు నటీనటులు, పతాక సన్నివేశాలు ప్లస్ పాయింట్లు అయితే ఆరంభ సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఇక రేటింగ్ విషయానికి వస్తే సినిమాని రేటింగ్ పేరుతో తక్కువ చేయలేము.
watch trailer :













లోకనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్ తో ఏఎన్ఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు. ఒకసారి ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆప్యాయంగా పలకరించి… రండి బ్రదర్ కూర్చోండి… మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు… మీరు మీ సంపాదనను ఇనుపు ముక్కల మీద పెట్టకండి… స్థలాలు, ఇల్లు కొనుక్కోండి అవే మనల్ని కాపాడతాయి… స్టార్ డం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అని సలహా ఇచ్చారట.





ఆనంద్ మూవీలో సమత అనే అల్లరి పిల్ల పాత్రలో నటించిన బాలనటి అసలు పేరు బఖితా ఫ్రాన్సిస్. 2004లో ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బఖితా ఫ్రాన్సిస్ ఉత్తమ బాల నటిగా నంది అవార్డు అందుకుంది. అయితే ఆమె ఈ మూవీ తరువాత మళ్ళీ వెండితెర పై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. బఖితాకు నటిగా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ యాక్టింగ్ తన ఫ్యాషన్ కాదట. శేఖర్ కమ్ముల కోసమే సరదాగా ఆనంద్ మూవీలో నటించిందట.
బఖితా వయసు 26 ఏళ్ళు. ఆమె సమాజ సేవలో ప్రస్తుతం బిజీగా ఉంది. 17 ఏళ్ళ వయసు నుండే బఖితా ఫ్రాన్సిస్ మహిళల హక్కుల కోసం, సొసైటీలో మహిళలకు మగాళ్లతో సమనంగా హక్కులు కల్పించాలని పోరాడుతుంది. అలాగే అమ్మాయిల పై దాడులు గాని, అ-త్యా-చా-రా-లు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని పోరాటం చేస్తోంది. సొసైటీకి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం తనను ఇలా ఆలోచించేలా చేసిందని అని వెల్లడించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బఖితా, తరచూ తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఈ ఫోటోలను చూసిన కొందరు చాలా అందంగా ఉన్నారు. మళ్ళీ సినిమాల్లో నటించొచ్చు కదా అని అడిగితే, అది తనకు ఇష్టం లేదని బఖితా ఫ్రాన్సిస్ చెప్పారట.
గుర్ఫతే సింగ్ పిర్జాదా అక్క మరెవరో కాదు. ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’ మూవీలో సందడి చేసిన మెహ్రీన్ పిర్జాదా. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వరుణ్ తేజ్కి జంటగా మెహ్రీన్ నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో కూడా నటించి అలరించింది.
మెహ్రీన్ పిర్జాదా 1995లో పంజాబ్లో నవంబర్ 5న సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె తమ్ముడు గుర్ఫతే సింగ్ పిర్జాదా అనే తమ్ముడు ఉన్నాడు. అతను మోడల్ మరియు నటుడు. మెహ్రీన్ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు. ఆ మూవీ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
మహానుభావుడు, కవచం, రాజా ది గ్రేట్, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 లాంటి చిత్రాలలో మెహ్రీన్ పిర్జాదా నటించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ చిత్రాలలో నటించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మెహ్రీన్ తరచూ తన ఫోటో షూట్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. మెహ్రీన్ పెట్టే పోస్టులకు లైకుల, కామెంట్లు పెడుతుంటారు.