Filmy Adda
స్టార్ హీరోలు అందరి సరసన నటించిన టాప్ హీరోయిన్…కానీ చివరి రోజుల్లో అలాంటి నరకం చూసి.?
మొదటి సినిమాతో హిట్ సాధించి, మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.

సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆర్తి అగర్వాల్ కి కూడా స్టార్ డమ్ తీసుకొచ్చింది. నువ్వు నాకు నచ్చావ్ ఆర్తి అగర్వాల్ మొదటి తెలుగు సినిమా. అంతకు ముందే పాగల్ పన్ అనే హిందీ సినిమాలో నటించారు. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, బాబి, పలనాటి బ్రహ్మనాయుడు, ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్లారు ఆర్తి అగర్వాల్.

ఆ సమయంలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించారు. తర్వాత 2005 లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దెబ్బలు తగలడంతో ఆర్తి అగర్వాల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తెలుగు ఫిల్మీ బీట్ కథనం ప్రకారం ఆర్తి అగర్వాల్ ఇలా చేయడానికి ఒక యువ హీరోతో ప్రేమలో ఉండడం, ఆ ప్రేమ విఫలం అవ్వడమే కారణం అనే వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత నటిగా మళ్లీ తన కెరీర్ ని కొనసాగించారు ఆర్తి అగర్వాల్. 2006లో సునీల్ సరసన అందాల రాముడు సినిమాలో నటించారు. ఆ తర్వాత గోరింటాకు, దీపావళి, పోసాని జెంటిల్మెన్, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, వనకన్య వండర్ వీరుడు సినిమాలో నటించారు. 2007 లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఆర్తి అగర్వాల్ వివాహం జరిగింది. వారిద్దరూ 2009 లో విడిపోయారు.

2015లో ఆర్తి అగర్వాల్ లైపోసెక్షన్ సర్జరీ చేయించుకున్నారు. 2015 జూన్ 6వ తేదీన ఆర్తి అగర్వాల్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చనిపోయేముందు ఆర్తి అగర్వాల్ ఊపిరి సంబంధిత సమస్యలతో బాధ పడ్డారట. ఆర్తి అగర్వాల్ మరణానికి కారణం గుండెపోటు అని ఆర్తి అగర్వాల్ మేనేజర్ తెలిపారు. ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులపై ఎలాగ డాక్టర్స్ పై కూడా అప్పుడు కేసు నమోదు అయ్యిందట. ఆర్తి అగర్వాల్ మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురయింది. ఆర్తి అగర్వాల్ చివరిగా ఆమె ఎవరు అనే సినిమాలో కనిపించారు.
పెళ్లి రద్దు చేసుకుంటున్నాం అంటూ షాకింగ్ న్యూస్ చెప్పిన మెహరీన్… ఎందుకంటే..?
“కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” సినిమా తో తెలుగు వారికి పరిచయమైన భామ మెహరీన్. తక్కువ సమయం లోనే మెహరీన్ మంచి నటి గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అందం, అభినయం తెలుగు వారిని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత ఎఫ్ 2 సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. దాదాపు ఆమె పోషించిన పాత్రలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఇటీవల మెహరీన్ పెళ్లి కూడా నిశ్చయమైన సంగతి తెలిసిందే. కెరీర్ టాప్ లో ఉండ గానే మెహరీన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. పెద్దలు నిర్ణయించిన వ్యక్తి భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ నిశ్చితార్ధం కూడా జరిగింది. ఈ ఏడాది మార్చి లోనే ఈ వేడుక జరిగింది. కరోనా కారణం గా వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. మరి కొన్ని రోజుల్లో.. పెళ్లి తేదీని కూడా ఖరారు చేస్తారని అందరు అనుకుంటున్న తరుణం లో మెహరీన్ షాకింగ్ న్యూస్ చెప్పింది.

తమ వివాహం రద్దు కాబోతున్నట్లు మెహరీన్ ప్రకటించింది. “నేను, భవ్య బిష్ణోయ్ వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇద్దరం స్నేహపూర్వకం గానే, పూర్తి మద్దతు తో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక పై భవ్య బిష్ణోయ్ తో గాని, అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కానీ ఎటువంటి రిలేషన్ ఉండదని తెలుపుతున్నాను. ఇంత వరకు మాత్రమే చెప్పగలను, నా ప్రైవసీ కి కూడా రెస్పెక్ట్ ఇస్తారని, అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను” అంటూ మెహరీన్ చెప్పుకొచ్చారు. ఇకపై సినిమాలపై, తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు.
“ఇలాంటివి చూస్తే ఫారినర్స్ కి మనపై ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది..?”అంటూ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్..అసలు సంగతి ఏంటంటే..?
సాధారణం గా ఎయిర్ పోర్ట్ లు అంటే సకల సౌకర్యాలతో ఉంటాయి. దేశ, విదేశాల నుంచి ప్రయాణించే వారు ఎక్కువ గా ఉంటారు కాబట్టి ఫెసిలిటీస్ విషయం లో ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తారు. మరి దేశ రాజధాని అయిన ఢిల్లీ లో ఉండే ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉండాలి..? దేశ ప్రగతిని కూడా ప్రతిబింబిస్తుంది కాబట్టి మరింత సౌకర్యవంతం గా ఉండాలి.

ఈ విషయమై దర్శక ధీర రాజమౌళి ఇటీవల ఓ ట్వీట్ చేసారు. ఇటీవల ఓ పని పై ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన రాజమౌళి అక్కడ పరిస్థితి పై స్పందించారు. ఆయన అర్ధరాత్రి సమయం లో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఇందుకోసం కొన్ని పేపర్స్ ని కూడా ఇచ్చారు. అయితే.. అక్కడ చాలా మంది ఈ పేపర్స్ ను గోడపై లేదా కింద కూర్చుని ఫిల్ చేస్తున్నారు.

దేశ రాజధాని లో ఉండే ఎయిర్ పోర్ట్ కే ఇలాంటి ఇబ్బందులు ఉండడం పై రాజమౌళి అసహనం చెందారు. టేబుల్స్ ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమి కాదన్నారు.. ‘ఇలా చూడడం ఏమి బాగోలేదని, చిన్న టేబుల్స్ ఏర్పాటు చేసినా సౌకర్యం గా ఉండేదని, బయట కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.. ఇలాంటివి చూసినప్పుడు విదేశీయులకు మనపై ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆలోచించాలని” ట్వీట్ చేసారు. వీటిపై దృష్టి సారించాలని ఆయన అధికారులను కోరారు. కాగా.. ఎయిర్పోర్ట్ లోని సౌకర్యాలపై దృష్టి పెట్టాలంటూ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అయింది. రాజమౌళి ట్వీట్ కు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వారు తమ స్పందన ను కూడా తెలియచేసారు.
Dear @DelhiAirport,
arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passenges are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service.— rajamouli ss (@ssrajamouli) July 2, 2021
సాధారణం గా ఒక భాష లో హిట్ అయిన సినిమాలను మరో భాష లోకూడా రీమేక్ చేస్తుంటారు. సినిమా లో కంటెంట్ బాగుంటే ఇతర భాషల్లో కూడా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టేస్తాయి. అలా..బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన ఏడు సినిమాలు..తెలుగు సినిమాలనుంచి రీమేక్ చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. జుడ్వా – హలో బ్రదర్

జుడ్వా 1997 భారతీయ హిందీ యాక్షన్ కామెడీ చిత్రం, ఈ సినిమా కు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, రంభ మరియు కరిష్మా కపూర్ సరసన డబుల్ రోల్ లో నటించారు. ఇది 1994 లో విడుదలైన హలో బ్రదర్ యొక్క రీమేక్, నాగార్జున సౌందర్య మరియు రమ్య కృష్ణ సరసన డబుల్ రోల్ లో నటించారు.
2. లవ్ – ప్రేమ

లవ్ (1991) సినిమా. ఇది మన విక్టరీ వెంకటేష్ తెలుగు బ్లాక్ బస్టర్ ప్రేమా (1989) మూవీకి రీమేక్. వెంకీ మరియు రేవతి తెలుగు వెర్షన్లో లీడ్ జతలుగా నటించారు మరియు రేవతి కూడా హిందీ వెర్షన్లో కూడా నటించింది. కానీ తెలుగులో ఉండే విషాద క్లైమాక్స్ హిందీ మూవీలో వచ్చేసరికి హ్యాపీ ఎండింగ్గా మార్చేశారు.
3. దిల్ నే జిసే అప్నా కహా – నీ తోడు కావాలి

దిల్ నే జిసే అప్నా కహా నటించిన సల్మాన్ ఖాన్, భూమికా చావ్లా మరియు ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించారు, ఇది భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన చార్మి తొలి చిత్రం నీ తోడు కావాలి సినిమా కి రీమేక్.
4. వాంటెడ్ – పోకిరి

వాంటెడ్..ఇది 2009 ప్రభుదేవ దర్శకత్వం వహించిన భారతీయ హిందీ యాక్షన్ చిత్రం. సల్మాన్ ఖాన్, ఆయేషా టాకియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది పోకిరి యొక్క రీమేక్, ఇది పూరి జగన్నాధ్ రచన మరియు దర్శకత్వం వహించిన 2006 తెలుగు యాక్షన్ చిత్రం. మహేష్ బాబు, ఇలియానా డి క్రజ్ పోకిరి లో హీరో హీరోయిన్లు గా నటించారు.
5. రెడీ – రెడీ

సల్మాన్ ఖాన్ మరియు అసిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రెడీ. దీనికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. 2011 లో ఈ ఇండియన్ హిందీ యాక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం విడుదల అయింది. ఇది రామ్ మరియు జెనెలియా డిసౌజా నటించిన శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం రెడీ కి రీమేక్. తెలుగు “రెడీ” సినిమా 2008 లో రిలీజ్ అయింది.
6 జై హో – స్టాలిన్

జై హో 2014 భారతీయ యాక్షన్ డ్రామా చిత్రం. దీనికి సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించారు. మరియు సునీల్ లుల్లాతో పాటు ఖాన్ ఈ సినిమా ను నిర్మించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, టబు, డైసీ షా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన 2006 తెలుగు చిత్రం స్టాలిన్ సినిమాకి రీమేక్. చిరంజీవి, అనుష్క శెట్టి, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు.
7. కిక్ – కిక్

కిక్ అనేది 2014 భారతీయ యాక్షన్ చిత్రం, సాజిద్ నాడియాద్వాలా ఈ సినిమా ను నిర్మించారు.ఆయనే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రణదీప్ హుడా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు .. ఈ చిత్రం రవితేజ, ఇలియానా డి క్రజ్ నటించిన 2009 తెలుగు చిత్రం కిక్ సినిమా కి రీమేక్.
“అన్ని పోగొట్టుకున్నాను…అప్పుడే చనిపోదామనుకున్నాను.”.. సింగర్ కల్పన కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.!
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో పాటలు పాడి, ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ కల్పన. కల్పన అనంగానే మనందరికీ మొట్టమొదట గుర్తొచ్చే పాట ఖడ్గం సినిమాలోని ముసుగు వెయ్యొద్దు మనసు మీద. ఈ పాట క్రేజ్ ఇప్పటికి కూడా తగ్గలేదు అంటే దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్, కల్పన వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నాయో మనమే అర్థం చేసుకోవాలి.

అలాగే వెంకీ సినిమాలోని గోంగూర తోట కాడ సాంగ్ కూడా కల్పనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో హిట్ పాటలను పాడారు కల్పన. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగులో కూడా కంటెస్టెంట్ గా వచ్చారు. ఆ తర్వాత నుండి ఎన్నో స్టేజ్ షోస్ లో కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కల్పన. అలాగే సింగింగ్ రియాల్టీ షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరించారు.

అయితే కల్పన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలని పంచుకున్నారు. కల్పన కొన్ని సినిమాల్లో నటించారు. కల్పనకి నటన అంటే ఆసక్తి ఉన్నా కూడా అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువగా నచ్చకపోవడంతో నటనని వదిలేశారు. అలాగే డబ్బింగ్ చెప్పడం కూడా కష్టంగా అనిపించడంతో సింగింగ్ నయం అని అనుకున్నారట.

కల్పనకి రికార్డింగ్ కంటే లైవ్ గా పాడడం అంటేనే ఇష్టమట. కల్పన తొలి గురువు తన నాన్న గారు. ఆ తర్వాత శ్రీనివాసన్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. 2010 లో కల్పన అన్ని పోగొట్టుకున్నారట. అప్పుడు చనిపోవాలి అని అనుకున్నారట. కానీ సింగర్ చిత్ర గారు ఒక మలయాళం షోలో పాల్గొనమని అవకాశం ఇచ్చారు.

అందులో కంటెస్టెంట్ గా పాల్గొనటంతో ఇండస్ట్రీ పరువు పోయింది అని కొంత మంది కల్పనని అవమానించారట. తర్వాత షోలో కల్పన విన్నర్ గా నిలిచారు. దాంతో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందింది అని కల్పన చెప్పారు. కల్పన ప్రస్తుతం స్వరాభిషేకం వంటి షోస్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అలాగే ఎన్నో సినిమాల్లో పాటలు కూడా పాడుతున్నారు.
బాహుబలి సినిమాపై ఈ రేంజ్ ట్రోలింగ్ ఎప్పుడూ చూసి ఉండరు.. ఇదేంటి రాజమౌళి గారు..?
బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి మూడేళ్లు కావొస్తున్నా.. ఇంకా మైండ్ లోంచి పోలేదు. ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ అంత అందం గా డిజైన్ చేసారు. అందుకే బాహుబలి సినిమా ఓ విజువల్ వండర్. జక్కన్న చెక్కిన ఈ సినిమా శిల్పం తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచింది.

అయితే.. ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లు కాపీ వే ఉన్నాయి అంటూ చాలా వీడియోస్ వచ్చాయి. ఈ సినిమా స్టోరీ గురించి కానీ, కొన్ని సీన్ల గురించి కానీ ఎక్కడెక్కడ నుంచి కాపీ కొట్టారో చెప్పుకొచ్చారు. అసలు వీళ్ళు ఇవన్నీ ఎలా కనిపెడతారో కూడా తెలియదు. మనం చూసిన తరువాత “ఏంటి ఇది కాపీ నా”? అని అనుకుంటూ ఉంటాం.

రీసెంట్ గా, గులాబీ ఛానెల్ వారు కూడా కొన్ని ఒరిజినల్ సీన్స్ ను కంపేర్ చేస్తూ ఓ ట్రోలింగ్ వీడియో ను పోస్ట్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తమన్నా ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ సీన్ లను కూడా కాపీ చేశారని అర్ధం అయిపోతుంది. కట్టప్ప ని ప్రభాస్ “నేనెవర్ని” అని అడుగుతాడు కదా.. ఆ సీన్ కూడా కాపీ చేసిన సీనే. ఏ సీన్ ని ఎక్కడనుంచి కాపీ చేసారో మీరు ఈ కింద వీడియో చూడొచ్చు.
Watch Video:
https://youtu.be/lg-9D6BsHoU
ఇప్పటివరకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించని 7 నటులు.! లిస్ట్ ఒక లుక్ వేయండి.!
సినిమా నటులు అడ్వర్టైజ్మెంట్స్ లో నటించడం అనేది చాలా సహజం. ఒకవేళ ఎవరైనా ఒక స్టార్ నటులు ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే, ఆ బ్రాండ్ విలువ పెరుగుతుంది అని చాలా మంది ఎంతో ఖర్చు పెట్టి ఎంతో మంది స్టార్ల చేత వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేయించుకుంటారు. అయితే కొంత మంది నటులు మాత్రం ఇలా అడ్వర్టైజ్మెంట్స్ కి దూరంగా ఉన్నారు. ఆ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 సాయి పల్లవి
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంత సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి, ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్ రిజెక్ట్ చేశారట. సాయి పల్లవి ఎప్పుడో టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించారు. హీరోయిన్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ లో నటించలేదు.

#2 మంచు మనోజ్
మంచు మనోజ్ కూడా ఇన్ని సంవత్సరాలలో ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు.

#3 నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇప్పటి వరకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు. ఒక సందర్భంలో ఏదైనా మంచి కోసం ప్రచారం చేయాలంటే, సామాజిక బాధ్యత కోసం రూపొందించే అడ్వర్టైజ్మెంట్స్ లో నటిస్తాను అని చెప్పారు.

#4 గౌతమి
తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న గౌతమి గారు కూడా అడ్వర్టైజ్మెంట్స్ లో నటించలేదు.

#5 మోహన్ బాబు
మోహన్ బాబు గారు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా నటించలేదు.

#6 నందమూరి కళ్యాణ్ రామ్
తన పెర్ఫార్మెన్స్ తో, సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కళ్యాణ్ కూడా టెలివిజన్ కమర్షియల్స్ లో నటించలేదు.

#7 మంచు విష్ణు
మంచు విష్ణు కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో డిఫరెంట్ సినిమాలతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. మంచు విష్ణు కూడా ఇప్పటి వరకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు.

వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది నటులు కూడా అడ్వర్టైజ్మెంట్స్ కి దూరంగా ఉన్నారు. శర్వానంద్, నాని, అజిత్, రజినీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అనుష్క శెట్టితో పాటు ఇంకా కొంత మంది నటులు తరచుగా కాకపోయినా చాలా అరుదుగా ఒక అడ్వర్టైజ్మెంట్ లో అయినా నటించారు.
ఈ 15 మంది నటులు సౌత్ లో టాప్ స్టార్స్…కానీ బాలీవుడ్ లో ఫెయిల్ అయ్యారని తెలుసా.?
ఏదైనా ఒక రంగంలో గెలుపోటములు అనేది సహజం. సినిమా రంగంలో కూడా అంతే. వేరే ఇండస్ట్రీ నుండి కొంత మంది నటులు మన ఇండస్ట్రీకి రావడం, మన ఇండస్ట్రీలో కొంత మంది నటులు వేరే ఇండస్ట్రీకి వెళ్లడం, మనం చూస్తూనే ఉంటాం. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు వేరే ఇండస్ట్రీలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
కానీ అక్కడ వారికి ఆశించినంత స్టార్ డమ్ లభించలేదు. వారిలో కొంత మంది బాలీవుడ్ కి కూడా వెళ్లారు. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్నంత ఫలితాన్ని సాధించని వేరే ఇండస్ట్రీ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి హిందీలో ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్మెన్ సినిమాల్లో నటించారు.

#2 వెంకటేష్
వెంకటేష్ యమలీల హిందీ రీమేక్ అయిన తక్దీర్ వాలా, చంటి రీమేక్ అయిన అనారీలో నటించారు. తర్వాత తెలుగు సినిమాల పైనే తన పూర్తి శ్రద్ధ పెట్టారు.

#3 సుదీప్
కిచ్చ సుదీప్ కి ఈగ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో వచ్చింది. హిందీలో ఫూంక్, రణ్ సినిమాల్లో నటించారు.

#4 అరవింద స్వామి
అరవింద స్వామి హిందీలో సాత్ రంగ్ కే సప్నే, రాజా కో రాణి సే ప్యార్ హో గయా సినిమాల్లో నటించారు. కానీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

#5 పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాణీ ముఖర్జీ హీరోయిన్ గా నటించిన అయ్యా సినిమాలో నటించారు.

#6 త్రిష కృష్ణన్
త్రిష, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కట్టా మీఠా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేదు.

#7 రంభ
తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రంభ కూడా హిందీలో కొన్ని సినిమాల్లో నటించారు.

#8 శృతి హాసన్
శృతి హాసన్ లక్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తర్వాత దిల్ తో బచ్చా హై జీ, రామయ్యా వస్తావయ్యా, వెల్ కమ్ బ్యాక్, రాకీ హ్యాండ్సమ్, డీ డే, బెహెన్ హోగీ తేరి, గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాల్లో నటించారు. కానీ హిందీలో కంటే శృతి హాసన్ కి తెలుగు, తమిళ్ లోనే ఎక్కువ గుర్తింపు లభించింది.

#9 రామ్ చరణ్
రామ్ చరణ్ హిందీలో జంజీర్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

#10 తమన్నా భాటియా
తమన్నా హిందీలో హిమ్మత్ వాలాతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.

#11 రానా దగ్గుబాటి
రానా కూడా హిందీలో దమ్ మారో దమ్ సినిమాలో నటించారు. అలాగే ఏ జవానీ హై దివానీ సినిమాలో కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించారు.

#12 భూమిక
భూమిక సల్మాన్ ఖాన్ తో తేరే నామ్ సినిమాతో పాటు ఇంకా కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. అలాగే ఎంఎస్ ధోని సినిమాలో ధోనికి అక్క పాత్రలో నటించారు. కానీ భూమిక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

#13 హన్సిక మోత్వానీ
హన్సిక మోత్వానీ కోయీ మిల్ గయా సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. కానీ తర్వాత హన్సిక నటించిన హిందీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ హన్సిక కి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఎంతో గుర్తింపు లభించింది.

#14 జ్యోతిక
జ్యోతిక హిందీ లో డోలి సాజా కే రఖ్నా సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రశాంత్, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ్ సినిమా జోడి సినిమా కి రీమేక్.

#1 5 శ్రీయ సరన్
శ్రీయ హిందీలో తుజే మేరీ కసం తో పాటు ఆవారాపన్, దృశ్యంలో కూడా నటించారు. వీటిలో దృశ్యం సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ శ్రీయ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు.

“గీత గోవిందం” సినిమాలో ఈ తప్పు గమనించారా.? ఏకంగా రష్మిక వాల్ పేపర్ గా కూడా పెట్టుకుంటుంది.!
విజయ్ దేవరకొండ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాల్లో ఒకటి గీత గోవిందం. 2018 లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహించగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. గీత గోవిందం సినిమా అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చే పాట ఇంకేం ఇంకేం కావాలే. ఈ పాట మాత్రమే కాకుండా గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఈ సినిమాకి రష్మిక మందన పర్ఫామెన్స్ కూడా హైలైట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఒక చిన్న పొరపాటు ఉంది. అది ఏంటంటే. మొదట హీరోయిన్ హీరో ని అపార్థం చేసుకుంటుంది. తర్వాత హీరో వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ తల్లి, హీరోయిన్ కి హీరో గురించి చెప్పడంతో అప్పటివరకు హీరో ని తప్పుగా అర్థం చేసుకున్న గీత తర్వాత ప్రేమిస్తుంది.

అప్పుడు ఏంటి ఏంటి పాట వస్తుంది. అయితే ఆ పాటలో ఒక సీన్ లో కారులో హీరో నిద్ర పోతూ ఉంటే పక్కనుంచి హీరోయిన్ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే బయట నుంచి ఒకరు డిస్టర్బ్ చేయడంతో సెల్ఫీ తీసుకుంటున్న హీరోయిన్ మళ్లీ మామూలుగా కూర్చుంటుంది. అదే పాటలో తర్వాత ఒక సీన్ లో హీరోయిన్ లాప్టాప్ స్క్రీన్ మీద వాల్ పేపర్ గా హీరోయిన్ హీరో తో సెల్ఫీ తీసుకుంటున్న పిక్చర్ ఉంటుంది.

అది కూడా సెల్ఫీ పిక్చర్ కాకుండా మనకి ఏ విధంగా అయితే చూపిస్తారు అదే విధంగా ఉంటుంది. దీన్ని పొరపాటు అనడం కూడా చాలా పెద్ద పదం ఏమో. కానీ ఏదేమైనా దీనివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి ప్రేక్షకులు కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు.
watch video:
