భారతీయ వస్త్ర పరిశ్రమలో రేమాండ్ అనేది ఒక టాప్ బ్రాండ్. ఆ సంస్థకు ఆ ఇమేజ్ను తీసుకొచ్చిన వ్యక్తి రేమండ్ వ్యవస్థాపకుడు, సంస్థ మాజీ ఛైర్మన్, దేశీయ కుబేరుల్లో ఒకరు విజయపత్ సింఘానియా. గార్మెంట్ అండ్ టెక్స్టైల్ పరిశ్రమలో తనదైన ముద్ర వేది లక్షలాదిమంది భారతీయులకు చేరువయ్యారు. “ది కంప్లీట్ మ్యాన్”, “ఫీల్స్ లైక్ హెవెన్..ఫీల్స్ లైక్ రేమాండ్” ట్యాగ్లైన్లతొ అద్బుతమైన దుస్తులను అందించిన ఘనత ఆయనదే.
అయితే కుటుంబ తగాదాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాపరం కుటుంబం రేమాండ్ గ్రూప్.ఒకపుడు 12వేల కోట్ల రూపాయల నెట్వర్త్తో అంబానీలను మించిన ధనవంతుడిగా, దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన ఆయన 85 ఏళ్ల వయసులో అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నారు.

విజయ్పథ్ కొడుకు గౌతమ్ సింఘానియాతో విబేధాల వల్ల ఆయన జీవితం దుర్భరంగా మారిపోయింది. ఇంటి నుండి గెంటేయడంతో చాలా కష్టాలు పడుతున్నారు.1900లో వాడియా మిల్లు నుండి ప్రారంభమైన రేమండ్ ప్రస్థానం అతి తక్కువ కాలంలోనే కొత్త శిఖరాలకు చేరింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక దుస్తుల కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది.విజయ్పత్ పెద్ద కొడుకు మధుపతి, కుటుంబానికి దూరంగా సింగపూర్లో స్థిరపడ్డాడు. రేమాండ్ వ్యాపార వ్యవహరాలను చూసుకుంటున్న రెండో కొడుకు గౌతమ్తో మధ్య ఆస్తి వివాదం కోర్టు కెక్కింది.

సంబంధాలు దెబ్బతిన్నాయి. అనూహ్యంగా విజయపత్ సింఘానియాను చైర్పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి తొలగించడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.గౌతమ్ భార్య నవాజ్మోడీతో విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది.గౌతమ్ తనను హింసించాడని ఆరోపించి, గ్రూపు బోర్డులో ఉన్న తనకు గౌతమ్ ఆస్తిలో 75 శాతం భరణం కావాలని డిమాండ్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన విజయపత్ సింఘానియా సొంత కొడుకు గౌతమ్కు బదులుగా నవాజ్కు , ఆమె ఇద్దరు ఆడపిల్లలకు మద్దతుగా నిలవడం విశేషం.

రేమండ్ గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.10,985.33 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో రూ 11 వేల కోట్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. రేమండ్ 64 సంవత్సరాలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావడంతో పాటు చాలా స్ట్రాంగ్ స్టాక్గా ఉంది. సింఘానియా-మోడీ విడాకుల కథ స్టాక్ ధరను భారీగా దెబ్బతీసింది.నవంబర్ 23 నాటికి రేమండ్ స్టాక్ దాదాపు 5.15 శాతం నష్టపోయింది. ఫలితంగా గత 7 సెషన్లలో దాని మార్కెట్ క్యాప్లో దాదాపు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయింది.మానవ సంబంధాలు, కుటుంబంలోని వివాదాల దుష్పరిణామాలకు రేమండ్ వ్యవహారం, ఒక రిమైండర్ లాంటిది.
Also Read:వర్మ చనిపోయాక ఆయన విలువ తెలుసుకుంటాం… వర్మ శిష్యుడు కామెంట్స్ వైరల్…!

















కోరాలో “ఈ కాలంలో (కలికాలం) పెళ్లి కూతుర్లు సిగ్గు పడడం మానేసి పెళ్ళిలో ఐటం సాంగ్ లకు డాన్స్ లు చేయడాన్ని మీరు సమర్థిస్తారా విమర్శిస్తారా? ఎందుకు? అనే ప్రశ్నకు
ఒకప్పుడు పసుపు కొట్టే పండుగ అనేది, మన దగ్గర చాలా గుంభనంగా జరిగేది. మరీ ముఖ్యమైన బంధువులు మాత్రమే, అలా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి కొడుకు/ పెళ్లి కూతురు పొట్ట పై రోకలి తో చిన్నగా కొట్టేవారు. పసుపు తీసి, మంగళ స్నానాలు చేయించేవారు.. ఇప్పుడు మాత్రం మనవాళ్ళు ఉత్తరాది వారి హల్దీ ఎరువు తెచ్చుకుని,ఒకరి మీద ఒకరు పసుపు జల్లుకుంటూ, రెయిన్ డ్యాన్స్ లు. సంప్రదాయం కన్నా, రీల్స్ కి , సెల్ఫీ లకే ఇప్పుడు ప్రధానం. ఇది ట్రెండ్ అనుకుని పెద్దగా మనసుకి తీసుకుకుంటే మంచిది.
కానీ ఈ కృత్రిమత్వమే సహజం అనుకునే స్థాయి వచ్చేసింది ఈ సమాజంలోకి, ముఖ్యంగా జనరేషన్ జెడ్ (2000 తర్వాత జన్మించిన వారు) ఈ సెల్ఫీలకి రీల్స్ కి బాగా అలవాటు పడ్డారు. వారిని చూసి, వారిలా చేయకపోతే మనల్ని ఎక్కడ ముసలివాళ్ళు అనుకుంటారో అనో, బాగుందనో అంతకు ముందు తరాల వారు కూడా ఈ ట్రెండ్ ని అనుసరిస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటో షూట్,ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇలా ఏవి తీసుకోండి, బాగుపడేది లక్షల్లో ప్యాకేజీలు అందుకునేది కేవలం ఫొటోగ్రాఫర్లు మాత్రమే.
అందుకోసం వారు చెప్పిన పిచ్చి చేష్టలు, వెకిలి వేషాలు, గోడ అంచున నిలబడి సాహసాలు, అబ్బో కృత్రిమత్వానికి పరాకాష్ట. ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి , ఇన్ని సాహసాలు చేసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు పోనీ సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటారా అంటే, ఎబ్బే. ఇక మీరు అమ్మాయిలకి సిగ్గు లేదా అని అడిగారు, అది తప్పు. అబ్బాయిలు కూడా అదే బారాత్ అనే కార్యక్రమంలో డాన్స్ లు చేస్తున్నారు కదా, వీరికి సిగ్గు లేదంటే, వారికీ లేనట్టే కదా. వారి పెళ్ళిలో వారు డ్యాన్స్ చేస్తారో, ఫైట్ చేస్తారో వారి ఇష్టం అని వదిలేయడం ఉత్తమం. కాబట్టి జడ్జ్ చేయడం మానేయండి.
మీకు వీలైతే అలంటి ఫంక్షన్స్ కి దూరంగా ఉండడం, ఆ తరహా నృత్యాలు ఉన్న వీడియోస్ చూడడం మానేయండి. ఎవరికీ నచ్చిన పని వారు చేసుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది అన్న సంగతి మరువకూడదు. అలాగే అలంటి కార్యక్రమాలకి దూరంగా ఉండే హక్కు కూడా అందరికీ ఉంది. అది గుర్తించుకుంటే మనశ్శాంతికి లోటుండదు. సర్వేజనా సుఖినోభవంతు” అంటూ దుర్గా ప్రసాద్ తూము రాసుకొచ్చారు.










