అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని చూస్తే గుండె తరుక్కు పోతుంది. ముఖ్యంగా చిన్నారులు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలతో బాధపడుతుంటే చాలా బాధగా ఉంటుంది. అలంటి చిన్నారుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు సుధా కేశవరాజు. ఇప్పుడు ఎంతో మంది చిన్నారుల కి అండగా ఉన్నారు. తోటి వాళ్లకి సేవ చేయడంలో ఆమె ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.
నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ బారిన పడిన చిన్నారికి అండగా నిలుస్తున్నారు. మరి ఆమె గురించి ఆమె చేస్తున్న సేవ గురించి ఇప్పుడు చూద్దాం. ఆమె పుట్టింది ఒడిశాలో. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాకినాడ లో ఉండే వాళ్ళు. దీంతో ఆమె తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకున్నారు. తన భర్త చంద్రశేఖర్ యూరోపియన్ సంస్థకి ఫైనాన్స్ హెడ్. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒక రోజు తన స్నేహితురాలి కూతురు నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటోందని తెలిసింది.

ఆమె పండ్లు, ఆహార పదార్థాలని తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కేవలం ఆ ఒక్క చిన్నారి మాత్రమే కాకుండా చాలా మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడ్డారు. వాళ్లంతా కూడా బయట నుంచి ఆహారాన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నారు. చూడడానికి ఆ వంటలు ఏమీ బాగాలేదు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారా అని ఆమె గుండె తరుక్కుపోయింది.

ఇంటికి వెళ్ళినా సరే అదే ఆలోచన ఆమెలో. వారం గడిచిన తర్వాత పదిహేను మందికి భోజనం తయారు చేసి ఆమె తీసుకువెళ్లారు. స్వయంగా ఆమె వడ్డించి ఇంటికి వచ్చారు. నిజంగా ఆ సంతోషాన్ని ఆమె ఇప్పటికీ కూడా మర్చిపోలేదట. 2017 నుండి కూడా ఆమె ఇలా వండడం వడ్డించడం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వంద మందికి పైగా చిన్నారులకి భోజనాన్ని ఇస్తున్నారు. కేవలం వెళ్లి ఆహారాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళ బాగోగులు కూడా చూసుకుంటున్నారు ఈమె.

మహారాష్ట్ర షిరిడికి చెందిన తేజస్ కి పదహారేళ్లు. అతను వైద్యం తీసుకుంటున్నాడు. కరోనా సమయంలో సొంతూరు వెళ్లడంలో ఇబ్బంది పడితే ఈమె సాయం చేశారు. సొంతూరు వెళ్ళిన నాలుగు రోజులకి ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ విషయాన్ని ఈమె అస్సలు తట్టుకోలేకపోయారట. అలానే బ్లడ్ క్యాన్సర్ తో హరీష్ బాధపడుతున్నాడు. ఆ పిల్లవాడు చాలా అందంగా ఉంటాడు. తన వయసు కేవలం నాలుగేళ్లు. ఆ పిల్లవాడు ఈమెతో ఎంతో చనువుగా మాట్లాడుతూ ఉండే వాడట.

తనకు ఇష్టమైన కూరలు కూడా తీసుకు రమ్మని చెప్పేవాడట. ఆమెకి దత్తత తీసుకోవాలని కూడా అనిపించిందట. కానీ ఆ పిల్లవాడు బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయాడు. దానిని కూడా ఈమె తట్టుకోలేక పోయారట. ఒడిశా లో ఒక కార్పొరేట్ సంస్థ వీళ్ళకి ఉంది. అలానే ఒక పాఠశాలలో కొంత వాటా కూడా ఉంది. వాటి నుండి వచ్చిన డబ్బుతోనే ఇలాంటి సేవలు చేస్తున్నాను అని ఆమె చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు కూడా నిమ్స్ లో సేవలు కొనసాగిస్తానని ఆమె చెప్పారు. నిజంగా మంచి మనసుతో సేవలందిస్తున్న ఈమెని మెచ్చుకుని తీరాలి.












మరీ ముఖ్యంగా చాలా మంది భార్యలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమై కనీసం భర్తతో గడపడానికి సమయం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్యకు కనీసం భర్త కొంత సమయం కూడా ఇవ్వకుండా నెగ్లెట్ చేస్తున్నారు. ఇలా ఉంటే మరి ఇక జీవితంలో రాబోయే సమస్యలు ఏమిటో ఓసారి చూద్దాం..? భార్యకు భర్త అనే వాడు సమయాన్ని కేటాయించక పోతే అక్రమ సంబంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
భర్తలు ఎప్పుడూ పని పని అంటూ వారికి కావలసిన సమయంలో ఇంటికి వచ్చి, హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అదే భార్యకు కావాల్సిన సమయంలో దగ్గర ఉండకపోవడం, ఈ విధంగా భార్య తన భర్త గురించి ఆలోచిస్తూ ఉండటం, నా భర్త నాతో మాట్లాడటం లేదని, నా ఫోన్ తీయడం లేదని అనేక విషయాలు ఆలోచిస్తూ అసహణంగా మారుతారు. ఆ తర్వాత కోపం పెంచుకుని భర్త బయట ఏం చేస్తున్నాడో,
నేను కూడా ఇలా చేస్తే తప్ప ఆలోచనతో తప్పు కూడా చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మీకు తెలిసి ఈ విషయం అడిగినా మీరు బయట తిరగడం లేదా, మీరు ఏం చేస్తున్నారు అని నేను అడిగానా అని వాగ్వాదానికి దిగి గొడవలు జరిగి విడాకులు అయ్యే పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి భర్త అనే వారు కంపల్సరిగా భార్య కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ఆనందంగా గడపాలని నిపుణులు తెలియజేస్తున్నారు.



















