ప్రతి సంవత్సరం ఎంతో మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తారు. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. దేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు శబరిమలకి తరలి వెళ్తూ ఉంటారు. అందుకే శబరిమల ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఎన్నో శతాబ్దాల నుండి ఈ పద్ధతి అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే శబరిమల ఆలయంలోకి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ప్రవేశించకూడదు అనే ఒక నియమం కూడా ఉంది. కానీ ఈ సారి మాత్రం ఒక ట్రాన్స్జెండర్ శబరిమలలోకి ప్రవేశించారు.

ప్రతి సంవత్సరం నవంబర్ లో అయ్యప్ప స్వామి మాలని ధరించి సంక్రాంతి సమయంలో శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామి దర్శించుకుంటారు. ఈ సారి జోగిని ట్రాన్స్జెండర్ నిషా క్రాంతి శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నిషా క్రాంతి నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పూజల్లో పాల్గొన్నారు. నిషా క్రాంతి జోగిని నిషా క్రాంతి పేరుతో ప్రఖ్యాతి చెందారు.

రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో నిషా క్రాంతి పాల్గొంటారు. ఇప్పుడు ఆదివారం శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆడవాళ్లు శబరిమలకి వెళ్లడం మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని, ఈ కారణం చేత 10 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు గుడిలోకి అడుగు పెట్టకూడదు అనే నియమాన్ని ఎన్నో సంవత్సరాలలో నుండి పాటిస్తున్నారు.

ఈ విషయం మీద 2019 లో గొడవలు కూడా జరిగాయి. ఆడవాళ్ళని శబరిమలలోకి అనుమతించాలి అంటూ ఎంతో మంది వాదించారు. కానీ ఇప్పుడు నిషా క్రాంతి శబరిమల కి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నిషా క్రాంతికి కేరళ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ ఐడి ఆధారంగా అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో అయ్యప్ప స్వామి గుడిలోకి అడుగు పెట్టిన మొదటి ట్రాన్స్జెండర్ గా నిషా క్రాంతి చరిత్రలో నిలిచారు.
ALSO READ : మీ పూజ గదిలో ఒకటికంటే ఎక్కువ గణేష్ విగ్రహాలున్నాయా..? అలా అస్సలు ఉంచకండి.. ఎందుకంటే..?







పాకిస్థాన్ లోని అహ్మద్పూర్ సియాల్లోని సీతా రామాలయం గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శతాబ్దానికి పైగా నిర్మించబడిన ఈ ఆలయం ఆ ప్రాంతంలో నివసించే హిందువులకి ప్రార్థనా స్థలంగా ఉంది. ఈ ఆలయం క్లిష్టమైన చెక్కడాలు మరియు పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన అద్భుతమైన వాస్తుశిల్పం, మతపరమైన సరిహద్దులను చెరిపివేసి గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క కథను తెలియచేస్తుంది. సీతా రామ మందిరం అహ్మద్పూర్ సియాల్లో మత వైవిధ్యానికి చిహ్నంగా ఉంది.
అయితే ఆలాంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాప్గా మర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాలను విముక్తి చేయాలి. లేకపోతే వారు భారతదేశం యొక్క మరొక వైపు చూస్తారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “పాకిస్తాన్లో మైనారిటీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సీతా రామ మందిరం బయట చికెన్ షాప్ తెరవడం. అటువంటి పాపాలు చేసి ఈ వ్యక్తులు ఎంతగా దిగజారిపోతారు?” అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఈ సంఘటన పై అంతర్జాతీయ సంఘాలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సమూహాల మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ సంఘటన దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని ప్రతిబింబించెలా ఉండడంతో, ఇలాంటి సంఘటనల పై ఆ దేశ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.
భారతదేశంలో ఉన్న జీవనదుల్లో ప్రధానమైన నది గంగా నది. హిందువులు గంగానదిని చాలా పవిత్రంగా పూజిస్తారు. హిందువుల మతపరమైన విశ్వాసాలకు మరియు స్వచ్ఛతకు గంగానది ముఖ్యమైన సూచిక. వేద కాలం నుండి పవిత్రమైన, మతపరమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని ఉపయోగిస్తున్నారు. గంగా జలాన్ని సేవిస్తే పాపాలు చేసిన వారికి సైతం మోక్షం కలుగుతుంది. ఆఖరి ఘడియలు సమీపించినవారికి గంగాజలాన్ని తులసితో కలిపి తాగిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నుండి గంగాజలాన్ని సేవిస్తారు.
అగ్ని పురాణంలో 110 అధ్యాయంలో గంగా నది మహత్యాన్ని అగ్నిదేవుడే స్వయంగా వివరించాడని చెబుతారు. అగ్ని పురాణంలో చెప్పిన ప్రకారం, ఎల్లప్పుడు గంగను సేవిస్తూ ఉండాలట. గంగానది భుక్తి ముక్తి ప్రదాయని. భుక్తి ఇస్తుంది, ముక్తిని కూడా ఇస్తుంది. అంటే ఈ జన్మలో ఎంతో పుణ్యఫలాన్నీ అందిస్తుంది. మరణానంతరం కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. ఏయే ప్రాంతాల నుండి గంగ ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ పావనాలే అని అగ్నిదేవుడు చెప్పాడు.
దివ్యాంగులు గంగానది స్నానం చేస్తే వారు దేవతలతో సమానంగా భాసిల్లుతారట. గంగానది సేవించిన వారి మాతృ వంశం మరియు పితృ వంశం కూడా తరింపబడతాయి. ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తి దహన సంస్కారాలు పూర్తి చేసిన తరువాత అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తారు. ఒక వ్యక్తి అస్థికలు గంగానదిలో ఉన్నంతవరకు ఆ జీవి స్వర్గం లోనే నివసిస్తారని అగ్ని పురాణంలో చెప్పబడింది. అందుకోసమే గంగానదిలో అస్థికలు కలుపుతారు.








