భారతదేశం మత సామ్రాస్యానికి ప్రతీక హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు సోదర భావంతో మెలుగుతూ ఉంటారు. అయితే మన భారతదేశంలో తమిళనాడులో ఉన్న వేళంకని మాత చర్చ్ తర్వాత అంతటి ప్రసిద్ధి ఉన్న చర్చ్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వద్ద గుణదల చర్చ్.
ఇంకా చెప్పాలంటే, ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు పూజలు నిర్వహించుకోవటం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతుంటారు. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో క్రైస్తవులు గుణదలలోని మేరిమాత ఆలయానికి తరలి వస్తారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద క్షేత్రం విజయవాడ నగరంలోని గుణదల మేరీమాత చర్చి.
ఫ్రాన్స్లోని లూర్థు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత విగ్రహం తరహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉండడం వల్ల ఈ క్షేత్రం బాగా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ మేరిమాత ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు.

ఫ్రాన్సులో ఉన్న లూర్థు నగరంలో ఉన్న కొండ అడవిలో సోబిరస్ అనే 14 ఏళ్ల బాలిక వంట కోసం కలప ఏరుకునేందుకు వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలి ఉన్న ఒక మహిళ కనిపించి ఆమెతో మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11… ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించిడం తో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. దీంతో ఇక్కడ గుణదలలో కూడా అదే ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

గుణదల కొండ అనగానే అందరికి మేరిమాత పేరు గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ మత సామరస్యం ఉంటుంది.ఇక్కడ ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు ప్రార్థనలు చేసుకోవచ్చు. కొండకు వచ్చే భక్తులు ఏ మతానికి చెందిన వారైనా వారి మతాలకు అనుగుణంగా ప్రార్థనలు చేసుకునే వీలుంటుంది. భక్తులు తలనీలాలు సమర్పించటం, అగర్బత్తీలు, కొవ్వొత్తులు వెలిగించి పూజలు చేసుకోటం, వాహనాలకు పూజలు చేసుకోవటం ఇలా ఎవరి విశ్వాసాలకు అనుగణంగా వాళ్లు ప్రార్థనలు చేసుకొని స్వస్థత చేకూర్చుకుంటారని మత పెద్దలు చెబుతున్నారు










పాకిస్థాన్ లోని అహ్మద్పూర్ సియాల్లోని సీతా రామాలయం గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శతాబ్దానికి పైగా నిర్మించబడిన ఈ ఆలయం ఆ ప్రాంతంలో నివసించే హిందువులకి ప్రార్థనా స్థలంగా ఉంది. ఈ ఆలయం క్లిష్టమైన చెక్కడాలు మరియు పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన అద్భుతమైన వాస్తుశిల్పం, మతపరమైన సరిహద్దులను చెరిపివేసి గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క కథను తెలియచేస్తుంది. సీతా రామ మందిరం అహ్మద్పూర్ సియాల్లో మత వైవిధ్యానికి చిహ్నంగా ఉంది.
అయితే ఆలాంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాప్గా మర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాలను విముక్తి చేయాలి. లేకపోతే వారు భారతదేశం యొక్క మరొక వైపు చూస్తారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “పాకిస్తాన్లో మైనారిటీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సీతా రామ మందిరం బయట చికెన్ షాప్ తెరవడం. అటువంటి పాపాలు చేసి ఈ వ్యక్తులు ఎంతగా దిగజారిపోతారు?” అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఈ సంఘటన పై అంతర్జాతీయ సంఘాలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సమూహాల మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ సంఘటన దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని ప్రతిబింబించెలా ఉండడంతో, ఇలాంటి సంఘటనల పై ఆ దేశ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.
భారతదేశంలో ఉన్న జీవనదుల్లో ప్రధానమైన నది గంగా నది. హిందువులు గంగానదిని చాలా పవిత్రంగా పూజిస్తారు. హిందువుల మతపరమైన విశ్వాసాలకు మరియు స్వచ్ఛతకు గంగానది ముఖ్యమైన సూచిక. వేద కాలం నుండి పవిత్రమైన, మతపరమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని ఉపయోగిస్తున్నారు. గంగా జలాన్ని సేవిస్తే పాపాలు చేసిన వారికి సైతం మోక్షం కలుగుతుంది. ఆఖరి ఘడియలు సమీపించినవారికి గంగాజలాన్ని తులసితో కలిపి తాగిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నుండి గంగాజలాన్ని సేవిస్తారు.
అగ్ని పురాణంలో 110 అధ్యాయంలో గంగా నది మహత్యాన్ని అగ్నిదేవుడే స్వయంగా వివరించాడని చెబుతారు. అగ్ని పురాణంలో చెప్పిన ప్రకారం, ఎల్లప్పుడు గంగను సేవిస్తూ ఉండాలట. గంగానది భుక్తి ముక్తి ప్రదాయని. భుక్తి ఇస్తుంది, ముక్తిని కూడా ఇస్తుంది. అంటే ఈ జన్మలో ఎంతో పుణ్యఫలాన్నీ అందిస్తుంది. మరణానంతరం కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. ఏయే ప్రాంతాల నుండి గంగ ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ పావనాలే అని అగ్నిదేవుడు చెప్పాడు.
దివ్యాంగులు గంగానది స్నానం చేస్తే వారు దేవతలతో సమానంగా భాసిల్లుతారట. గంగానది సేవించిన వారి మాతృ వంశం మరియు పితృ వంశం కూడా తరింపబడతాయి. ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తి దహన సంస్కారాలు పూర్తి చేసిన తరువాత అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తారు. ఒక వ్యక్తి అస్థికలు గంగానదిలో ఉన్నంతవరకు ఆ జీవి స్వర్గం లోనే నివసిస్తారని అగ్ని పురాణంలో చెప్పబడింది. అందుకోసమే గంగానదిలో అస్థికలు కలుపుతారు.





