అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఇది భారతీయులు అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. ఈ వేడుక రోజున దేశమంతా రామనామ స్మరణతో మోగిపోయింది. అయితే ఇటువంటి పవిత్రమైన రోజును చాలామంది తమ జీవితంలో ముఖ్యమైన రోజుగా మార్చుకోవాలని కొన్ని పనులు చేశారు.
అయితే ఒక హీరో ఏకంగా ఈ రోజు తమ పిల్లలకు పేర్లు పెట్టుకున్నాడు.శాండల్ వుడ్ హీరో ధ్రువ్ సర్జా, ప్రేరణ దంపతుల పిల్లవాడికి నిన్న నామకరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ హీరో అర్జున్ మేనల్లుడుగా సర్జా అందరికీ పరిచయమే. ఈ నామకరణం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సంజయ్ దత్, అర్జున్ కూడా పాల్గొన్నారు. స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడైన ధ్రువ్ తన పిల్లలకు ఏం పేరు పెట్టాలో అని తెలియక ఇన్నాళ్లు వేచి చూశాడు.

అయోధ్య రామ మందిరం రోజు నాడు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుని అదే రోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. తన కూతురికి రుద్రాక్షి అని, తన కొడుకుకి హయగ్రీవ అని పేరు పెట్టారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు ముఖాలలో ఒక ముఖానికి హయగ్రీవ పేరు ఉంటుంది. వాటి నుండి తీసుకునే తమ పిల్లాడికి పేరు పెట్టినట్లుగా చెప్పాడు. దీనిపై నేను మాట్లాడుతూ అయోధ్యలో పూజలో జరిగే సమయంలోనే తమ పిల్లలకు పేర్లు పెట్టామని చెప్పాడు. త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తామని తెలియజేశాడు. పరమశివ భక్తుడు అయిన సంజయ్ దత్ తమ కుమార్తెకు రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఎంతగానో సంతోషించారని తెలియజేశారు.
తమ పిల్లలకు సాంప్రదాయ బద్దమైన పేర్లు పెట్టడంతో ధ్రువ్ సర్జా దంపతులను పలువురు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు.

మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.




















