పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ తో డైవర్స్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. మాలిక్ వివాహం చేసుకున్నట్టు, అధికారికంగా ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను ఈరోజు (జనవరి 20) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. సనా జావేద్ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది.

ఈ విడాకుల తర్వాత..సానియా కుటుంభం ఒక అధికారిక ప్రకటన చేసారు. అందులో ఏముంది అంటే…సానియా జీవితంలోని ఈ సున్నితమైన కాలంలో ఆమె గోప్యతను గౌరవించాలని అభిమానులు మరియు శ్రేయోభిలాషులను కోరుతూ మీర్జా కుటుంబం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా విడాకుల వార్తలను పంచుకోవాలనే నిర్ణయం ఉత్పన్నమైందని పేర్కొంటూ, తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచే సానియా యొక్క ఉద్దేశ్యాన్ని ఈ ప్రకటన మరింత బలపరిచినట్లైంది.




మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.














