బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ గా నిలిచిన తెలంగాణకు చెందిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరికీ గుర్తుండే ఉంటాడు. సామాన్యుడిగా బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో అందరికీ దగ్గర అయ్యి… హేమాహేమీల అందరిని దాటుకుని టైటిల్ విన్నరయ్యాడు.
రైతుబిడ్డగా అందరూ పల్లవి ప్రశాంత్ బాగా దగ్గర చేసుకున్నారు. అయితే టైటిల్ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ బాగా సైలెంట్ అయిపోయాడు. టైటిల్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన గొడవల కారణంగా జైలుకు వెళ్లడం తర్వాత బెయిల్ పై తిరిగి రావడంతో పల్లవి ప్రశాంత్ కు బాగా మైనస్ గా మారింది.

మరో పక్క తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడి సంచలనమైన బర్రెలక్క కూడా గుర్తుంటుంది. నిరుద్యోగురాలిగా గేదెలు కాసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి నిలిచి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఎలక్షన్స్ లో గెలవకపోయినప్పటికీ కూడా బాధపడకుండా వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా నిలబడతానని చెప్పింది.

అయితే తాజాగా వీరిద్దరి గురించి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. అదేంటంటే పల్లవి ప్రశాంత్ బర్రెలక్క కలిసి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని వార్త బయటకు వచ్చింది. దీనిపైన ఒక యూట్యూబ్ ఛానల్ వారు బర్రెలక్కని సంప్రదించగా ఆమె ఫైర్ అయ్యారు. లేనిపోని వార్తలు ఎందుకు సృష్టిస్తారు అంటూ యూట్యూబ్ ఛానల్ పైన మండిపడ్డారు.

తాను పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో ఉండగా సపోర్ట్ చేస్తూ వీడియో చేశానని.. ప్రశాంత్ అన్నా అంటూ పిలుస్తానని, అన్నతో పెళ్లి వార్తను ఎలా ముడి పెడతారు అంటూ కోపగించుకున్నారు. మీ వ్యూస్ కోసం మా జీవితాలను ఎందుకు బయటకు లాగుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లైఫ్ తో ఆడుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో వచ్చిన రూమర్ లో నిజం లేదని తెలిసిపోయింది.
watch video :


ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ అంజు(34), పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం అయ్యింది. వీరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ళు సాగిన తరువాత ఇద్దరు కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అంజు,భర్త పిల్లలను విడిచి పెట్టి, ప్రేమించిన వ్యక్తి కోసం సరిహద్దులు కూడా దాటి, జూలై 21న పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్లో ఉండే దీర్ సిటీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంలో అంజు భర్త అయిన అరవింద్ మాట్లాడుతూ, తన భార్య అంజు జైపూర్కు వెళ్తున్నాననే వంకతో గురువారం నాడు ఇంటి నుండి వెళ్లినట్టు వెల్లడించారు. అయితే అంజు పాకిస్థాన్కు వెళ్లినట్టుగా తెలిసిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె స్నేహితుడిని కలవాలని తెలిపి, ఇంటి నుండి వెళ్లిపోయిందని తెలిపారు. ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ఆమె భర్తకి ఫోన్ చేసి, ఆమె లాహోర్లో ఉన్నానని, 2, 3 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని అంజు చెప్పినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది.
















