సుమ.. టీవీ రంగంలో మకుటం లేని మహారాణి. కొన్ని సంవత్సరాలుగా యాంకరింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటూ తన మాటల వాగ్దాటితో ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. స్టార్ మహిళ ప్రోగ్రాం 12 సంవత్సరాలు పాటు కొనసాగించి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అలాగే సినిమా ప్రమోషన్స్ అనేసరికి అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు సుమ. సినిమాలు వేరు, యాక్టర్స్ వేరు, ప్రొడక్షన్స్ వేరు.
అయినప్పటికీ యాంకర్ గా మాత్రం సుమ ఉండాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో సుమ పెద్దగా ప్రోగ్రామ్స్ చేయడం లేదు. సినిమా ప్రమోషన్స్ కాకుండా సుమ అడ్డా తప్పితే టీవీ ప్రోగ్రామ్స్ ఏవి ఆమె చేతిలో లేవు. అయితే దీనికి కారణం ఏమిటి ఆమెకి ప్రోగ్రాములు తగ్గిపోయాయా లేదంటే ఆమె కావాలనే తగ్గించుకుంటుందా అనే ప్రశ్న ప్రేక్షకులలో తలెత్తింది. అయితే ఈ మధ్య ఆమె భర్త, నటుడు అయిన రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో తన భార్య గురించి ఆమె ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకొచ్చాడు.

సుమ తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా, మానసికంగా చాలా బలంగా తయారయ్యామని, తన తండ్రి చేసిన అప్పులను తీర్చేసి ఈ మాత్రం ఆర్థికంగా నిలదొక్కుకున్నామంటే అందుకు కారణం సుమ అని చెప్పుకొచ్చాడు రాజీవ్. ఇక బయట ఎంత బిజీగా ఉన్నప్పటికీ నన్ను,పిల్లలని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
సాయంత్రం ఆరు తర్వాత కచ్చితంగా ఇంటికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేస్తుంది. ఇక ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఆమె కావాలనే ప్రోగ్రామ్స్ తగ్గించుకుంది. ఆమె తన సొంత ఛానల్ కోసం కష్టపడుతుంది, అందులో భాగంగానే బయట ప్రోగ్రామ్స్ తగ్గించుకోవలసి వచ్చింది అని సుమ గురించి చెప్పకొచ్చాడు రాజీవ్. ఏది ఏమైనప్పటికి చాలామంది మహిళలకు సుమ స్ఫూర్తి అనటంలో ఎలాంటి సందేహము లేదు.



అయితే మరణంతో పోరాడిన విజయకాంత్ చివరికి చావు చేతిలో ఓడిపోక తప్పలేదు. అయితే ఈయన మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. ఇప్పటికకీ ఈయన సమాధి వద్దకు వందలాది మంది అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఈ విషాద సంఘటన నుంచి విజయ్ కాంత్ కుటుంబం ఇంకా బయటపడలేదనే చెప్పాలి.








60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారనే భ్రమల్లో ఉండవద్దని ఏ ఇరవై ఐదు సీట్లో ముష్టి వేస్తాడు” అని అన్నారు. జనసేన, టీడీపీ ఎలెక్షన్స్ కు సిద్ధంగా లేవని, సీట్ల లెక్కల్లో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో వైఎస్ జగన్ నిలిచిపోతారని వెల్లడించారు. ఎవరెన్ని చీలికలు చేసినా, పద్మ వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని అన్నారు.
అన్యాయాలు, అక్రమాలు చేసిన బాలశౌరి బఫూన్ బాలశౌరి బఫూన్ అని విమర్శించారు. టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతున్నాడని అన్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం నాడు జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భేటీ పై కూడా మినిస్టర్ అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు..!’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ఒక కార్టూన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులను తన భుజాల పై మోస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఆ తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీరిద్దరూ భేటీ అవడం కొత్త విషయం కాదన్నారు. సీట్ల కోసం లేదా నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లిద్దరే చెప్పాలని కామెంట్స్ చేశారు. రెండేళ్లుగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నా, ఇప్పటికీ సీట్ల విషయం తేల్చుకోలేకపోయారని విమర్శించారు.








