ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది.ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ సినిమా ప్రకటిస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా హిట్ సినిమాలు మీద సీక్వెల్స్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. తెలుగులో 15 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది అంటూ ఊహగానాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ నుండి కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది.

దగ్గుబాటి వారసుడు రానా లీడర్ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రధానంగా రాజీకియ కుతంత్రాలు, కుల రాజకీయాలను కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఈ సినిమా చాలామందికి ఆల్ టైం ఫేవరెట్ మూవీ.రాజకీయాలు బేస్ చేసుకుని వచ్చిన మూవీలలో లీడర్ మూవీకి ప్రధాన స్థానం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ నాగర్జునతో కలిసి ఒక మల్టీ స్టార్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఏషియన్ వారు నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఏషియన్ సినిమాస్ వారికి మూడో సినిమా కమిట్మెంట్ కూడా ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే అది లీడర్ మూవీకి సీక్వెల్ అంటూ చెబుతున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల లీడర్ 2 స్క్రిప్ట్ మీద పనిచేసారని, త్వరలో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు.





ఫుడ్ కు ఫేమస్ అయిన హైదరాబాద్ లో ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లు బాగా పెరిగిపోయాయి. ఆ ఫుడ్ కి రోజు రోజుకి అభిమానులు పెరిగిపోటున్నారు. రోడ్డు పక్కన మంచి రుచికరమైన ఫుడ్ దొరకడం, అది కూడా చాలా తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటి దగ్గరకి జనాలు క్యూ కడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా కుమారి ఆంటీ పేరు చెప్పుకోవచ్చు. ఆమె ఫుడ్ బిజినెస్ తో చాలా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఏక్కడ చూసిన ఆమె గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. అయితే అదే ప్రాంతంలో అనురాధ ఆంటీ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
ఆమె స్టాల్ లో టేస్టీ దాల్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, జీరా రైస్, టమాటా రైస్, పెరుగన్నం అందుబాటులో ఉన్నాయి. ఇక నాన్ వెజ్ లో మటన్, చికెన్, లివర్, ఫిష్, తలకాయ, ఫ్రాన్స్ వంటి కర్రీస్ ఉంటాయి. వెజ్ ప్లేట్కు 80 రూపాయలు కాగా, రైస్ అన్లిమిటెడ్ గా ఉంది. చికెన్ కర్రీ రూ.120 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్ ),చికెన్ ఫ్రై రూ.150 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), మటన్ కర్రీ –రూ.200 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), లివర్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ప్రాన్స్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ఫిష్ కర్రీతో రైస్ 150 రూపాయలు,కాగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటితో కలిపి తీసుకుంటే 450 రూపాయలు.
ఆమె వద్ద రోజుకు మూడు వందల మంది దాకా ఫుడ్ తింటారు. ఆ లెక్కన ఒక్కోక్కరికి యావరేజ్ గా రూ. 100 చొప్పున రోజుకు 30000 వస్తుంది. ఖర్చులన్ని పోగా 10 వేల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చూస్తే నెలకు మూడు లక్షల దాకా ఆమెకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరకు వందల మందికి ఆహారం అందిస్తున్న ఇలాంటి మహిళలను అందరు మెచ్చుకుంటున్నారు.





అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం ఎంతో దివ్యంగా, అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో దశాబ్దాల తర్వాత బాబ్రీ మసీదు వివాదం ముగిసి, సుప్రీం కోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లింలు కూడా పాల్గొనడం ఆమోదించలేని పాకిస్థాన్, రామ మందిరం పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితికి అధికారికంగా లేఖ రాసింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఎప్పుడూ అలసిపోని పాక్ నాయకులలో మునీర్ అక్రమ్ ఒకరు. పాకిస్తాన్ రాయబారి ఉన్న మునీర్ అక్రమ్ రామ మందిరం పై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అందులో
ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం మరియు శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణ కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబ్రీ మసీదు లాగే భారతదేశంలోని ఇతర మసీదులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు ఎన్నో అవమానాలు మరియు విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ లేఖలో వెల్లడించింది.
హయత్ నగర్ బస్ డిపో 1 బస్ కండక్టర్ ను ఒక యువతి మద్యం మత్తులో బూతులు తిడుతూ, అతని పై దాడి చేసిన ఇన్సిడెంట్ ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది తెలియలేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి, హయత్ నగర్ నుండి అఫ్టల్ గంజ్ మార్గంలో నడిచే 72 బస్ లో ఉదయాన్నే ఒక యువతి మద్యం సేవించి ఎక్కింది. 500 రూపాయల నోటు ఇచ్చి టికెట్ ఇవ్వమనడంతో కండక్టర్ ఇంత ఉదయం చిల్లర ఉండదని తెలిపాడు.
దాంతో ఆగ్రహించిన యువతి బస్ కండక్టర్ని నానా బూతులు తిట్టి, కొట్టడమే కాకుండా తోటీప్రయాణికులు చెబుతున్నా వినకుండా కండక్టర్ని కాలుతో తన్నడం, ఉమ్మడం జరిగింది. ఎంత చెబుతున్నా వినకుండా కండక్టర్పై దాడి చేసింది. ఆమె ప్రవర్తన భరించలేక చివరికి బస్సును పక్కకు ఆపడంతో ఆమె దిగిపోయింది.
అయితే దిగే ముందు కూడా బస్సులో ఉన్న మరో స్త్రీని సైతం బూతులు తిట్టింది. ఇదంతా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘట పై ఎండి సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.