తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా ఒకటి. కళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన నా సామిరంగ సినిమాలో నాగార్జునతో పాటు నటించిన విషయం తెలిసిందే.
ఇందులో ఏకంగా హీరో నాగార్జున నటనను డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ప్రస్తుతం హీరోలు దర్శకులు చూపు ఈ ముద్దుగుమ్మ మీద పడింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ ని చూస్తుంటే ఇక మీదట సీనియర్ హీరోలకి ఒక మంచి పెయిర్ దొరికినట్లు అనిపిస్తోంది. సీనియర్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మ బాగా సెట్ అవుతుందని అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. కాగా మొదట ఈ ముద్దుగుమ్మ 2016లో కన్నడలో విడుదలైన క్రేజీ బాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన మాస్ లీడర్ అనే సినిమాలో నటించి మెప్పించింది. అలాగే దివంగత నటుడు హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే కన్నడలో తప్పితే ఇతర భాషల్లో ఈమె చాలా తక్కువగా నటించింది. ఆ తర్వాత ఈమె 2022లో అనగా గత ఏడాది పట్టాతు అరసన్ సినిమాతో తమిళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.

















మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.


