కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడ వస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తులలో కొందరు నడక దారిలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.
అయితే ఇటీవల అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే నడక దారిలో చిరుత దాడి చేసిన ఘటన గురించి తెలిసిందే. ఇది రెండవ ఘటన. జూన్ నెలలో చిరుత దాడిలో ఒక బాలుడు గాయపడగా, రీసెంట్ గా జరిగిన చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
చిరుత దాడిలో చిన్నారి చనిపోవడం ఇటు ప్రజల్లో, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు, లేదా ఇతర క్రూరమృగాలు ఎందుకు వస్తున్నాయనే అంశం తెరపైకి వచ్చింది. బీబీసి తెలుగు న్యూస్ కథనం ప్రకారం, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ ఈ విషయం పై మాట్లాడారు. తిరుమల మెట్ల మార్గంలోకి చిరుతలు తరచూ రావడానికి చాలా కారణాలున్నాయని అన్నారు. వాటిలో ఒకటి అకేసియా వృక్షాలు.
తిరుమల కొండల పై అకేసియా చెట్లు పెంచడం వల్ల ఈ సమస్య వచ్చిందని భూమన్ తెలిపారు. గంటా మండపం, నామాల గవి వద్ద 225 ఎకరాలు ఉండేదని, అక్కడ 1985లో చెట్లు లేవని, టీటీడీ అకేసియా చెట్లను అక్కడ నాటింది. ఈ చెట్ల కారణంగా అక్కడ పెరిగే ఈత, శ్రీగంధం వంటి మిగతా చెట్లు ఎదగవని, ఇతర మొక్కలు కూడా బతకవని చెప్పారు. చెట్లు పెరిగినప్పటికీ, వాటికి కాయలు కాయకపోవడంతో అక్కడ ఆహారం లభించక ఇతర జంతువులు వెళ్లిపోయాయని అన్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు.
అయితే రీసెంట్ గా సుమారు ముప్పై ఎకరాల్లో ఉన్న అకేసియా చెట్లను కొట్టేశారు. అప్పటి దాకా ఆ చెట్ల నీడలో ఉండే చిరుతలు మనుషులకు సమీపంలో వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయని భూమన్ చెప్పుకొచ్చారు. కానీ టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడుతూ అకేసియా చెట్లను కొట్టేసింది నిజమేనని, అయితే వాటిని కొట్టేయడం కారణంగా చిరుత పులులు నడకదారి వైపు వస్తున్నాయని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు.
Also Read: తిరుమలలో పిల్లలపై దాడి చేసిన చిరుతపులి ఇదేనా..? ఈ విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే..?

ప్రతిరోజూ రాకపోకలు సాగించే నేషనల్, ఇంటర్నేషనల్ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మల్లికార్జున ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ లో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో మరియు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోర్ట్ ట్రస్ట్, జీవీఎంసీ,ఇండియన్ నేవీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ యొక్క ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు.
దీనిలో రన్వేలో నీటి నిల్వ, విమానాశ్రయం పరిసరాల్లో చెత్త డంపింగ్, పక్షుల వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఉండడం వల్ల అధికంగా వ్యర్థాలు అక్కడ చేరుతున్నాయని అన్నారు. మేహాద్రి గెడ్డ కాలువలో మేకల, కోళ్ల మాంసపు వ్యర్థాలు ఎక్కువగా వేస్తున్నారని, అందువల్ల ఆ పరిసరాలు పక్షులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయని అన్నారు.
ఈ కారణంగా పక్షుల సంఖ్య పెరగడంతో విమానాల రాక, పోకలకు అవి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మీట్ షాప్ లను తొలగించాలని, పారిశుధ్య చర్యలను తీసుకోవాలని కలెక్టర్ జీవీఎంసీ ఆఫీసర్లను ఆదేశించారు. అలాగే ఈ విషయం పై జనాలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. భారీ వర్షాల సమయంలో నీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళకుండా కావాల్సిన నిర్మాణాలు, పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమంత, విజయ్ దేవరకొండ కలిసి మహానటి మూవీలో కనిపించారు. కానీ హీరో హీరోయిన్లుగా కాదు. ఖుషిలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రమోషన్స్ను మొదలు పెట్టింది. ఇటీవల నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్లో విజయ్, సమంతల డ్యాన్స్ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ కార్యక్రమంలో సింగర్స్ పాటలు పాడి, ప్రేక్షకులను అలరించారు. అయితే మజిలీ మూవీ పాటకు సమంత ఎమోషనలైనట్లుగా తెలుస్తోంది. స్టేజీపై సింగర్ ప్రియతమా పాటను పాడుతున్న టైమ్ లో సమంత భావోద్వేగానికి లోనైంది. గత జ్ఞాపకాలు ఆ పాట ద్వారా గుర్తుకు రావడంతో వస్తున్న కన్నీళ్లు ఆపడానికి ప్రయత్నించిందని, దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్గా అయ్యింది. ఆ వీడియోను చూసిన సమంత ఫ్యాన్స్ ఆమె పరిస్థితి పై జాలి పడుతున్నారు. కొందరు కాలమే సమంత బాధను నయం చేస్తుందంటున్నారు.
మరికొందరు అభిమానులు సమంతను అలా చూస్తుంటే తమకు కూడా ఏడుపు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యను సమంత మర్చిపోలేకపోతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మజిలీ మూవీలో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా నటించారు. వీరి పెళ్లి జరిగిన తరువాత కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కించాడు.
టీటీడీఎఫ్ఓ శ్రీనివాసులు బీబీసి న్యూస్ తో మాట్లాడుతూ చిన్నారి పై దాడి చేసిన చిరుత, బోనులో చిక్కిన చిరుత ఒక్కటేనా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. చిరుత పులి కడుపులో మానవ మాంసమకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయో? లేదా అనే దానిని తెలుసుకుంటాం. నిపుణులు చిన్నారి పై దాడి చేసిన చిరుత ఇదేనా కాదా అని నిజ నిర్ధారణ చేస్తారని తెలిపారు. ఆ తరువాత ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్ణయం మేరకు బోనులో చిక్కిన చిరుతను జూలోనే ఉంచాలా? లేదా అడవిలో వదలాల అనే విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
ఇక బోనులో చిక్కిన చిరుతపులి ఆడ చిరుత అని, దానికి నాలుగు ఏళ్లు ఉంటాయని వెల్లడించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా మాట్లాడుతూ చిన్నారి మరణించిన ప్రాంతంలోనే చిరుత పట్టుబడిందని అన్నారు. అయితే ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఇంకా ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారని, చిరుతలను పట్టుకునే ప్రక్రియ కొనసాగుతుంది.
తిరుమల నడకదారిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అటవీ శాఖ అధికారులు చెప్పేదాకా నిబంధనలు కొనసాగుతాయని అన్నారు. అంతేకాకుండా నడకదారిలో వచ్చే 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల అనంతరం అనుమతించమని చెప్పారు. ఇక నడకమార్గంలో వచ్చే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని ధర్మారెడ్డి సూచించారు.
అంతేకాకుండా లవర్ సూర్య ప్రకాశరావుతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ప్రసుతం వీడియో మరియు పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో ఆ బాలిక ఇద్దరు యువకులతో ఒకరికి తెలియకుండా మరొకరితో నడుపుతున్న ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. దాంతో సాయికుమార్ మరియు సూర్యప్రకాశరావు ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఇద్దరిలో ఎవరు కావాలని ? ఆమె ఎవరితో కలిసి ఉంటుందో చెప్పమని నిలదీశారు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో తెలియని ఆ బాలిక ఉరి వేసుకుని ఆగస్ట్ 10న ప్రాణాలు తీసుకుంది.
ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక మృతదేహం దగ్గర లెటర్ పోలీసులకు ఒక లెటర్ లభించింది. ఆ లెటర్ లో ‘సూర్య వాళ్లెవరినీ కూడా వదలకు కుక్క చావు చావాలి కొడుకులు’ అని ఉంది. అయితే సూర్యప్రకాశ్ అదే రోజు రాత్రి గోపాలపట్నం దగ్గరలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ముక్కోణపు ప్రేమ కథలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, సాయికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తిరుమలలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆరు సంవత్సరాల లక్షిత ఫ్యామిలీకి టీటీడీ ఎక్స్గ్రేషియాను ఇవ్వనున్నారు. టీటీడీ తరపున ఐదు లక్షలు ఇవ్వనుండగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐదు లక్షలు ఇవ్వనుంది. మొత్తం కలిపి పది లక్షల ఎక్స్గ్రేషియాను లక్షిత కుటుంబానికి అంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి లక్షిత ఇన్సిడెంట్ పై స్పందించడం కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ, చిరుత పులి దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమైన, విషాదకరమైన ఘటన అని తెలిపారు. లక్షిత నడకదారిలో తన తల్లిదండ్రులతో కాకుండా పలుమార్లు ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో నడకదారిలో పటిష్టమైన చర్యలు మరింతగా తీసుకుంటామని, త్వరలో 500 సీసీ కెమరాలను ఏర్పాటు చేసి అడివిమృగాలు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు.
గాలి గోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను మరింతగా పెంచుతామని, 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున నియమిస్తామని వెల్లడించారు. నడకదారిలో చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిలల్లను వారి సంరక్షణలో ఉంచుకోవాలని సూచించారు, హై అలర్ట్ ప్రాంతాలలో బోన్లను ఏర్పాటు చేస్తామని, రాత్రి 10 గంటల వరకు ప్రస్తుతం నడకదారిలో తిరుమల వచ్చే భక్తులను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అనుమతించే టైమ్ ను తగ్గించేందుకు ఆలోచిస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త అయిన ముకేశ్ అంబానీ ఆసియాలోనే అపర కుబేరుడుగా పేరుగాంచాడు. ముకేశ్ అంబానీకి సంబంధించిన వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అంబానీ ఆంటిలియా భవనం ప్రపంచంలోనే రెండవ అత్యంత రిచెస్ట్ హౌస్ గా నిలిచింది. ఈ ఇంటి ఖరీదు 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం. ఈ భవనం మాత్రమే కాకుండా అంబానీకి ఇతర దేశాలలో కూడా ఎన్నో భవంతులు ఉన్నాయి. తాజాగా వాటిలో ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లుగా ఒక న్యూస్ నెట్టింట్లో షికారు చేస్తోంది.
అమెరికాలోని మ్యాన్హట్టన్ వెస్ట్ విలేజ్లో ఉండే ఒక లగ్జరీ హౌజ్ ను విక్రయించినట్లుగా న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. 2406 చదరపు అడుగులు ఉన్న ఇంటిని 9 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.74.5 కోట్లకు అమ్మినట్లుగా పేర్కొంది. ఇక ఈ లగ్జరీ హౌజ్ హడ్సన్ నదీ తీరంలో ఉందట. రెండు బెడ్రూంల నుండి హడ్సన్ నది ప్రకృతి అందాలను చూసే విధంగా ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తోంది.
ఈ ఇంటి లోపల భాగాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. జిమ్మీ జాన్సన్, హిల్లరీ స్వాంక్, మార్క్ జాకబ్స్ లాంటి ప్రముఖులు ఈ హౌజ్ ఇంటీరియర్ డిజైన్ను అద్భుతంగా రూపొందించారు. గతేడాది అంబానీ అరబ్ సిటీ దుబాయ్లో కూడా 640 కోట్ల రూపాయలు పెట్టి ఒక లగ్జరీ విల్లా కొనుగోలు చేశారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సోమవారం (ఆగస్టు 7) నాడు రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయం పై చర్చ జరుగగా, మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసారు. ఓటింగ్ ముందు సీరియస్ గా జరిగిన చర్చలో 90 ఏళ్ల వయసులోనూ పాల్గొన్నారు. ఆయన మౌనంగా రాజ్యసభలో జరిగిన చర్చను నిశితంగా గమనించి, ఆ తరువాత ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా, తన బాధ్యతను నెరవేర్చడం కోసం వచ్చిన మన్మోహన్ సింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు పార్లమెంట్ కు రాకుండా ఉంటారని, కానీ 90 సంవత్సరాల వయసులో ఉన్న మన్మోహన్ సింగ్ ను చూసి వారు నేర్చుకోవాలని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. సెప్టెంబర్ లో మన్మోహన్ సింగ్ 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఆ బిల్లును ఆమోదముద్ర కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. ఈ బిల్లుతో దేశరాజధాని డిల్లీలోని పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక పై కేజ్రీవాల్ ప్రభుత్వ నియంత్రణ ఢిల్లీ ఉద్యోగుల పై నామమాత్రంగా ఉంటుంది.
ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన 1949లో తూప్రాన్లో జూన్ 5న జన్మించారు. మూడు రోజుల క్రితమే గద్దర్ అపోలో హాస్పటల్ లో గుండెకు చికిత్సను చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్టుగా ప్రకటించారు. అయితే అంతలోనే గద్దర్ మరణించడం విషాదకరంగా మారింది. ఇక ఆయన చనిపోవడానికి గల కారణాల గురించి డాక్టర్స్ బులెటిన్ రిలీజ్ చేశారు. గద్దర్ మరణానికి గల ముఖ్యమైన కారణాలను అందులో తెలిపారు.
గద్దర్ ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు మూత్ర సమస్యలతో మృతి చెందినట్లు డాక్టర్స్ వెల్లడించారు. తీవ్రమైన గుండెజబ్బుతో గద్దర్ జూలై 20న హస్పటల్ చేరగా, ఆగస్టు 3వ తారీఖు ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. అది సక్సెస్ అయినా కానీ, గతంలో గద్దర్ కు ఉన్న లంగ్స్ సమస్య వల్ల ఆయన, కోలుకోలేక కన్నుమూసినట్లు వైద్యులు బులెటిన్లో ప్రకటించారు.
గద్దర్ అంత్యక్రియలను నేడు ఆల్వాల్ లోని మహా బోధా స్కూల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. గద్దర్ కు నివాళులు అర్పించడం కోసం ప్రజలతో పాటుగా, రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు ఎల్బీ స్టేడియానికి తరలివస్తున్నారు. గద్దర్ తో తమకున్న ఙ్ఞాపకాలను, అనుబంధాన్ని తల్చుకుంటూ వారు భావోద్వేగానికి లోనవుతున్నారు. జన సేనాని పవన్ కళ్యాణ్ గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే వచ్చి, గద్దర్ బౌతీక కాయాన్ని సందర్శించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించాడు.
విశాఖలోని వన్టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.