బాహుబలి’ చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు అదే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మీద రాకేష్ వర్రే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ “పేకమేడలు” అనే నూతన చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘నా పేరు శివ’,’అందగారం’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అయిన అనూష కృష్ణ లను తెలుగు తెర కి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వారితో పాటూ ఈ చిత్రానికి 50 మంది నూతన నటీ నటులతో పాటు ఎంతో ప్రతిభావంతులైన టెక్నిషన్స్ పని చేసారు. ‘అంగమలి డైరీస్’, ‘జల్లికట్టు’ వంటి చిత్రాలకు సౌండ్ డిజైన్ అందజేసిన ప్రముఖ సౌండ్ డిజైనర్ రంగనాధ్ రేవి సౌండ్ మిక్సర్ కన్నన్ గన్ పత్ ఈ చిత్రానికి పని చేసారు.
ఈ చిత్రం ద్వార నీలగిరి మామిళ్ళ అనే నూతన దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతున్నాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన ‘పేకమేడలు’ చిత్రం యొక్క పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ని చిత్రబృందం ప్రేక్షుకులకి రిలీజ్ చేసారు.
ఈ చిత్రానికి ‘పేకమేడలు’ అనే వైవిధ్యమైన టైటిల్ను పెట్టారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టైటిల్ లానే వైవిధ్యంగా వుంది. హైదరాబాద్ బస్తి, సిటీని కలగలిపిన 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చన వేసిన కథానాయకుడు వినోద్ కిషన్ లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్నారు, బ్యాగ్రౌండ్ లో ఉన్న బస్తి, సిటీ కలగలిపినట్టు కథానాయకుడు ఆహార్యంలో ఫార్మల్ బట్టలు సగం, బనియన్ లుంగీ సగం కట్టుకుని ఉన్నారు.. ఆ పోస్టర్ కి సరిపడా ‘పేకమేడలు’ టైటిల్ సర్రిగా సరిపోయింది.
ఒక యూనీక్ స్టోరీలైన్ తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
తారాగణం: వినోద్ కిషన్, అనూష క్రిష్ణ
సాంకేతిక విభాగం :
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
రచన & దర్శకత్వం : నీలగిరి మామిళ్ళ
నిర్మాత : రాకేష్ వర్రే
సహా నిర్మాత: వరుణ్ బోర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేతన్ కుమార్
లైన్ ప్రొడ్యూసర్: అనూష బోర
డి ఓ పి: హరిచరణ్.కె
సంగీతం: స్మరన్
సౌండ్ డిసైనర్: రంగనాధ్ రేవి
సౌండ్ మిక్సింగ్: కన్నన్ గన్ పత్
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: సృజన అడుసుమిల్లి – హంజా అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: మేఘన శేషవపురి
స్క్రీన్ ప్లే : హంజా అలీ -శ్రీనివాస్ ఇట్టం-నీలగిరి మామిళ్ళ
డైలాగ్స్ & లిరిక్స్ : భార్గవ కార్తీక్
పీఆర్వో: మధు వి ఆర్






శామీర్పేట్ కాల్పుల ఘటనలో నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ను ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు హాజరు పరచడం, రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు షాకింగ్ విషయాలు ఉన్నాయి.
ఆ తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఇద్దరు అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. మానసిక సమస్యలతో, ఒత్తిడితో ఇబ్బంది పడే వారికి స్మిత కౌన్సిలింగ్ ఇస్తుండేదని, ఈ క్రమంలోనే యాక్టర్ మనోజ్ కు స్మితతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ లో ఉన్న మనోజ్, స్మిత దగ్గరికి కౌన్సిలింగ్కు వచ్చేవాడు. అలా వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరు 3 సంవత్సరాలుగా పిల్లలతో కలిసి శామీర్ పేటలో ఉండే సెలబ్రిటీ విల్లాలో ఉంటున్నారు.
మనోజ్ తమన వేధిస్తున్నాడని స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి కంప్లైంట్ చేశాడు. సీడబ్ల్యూసీ వాళ్లు వారి తండ్రి సిద్ధార్థ్ను హైదరాబాద్ పిలిపించారు. సిద్ధార్థ్ దాస్ శనివారం పిల్లల కోసం సెలెబ్రిటీ విల్లాకు వెళ్ళాడు. సిద్ధార్థ్ను చూసిన స్మితా మనోజ్కి చెప్పడంతో ఆగ్రహించిన మనోజ్ ఏయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడు. గన్ చూసి భయపడిన సిద్ధార్థ్ బయటికి వచ్చి, డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మనోజ్ను అరెస్ట్ చేశారు. ఏయిర్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని అన్వేషణ కోసం 2008లో చంద్రయాన్-1 ను ప్రయోగించింది. ఇది మూన్ పై నీరు ఉందని రుజువు చేసింది. ఆ తరువాత చంద్రుని పై ల్యాండింగ్, అన్వేషణ కోసం చంద్రయాన్-2 అంతరిక్ష నౌకను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, 2019లో ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపం వల్ల చంద్రయాన్-2ను మోసుకెళ్లిన ల్యాండర్ ల్యాండింగ్లో ఫెయిల్ అయ్యి చంద్రుడి పై కూలిపోయింది. ఈసారి సాంకేతిక లోపం తలెత్తకుండా చంద్రయాన్ 3ని ఇస్రో సిద్ధం చేసింది.
శాస్త్రవేత్తలు గతంలో మాదిరిగా జరగాకుండా ఉండేందుకు చాలా టెస్ట్ రన్లు నిర్వహించారు. చంద్రయాన్-3 మిషన్ 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్. అంటే ప్రొపల్షన్ స్పేస్క్రాఫ్ట్లో ఉండే రోవర్ ల్యాండర్ ను చంద్రుని పై 100కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుని కక్ష్య నుండి చంద్రున్ని, భూమిని, అధ్యయనం చేయడం కోసం ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక పరికరాన్ని అమర్చారు. చంద్రుని ఉపరితలం నివాస యోగ్యమో, లేదో తేల్చడం కోసం, చంద్రుని పై జరిగే మార్పులకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
ఇప్పటి వరకు చాలా దేశాలు చంద్రుని ఉత్తర ధ్రువం పై ఎన్నో పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం ఇప్పటిదాకా చంద్రుని పై ఎవరు అడుగుపెట్టని దక్షిణ దిశను చేరాలనే ప్రయత్నిస్తోంది. అక్కడ భారత జెండాను పెట్టనున్నారు. చంద్రయాన్–1 నుంచి చంద్రయాన్–3 వరకు దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ఇస్రో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు ప్రాంతంలో చంద్రయాన్–3 ల్యాండర్ను దించనున్నారు. యావత్ ప్రపంచం చంద్రయాన్ 3 కోసం ఎదురుచూస్తోంది.
