ఇటీవల జరిగిన మణిపూర్ ఘటన చాలా కలకలం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఆ నేరస్తులకి శిక్ష పడాలి అని ప్రజలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక బాధితురాలి భర్త మాట్లాడుతూ ఈ సంఘటనపై తన ఆవేదనని వ్యక్తం చేశారు.
హిందుస్థాన్ టైమ్స్ తెలుగు కథనం ప్రకారం, ఆయన ఒక కార్గిల్ యుద్ధ వీరుడు. ఒక సమయంలో కార్గిల్ యుద్ధంలో భారతదేశం తరపున పోరాడారు. భారత సైన్యంలోని అసోం రెజిమెంట్లో ఆయన సుబేదార్గా చేశారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. “మే 4వ తేదీన ఉదయం కొంతమంది వచ్చి మా గ్రామంపై దాడి చేశారు. అప్పుడు ఇళ్లని తగలబెట్టారు. అందరి ముందు ఇద్దరు మహిళలని తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు ఉన్నా కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ నిందితులని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నాను”.

“నేను దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను. శ్రీలంకలో ఉన్న ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో కూడా బాధ్యతలు నిర్వర్తించాను. దేశాన్ని కాపాడగలిగాను కానీ రిటైర్మెంట్ తర్వాత నా భార్యని, నా గ్రామస్తులని కాపాడుకోలేకపోయాను. దీనికి చాలా బాధగా ఉంది” అంటూ కంటతడి పెట్టుకున్నారు.

ఇదే ఘటనలో మరొక బాధితురాలి తల్లి కూడా ఈ విషయంపై తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “నా భర్తని నా కొడుకుని చంపేసి ఆ తర్వాత నా బిడ్డను తీసుకెళ్లారు. నా ఆశలన్నీ నా కొడుకు మీదే ఉండేవి. చాలా కష్టపడి నా కొడుకుని స్కూల్ కి పంపించాము. నా పెద్ద కొడుకుకి ఉద్యోగం లేదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. ఇంక మేము తిరిగి ఆ గ్రామానికి వెళ్ళము. వెళ్ళలేము కూడా”.

“మా ఇళ్ళని తగలబెట్టారు. మా పొలాలని కూడా నాశనం చేశారు. ఇంక అక్కడికి వెళ్లి నేను ఏం చేయాలి? మొత్తం గ్రామాన్నే తగలబెట్టేశారు. నా కుటుంబం భవిష్యత్తు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నాకు చాలా కోపంగా ఉంది. దేశంలోని తల్లిదండ్రులు అందరూ చూడండి. ఇది మా పరిస్థితి” అని ఆమె మాట్లాడారు. ఈ ఘటనలో ఉన్న నిందితులని శిక్షించాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : “ధోని” అన్న ఇంత దీనస్థితిలో ఉన్నారా..? బయోపిక్ లో ఆయన గురించి ఎందుకు ప్రస్తావించలేదు..?


తాము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న విషయం కోర్టుకు చెప్పడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తోన్న ఈ జంట అప్పటి నుండి కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ, అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు వారు పని చేసే దగ్గరికి వెళ్ళి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో సుమాయా పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు వారు తీసుకోలేదు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో సుమాయా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అఫిఫాను కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది.
అయితే వారు కోర్టు ఆర్డర్ పాటించకుండా తమకు టైమ్ కావాలని అడిగారు. ఆ తర్వాత జూన్ 10 రోజులకు అఫిఫాను కోర్టుకు ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు బెదిరిచడంతో అఫిఫా కోర్టులో సుమాయాతో కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. అలాగే తన తల్లిదండ్రులతో ఉండాలనుకున్నట్లు అఫిఫా చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అఫిఫా సుమాయాకు ఫోన్ చేసి, కోర్టు ముందు చెప్పిందంతా కావాలని మాట్లాడింది కాదని, తన తల్లిదండ్రులు వైద్య చికిత్స చేయించారని తెలిపింది.
వనజా కలెక్టివ్ సంస్థ ద్వారా సుమాయా పోలీసుల సహాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు. కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా బీబీసీకి వివరించారు. శారీరక సంబంధం కోసం మాత్రమే తాము కలిసి ఉండాలని అనుకుంటున్నామని అనేవారని, ఇలా ఆలోచించే వారితో మాట్లాడటం కూడా అర్థరహితం. తమను అర్థం చేసుకునే విధంగా వారిని మార్చలేం’’ అన్నారు. డాక్టర్లే మా బంధాన్ని అర్థం చేసుకోలేదని, సొసైటీ, తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారని సుమాయా, అఫిఫా చెప్పుకొచ్చారు.











శామీర్పేట్ కాల్పుల ఘటనలో నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ను ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు హాజరు పరచడం, రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు షాకింగ్ విషయాలు ఉన్నాయి.
ఆ తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఇద్దరు అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. మానసిక సమస్యలతో, ఒత్తిడితో ఇబ్బంది పడే వారికి స్మిత కౌన్సిలింగ్ ఇస్తుండేదని, ఈ క్రమంలోనే యాక్టర్ మనోజ్ కు స్మితతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ లో ఉన్న మనోజ్, స్మిత దగ్గరికి కౌన్సిలింగ్కు వచ్చేవాడు. అలా వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరు 3 సంవత్సరాలుగా పిల్లలతో కలిసి శామీర్ పేటలో ఉండే సెలబ్రిటీ విల్లాలో ఉంటున్నారు.
మనోజ్ తమన వేధిస్తున్నాడని స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి కంప్లైంట్ చేశాడు. సీడబ్ల్యూసీ వాళ్లు వారి తండ్రి సిద్ధార్థ్ను హైదరాబాద్ పిలిపించారు. సిద్ధార్థ్ దాస్ శనివారం పిల్లల కోసం సెలెబ్రిటీ విల్లాకు వెళ్ళాడు. సిద్ధార్థ్ను చూసిన స్మితా మనోజ్కి చెప్పడంతో ఆగ్రహించిన మనోజ్ ఏయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడు. గన్ చూసి భయపడిన సిద్ధార్థ్ బయటికి వచ్చి, డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మనోజ్ను అరెస్ట్ చేశారు. ఏయిర్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.