తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ గురి పెట్టింది. తాజాగా చోటు చేసుకున్న పవర్ పాలిటిక్స్ వేళ నేరుగా రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి కామెంట్స్ తో డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహార ఇంఛార్జ్ పార్టీ విధానం పైన స్పష్టత ఇచ్చారు. విధాన పరమైన నిర్ణయాలు,పార్టీ మేనిఫెస్టో హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. సీడబ్ల్యూసీలో చర్చించి తీసుకొనే నిర్ణయాలు మినహా వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండదని తేల్చేసారు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉందని స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ పార్టీ ఇమేజ్ కు దెబ్బ కాకుండా ఇతర నేతలను రంగంలోకి దించింది. రేవంత్ స్వయంకృతంతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ బీఆర్ఎస్ కు టెన్షన్ పెంచుతోంది. కాంగ్రెస్ ను ఎదుర్కోవటం బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. ఈ సమయంలో రేవంత్ వ్యాఖ్యలను అస్త్రంగా మలచుకొనే ప్రయత్నం చేసింది. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ విధానంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని గుర్తించింది. వెంటనే పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే పార్టీ వైఖరిని స్పష్టం చేసారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ప్రకటించారు. కాంగ్రెస్ విధానంలోనే ఉచిత విద్యుత్ ఉందని.. రైతులకు అన్ని వేళలా అండగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేసారు. తెలంగాణలోనూ రైతులకు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కొనసాగిస్తుందని..వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా పార్టీ వైఖరిలో మార్పు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి రేవంత్ రెడ్డి జిల్లాకే చెందిన వంశీచంద్ రెడ్డి ను పార్టీ రంగంలోకి దించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ విధానం ఏంటనేది వంశీచంద్ రెడ్డి వివరించారు. అమెరికా లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంది…ఉంటుందని చెప్పారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను ఇవ్వడంతో పాటు, రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తాం అని వివరించారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక పై కాంగ్రెస్ విధానం అందరికీ తెలిసిందేని రేవంత్ చేసిన సీతక్క సీఎం వ్యాఖ్యల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చర్చించి ఎవరికీ నాయకత్వం ఇవ్వాలో నిర్ణయిస్తారని వివరించారు.
బిఆర్ఎస్, బిజేపి లు కలిసి పనిచేసినా కాంగ్రెస్ పార్టీ యే అధికారంలోకి రాబోతుందని టీ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ తరువాత ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెబుతున్నారు. తెలంగాణా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను అందిస్తామని కాంగ్రెస్ నేతలు ముక్త కంఠంతో ప్రకటిస్తున్నారు. “ఇందిరమ్మ రైతు భరోసా” పధకం ద్వారా కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇస్తున్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన “రైతు డిక్లరేషన్”ను యధాతధంగా అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు . ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.





హిమాచల్ ప్రదేశ్లోని బియాస్, సట్లేజ్, రావి లాంటి నదులు ప్రమాదకర స్థాయిని ధాటి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ నదుల పై నిర్మించిన రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఆ రిజర్వాయర్ల గేట్లన్నింటినీ అధికారులు ఎత్తివేశారు. వాటి ప్రభావం వల్ల బియాస్, సట్లేజ్, రావి తీరప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. అక్కడ నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లక్ష మందికి పైగా ప్రజలను ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహంతో పలు పట్టణాలు కూడా సగం వరకు మునిగాయి. బిలాస్పూర్, కాంగ్రా, సోలన్, సిర్మౌర్, సిమ్లా, ఉనా, మండి, హమీర్పూర్, కుల్లు-మనాలి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురావడంతో కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ను ప్రకటించింది.
వర్షాలు ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాయని, అందువల్ల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఐఎండీ సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ 3 రోజులలో భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 72 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. నాలుగు వేల కోట్లు విలువ చేసే ఆస్తి నష్టం జరిగినట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ డిపార్ట్మెంట్ తెలిపింది.
అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తరహ ఘటన యూపీలోని కాన్పూరులో చోటు చేసుకుంది. కాన్పూరులో నివసించే అర్జున్ సింగ్, సవిత మౌర్యలు భార్యాభర్తలు. ఈ జంటకి 2017లో పెళ్లి జరిగింది. భార్యకు చదువు పట్ల ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అర్జున్ సింగ్, సవిత మౌర్యను అప్పులు చేసి మరి నర్సింగ్ చదివించాడు.
నర్సింగ్ పూర్తి అయిన తరువాత సవిత మౌర్యకు మెడికల్ డిపార్ట్మెంట్ లోనే గవర్నమెంట్ కాంట్రాక్టు జాబ్ వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలల తరువాత సవిత మౌర్య ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఇక అప్పటి నుండి భర్త అర్జున్ సింగ్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమె మరో గదిలో నిద్రపోతుండడంతో అర్జున్ సింగ్ భార్యను నిలదీశాడు. దాంతో సవిత భర్తను నల్లగా, పొట్టిగా ఉన్నవంటూ, నీలాంటి భర్తతో ఉండలేనని చెప్పడంతో అర్జున్ షాక్ అయ్యాడు.
సవిత అర్జున్ సింగ్ నుండి విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. కానీ అర్జున్ సింగ్ మాత్రం తనకు భార్య సవిత కావాలని పోరాడుతున్నారు. భార్య చదువుకు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, అప్పును కూలీ పనులు చేసుకుంటూ తీరుస్తున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. తనకు న్యాయం కావాలని అర్జున్ సింగ్ వేడుకుంటున్నాడు.
రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్తూ, ‘ఈ సంవత్సరం లోపం లేకుండా పూజలు అందుకుని, సంతోషంగా ఉన్నాను. కొంచెం ఆలస్యం అయినా వర్షాలు పడతాయని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 5 వారాల పాటు ముత్తైదులందరూ నన్ను భక్తిశ్రద్ధలతో పూజించుకోవాలి. నా దగ్గరికి వచ్చిన వారిని క్షేమంగా చుసుకునే భారం నాది. అయిదు వారాల పాటు సాక పోయండి. టెంకాయలను కొట్టి, నైవేద్యాలను సమర్పించాలి.
గతేడాది నాకు మాటిచ్చి ఎందుకు మరిచిపోయారు. మీకు కావాల్సిన బలాన్ని ఇచ్చాను. మీతోనే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయటపెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. అన్నిటినీ కడుపులో దాచుకుంటాను’ అని స్వర్ణలత పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యవాణి వినడం కోసం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బోనాల వేడుకలో భాగంగా ఉజ్జయిని మహంకాళి గుడికి లక్షలాది మంది భక్తులు వచ్చారని, రాత్రీ సమయంలో కూడా దర్శనాలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అనేక పార్టీల నాయకులు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారని వెల్లడించారు. భవిష్యవాణిలో అమ్మవారు బోనాలు వేడుక బాగా జరిగిందని చెప్పడం ఆనందకరం అని తెలిపారు. రంగం భవిష్యవాణి నేపథ్యంలో ఆలయంలో భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనం నిలిపివేశారు.
పాకిస్థాన్ మహిళ సీమా గులామ్ హైదర్ కు నోయిడాకు చెందిన సచిన్కు పబ్జీ గేమ్ ద్వారా పరిచయం కలిగింది. అయితే మహిళకు అప్పటికే పెళ్లి జరిగి, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. సీమా, సచిన్ పబ్జీలో నిత్యం చాటింగ్ చేసేవారు. వీరి పరిచయం తరువాత ప్రేమగా మారింది. దాంతో ప్రియుడు కోసం పెళ్లి చేసుకున్న భర్తను విడిచి పెట్టేందుకు సైతం సిద్ధ పడింది.
సీమా గులామ్ హైదర్ తన నలుగురు పిల్లలను తీసుకుని సచిన్ నివసించే ఉత్తరప్రదేశ్కు ప్రయాణం అయ్యింది. పాకిస్తాన్ నుండి నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి, ఉత్తరప్రదేశ్ చేరుకుంది. బస్సులో గ్రేటర్ నోయిడాకు వచ్చింది. ఆ తరువాత సచిన్ అక్కడే ఒక ఇల్లు రెంట్ కు తీసుకుని జీవించడం మొదలు పెట్టారు.
అయితే పాకిస్థాన్ మహిళ అక్రమంగా జీవిస్తున్నట్టు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సచిన్, సీమాను అదుపులోకి తీసుకున్నారు. తమకు కోర్టు పెళ్లి జరిగిందని, నలుగురు పిల్లలున్నట్లుగా వారు చెప్పారని అద్దెకు ఇల్లు ఇచ్చిన ఓనర్ బ్రిజేష్ పోలీసులకు వెల్లడించారు. అయితే సీమా కట్టు, బొట్టు చూస్తే, ఆమె పాకిస్తాన్ మహిళ అనే సందేహం రాలేదని అన్నారు.


బిహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవాడలో ఒక గ్రామానికి చెందిన యువకుడికి పెళ్లి జరిగింది. కానీ అతని భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో పనిమీద ఒక రోజు బయటకు వెళ్లిన భర్త రాత్రికి ఇంటికి రాలేదు. దాంతో ఆ భార్య ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లింది.
ఆమె వెళ్ళడం చూసిన స్థానికులు మరియు ప్రియుడి బంధువులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, చెట్టుకు కట్టేసికొట్టారు. తరువాతి రోజు ఊరిలోని గ్రామ పెద్దలందరు కలిసి పంచాయతీ పెట్టి, వారిద్దరినీ ఆ గ్రామం నుంచి బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ విషయం తెలిసి తిరిగి వచ్చిన ఆ యువతి భర్త, భార్యను ఏమి అనకుండా, కోపం తెచ్చుకోకుండా భార్యను, ఆమె ప్రియుడిని గుడికి తీసుకువెళ్లాడు.
ఆ తరువాత వారిద్దరికీ దండలు మార్పించి, వివాహం జరిపించాడు. ఈ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్య పోయారు. కొంత మంది అయితే ఆ భర్త అలా చేసినందుకు అతడిని తిట్టారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా గుళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు వంటి ప్రదేశాల్లో భిక్షాటన చేసేవారు ప్రతిరోజూ కనిపిస్తూ ఉంటారు. సరైన తిండి, బట్టలు లేనివారిని చూడగానే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఎవరికి తోచినంత వారు ఎంతో కొంత దానం చేస్తుంటారు. కటిక పేదరికంలో ఉన్నవారే అలా మారతారు. తమ పొట్ట నింపు కోవడం కోసం బిచ్చ మెత్తుకుంటూ బ్రతుకుతుంటారని అందరికి తెలుసు. అయితే అలా వచ్చిన డబ్బుతో కోటీశ్వరుడు అయినవారు ఉన్నారంటే ఆశ్చర్య పోతారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇండియాలోనే ఉన్నాడు.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ముంబైలో జీవిస్తున్న భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు. భరత్ జైన్ ముంబైలో నివసిస్తాడు. అతనికి రూ. 1.4 కోట్ల ఖరీదు అయిన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తన డబ్బును షాపుల్లో పెట్టుబడిగా పెట్టాడు. థానేలో 2 షాపులను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా అతనికి నెలకు 30వేల రూపాయల రెంట్ వస్తుంది. ఇక భారత్ జైన్ ఆస్తి విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజాగా లెక్కల ప్రకారం భరత్ జైన్ నెలవారీ ఆదాయం సుమారు లక్ష రూపాయలు.
2014 సంవత్సరం నాటికి భరత్ జైన్ భిక్షాటన ద్వారా ప్రతిరోజూ రూ. 2000 – 2500, నెలకు 75వేలు సంపాదించేవాడట. ఆర్థిక ఇబ్బందుల వల్ల భరత్ జైన్ చదువును కొనసాగించలేకపోయాడు. అతనికి పెళ్ళై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన పిల్లలను కాన్వెంట్ స్కూల్ లో చదివిస్తున్నాడు. భరత్ జైన్, అతని ఫ్యామిలీ పరేల్లో 1 BHK డ్యూప్లెక్స్ ఇంటిలో నివసిస్తున్నారు. తన ఫ్యామిలీలో మిగతావారు స్టేషనరీ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఇంట్లోవారు భిక్షాటన వదులుకోమని ఎంత చెప్పినా, భరత్ జైన్ వినకుండా అదే పనిని చేస్తున్నాడు.