హస్తసాముద్రిక జ్యోతిషశాస్త్రం మనిషి అరచేతిలోని రేఖలు ఆ వూయక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుపుతుంది. ఒక వ్యక్తి లైఫ్ లో విజయం సాధించి, కోటీశ్వరుడు కావాలంటే కృషితో పాటుగా అదృష్టం కావలసివస్తుంది. కానీ అదే సమయంలో కొందరికి పుట్టుకతోనే అదృష్టాన్ని వస్తుంది. అలాంటివారు ఏది అడగకుండానే అన్నింటినీ పొందుతారు.
అరచేతిలో ఉండే కొన్ని గుర్తులు ఆ వ్యక్తులను ధనవంతులుగా చేస్తుందని హస్తసాముద్రిక నిపుణులు చెబుతున్నారు. ధనవంతులు మాత్రమే కాకుండా జీవితంలో మరియు కెరీర్ లో కూడా మంచి విజయాలను సాధిస్తారట. మరి ధనవంతులుగా మార్చే ఆ గుర్తు గురించి ఇప్పుడు చూద్దాం..
మనిషి అరచేతిలోని రేఖలు అతని భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలో ఉండే ప్రతి రేఖకు ఒక ప్రాముఖ్యత ఉంది. అరచేతిలో ఉండే రక రకాల గుర్తులు, రేఖలు ఫ్యూచర్ ను ప్రభావితం చేస్తాయి. కొంతమంది అరచేతిలో చేప గుర్తు ఉంటుంది. దీనిని మీనరేఖ అని కూడా పిలుస్తారు. ఇక హస్తసాముద్రికంలో చేప గుర్తు ప్రముఖమైనదని చెబుతారు. మీనరేఖ అనేది చాలా అద్బుతమైన రేఖ.
మరి అరచేతిలో ఉండే చేపగుర్తు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మీనరేఖ అరచేతిలో ఏ ప్రదేశంలో ఉన్నా, మంచి యోగదాయకంగా ఉంటుంది. ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం యొక్క శుభ ఫలితాలు వస్తాయి. చంద్ర స్థానంలో మీనరేఖ ఉంటే మంచి ప్రేమకలవారు అవుతారు. శుక్రస్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి భార్య వస్తుంది. గురు స్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి విద్య లభిస్తుంది. అలాగే కుజ స్థానంలో మీనరేఖ ఉంటే మంచి యోగదాయకమైన ఉద్యోగం వస్తుంది.
బుధ స్థానంలో మీనరేఖ ఉంటే వ్యాపారంలో బాగుటుంది. ఈ విధంగా మీనరేఖ ఏ స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ విషయానికి లొంగిపోరు, ఈ గుర్తు అరచేతిలో ఉన్నవారు అన్ని విషయాలలో విజయం సాధిస్తారని హస్తసాముద్రిక నిపుణులు చెబుతున్నారు.
Also Read: మీ అరచేతి మీద M సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నప్పటి నుండి నోట్ల పై చాలా వార్తలు వస్తున్నాయి. అలా 500 రూపాయల నోట్లను కూడా ఉపసంహరించుకుంటున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఆర్బీఐ దాని పై స్పందించి, అది నిజం కాదని తెలిపింది.
ప్రస్తుతం స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలివనే వార్త నెట్టింట్లో వైరల్ అవడంతో ఆర్బీఐ తాజాగా వాటి గురించి క్లారిటీ ఇచ్చింది. జులై 27 ఇచ్చిన ప్రకటనలో ప్రస్తుతం ఉన్ననోట్లతో సమానంగానే స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ స్టార్ గుర్తు బ్యాంక్ సీరియల్ సంఖ్యలో ఉంటుంది. అయితే, ఇప్పుడు ముద్రిస్తున్న కొత్త నోట్లలో స్టార్ గుర్తు ఉండదు.
ఈ గుర్తుతో నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ముద్రిస్తుందంటే, ఆ నోట్లు ఇతర నోట్లను స్థానంలో వచ్చినవి లేదా రీప్రింటెండ్ అయిన బ్యాంక్ నోట్లుగా గుర్తించడం కోసమే. చిరిగిన, పాడైన నోట్ల ప్లేస్ లో ముద్రించే నోట్లకు మాత్రమే నంబర్ సిరీస్లో స్టార్ గుర్తును పెట్టామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
మారుతున్న టెక్నాలజీతో ప్రపంచం కొత్త మార్గాలలో వెళ్తోంది. నిత్యం ఎన్నో ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. ఇక సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సరికొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. దీనికి హైదరాబాద్కు చెందిన స్టార్ట్ అప్ కంపెనీ రిసైకల్ సహకారాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
ఇవి ఏం చేస్తాయంటే కస్టమర్ నుండి చెత్తను తీసుకుని, దానికి బదులుగా పెట్రోల్ను ఇస్తారు. హైదరాబాద్ లోనే ఫైలన్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఆయిల్ సంస్థ చైర్మన్, ఎస్ఎం వైద్య, హైదరాబాద్లో ప్రారంభించారు.
శ్రీ మీడియా మనీ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చెత్తతో ఫ్రీ పెట్రోల్ అనే విషయం గురించి తెలిపారు. అందులో “మీ దగ్గర ఉన్న పేపర్లు, ప్లాస్టిక్, మొబైల్స్, వైఫై మోడెమ్స్ కానీ, ల్యాప్టాప్, డ్రై వెస్ట్ లేదా వేట వెస్ట్ కానీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ లో ఉండే రిసైకల్ సంస్థ వారికి ఇస్తే మీ ముందే బరువు చూసి, పెట్రోల్ ఇస్తారు. 5 కేజీల చెత్తను ఇస్తే 680 పాయింట్స్ ఇస్తారు. ప్రతి పాయింట్ కి 1 ఎంఎల్. ఒకవేళ 10 కిలోల చెత్తను ఇస్తే, ఒక లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇలా ఇచ్చే ప్లేస్ ఎక్కడంటే, హైటెక్ సిటీ, ఐకియా, బేగం పేట్, మియాపూర్ లో ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు.




బంగారం ఖరీదు ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. ఎంత రేటు పెరిగినప్పటికీ, బంగారం కొనుగోళ్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. బంగారం నాణ్యత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోవాల్సి ఉంటుంది. బంగారం నాణ్యతను హాల్మార్క్ ద్వారా గుర్తించవచ్చు. హాల్ మార్క్ అంటే, ధృవీకరించబడిన బంగారం. విలువైన లోహంతో తయారుచేసిన వస్తువులో ఆ లోహం అనేది ఎంత శాతం ఉందో ఖచ్చితంగా నిర్ధారించిన తరువాత, అధికారికంగా స్టాంప్ వేయడాన్నే హాల్మార్కింగ్ అని అంటారు.
ఇది బంగారానికి సైతం వర్తిస్తుంది. హాల్ మార్కింగ్ విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (BIS) బంగారు వస్తువు యొక్క స్వచ్ఛతను మరియు క్వాలిటీని ధృవీకరించడానికి హాల్మార్క్ లైసెన్స్ ఇస్తుంది. 22 క్యారెట్ల అయితే 22K916, 18 క్యారెట్ల అయితే 19K750, 14 క్యారెట్ల అయితే 14K585 గుర్తులు ఉంటాయి. హాల్ మార్కింగ్ పై బంగారం స్వచ్ఛత నంబర్, తయారీ సంవత్సరం కూడా ఉంటాయి.
అలా ఇచ్చినప్పటికి కొందరు మోసం చేస్తూనే ఉన్నారు. అలాంటి అప్పుడు బంగారం నాణ్యమైనదో కాదో ఎలా తెలుసుకోవాలి అంటే బీఎస్ఐ కేర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని, దానిలో హాల్మార్క్ నెంబర్ ఎంటర్ చేసినపుడు ఆ వస్తువు ఎన్ని క్యారెట్స్ అనేది చూపిస్తుంది. దాని ద్వారా మీరు కొన్నబంగారు వస్తువు నాణ్యత ఏమిటో తెలుస్తుంది.





సంప్రదాయ ప్రకారంగా నలుపు రంగును కీడును శంకించే రంగుగా భావిస్తారు. నల్లని రంగు శని దేవుడికి ప్రీతికరమైన రంగు, కాబట్టి నల్లటి బట్టలు వేసుకోకూదని కొందరు చెబుతారు. సైన్స్ ప్రకారం చూసినట్లయితే నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల ఎండలో వెళ్ళినపుడు నలుపు రంగు దుస్తులు వేసుకుని వెళ్లీనట్లయితే అవి వేడిని ఎక్కువ గ్రహించడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దాంతో శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురి అవుతారు. అందుకే ఎండకాలంలో బయటికి వెళ్ళేప్పుడు నల్లటి బట్టలను వేసుకోవద్దు అని అంటారు.
సద్గురు నలుపు రంగు బట్టలు ఎందుకు ధరించకూడదనే విషయం గురించి ఈ విధంగా వివరించారు. ‘నలుపు ప్రతి దాన్ని గ్రహిస్తుంది. మీ చుట్టూ ఉన్న దానిని గ్రహించాలి అనుకునేటువంటి ప్రదేశంలో మీరు ఉన్నప్పుడు నల్లని రంగు బట్టలను ధరించాలి. అయితే మీ చుట్టూ ఏదైతే ఉందో దానిని మీరు గ్రహించవద్దు అనుకునేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు వేసుకున్నట్లు అయితే మీరు అక్కడ ఉన్న రకరకాల విషయాలను గ్రహించడం మొదలు పెడతారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్న మానసిక ఘర్షణలు దాదాపుగా ఇరవై, ఇరవై ఐదు శాతం ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలా ఎక్కువ సమయాలు అన్నీ రకాల పరిస్థితుల్లో నల్ల దుస్తుల్లో ఉండిపోవడం వల్ల, అలాంటి చోట్ల అలా ఉండకూడదు’ అని సద్గురు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియోను చూడండి.