టీమ్ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి తెలిసిందే. ప్రస్తుతం టీం లో చోటు కొల్పోయినప్పటికీ కూడా ఒకప్పుడు ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులు సృష్టించాడు. అభిమానులు ఆయనను గబ్బర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. మంచి ఇన్నింగ్స్ ఆడినప్పుడు శిఖర్ ధావన్ మీసం మేలేసే తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. అయితే శిఖర్ ధావన్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ హడావిడి ఉన్న నేపథ్యంలో ఆ పోస్ట్ ఇప్పుడు పెద్ద మంట రాజేసింది.
ఇంతకీ ఏంటా పోస్ట్ అనుకుంటున్నారా… మీకు 2019లో ఆడిన రోహిత్ శర్మ కావాలా? లేదా 2023లో ఆడుతున్న రోహిత్ శర్మ కావాలా…? అంటు పోల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇది రోహిత్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. తీరా పోల్ లో ఎవరు దేనికి ఎక్కువ ఓట్లు వేశారు అని చూస్తే 80% పైగా 2023 లో ఆడిన రోహిత్ శర్మ కావాలి అంటూ ఓటేశారు.

పలువురైతే 2019లో వరల్డ్ కప్ లో రోహిత్ బ్యాటింగ్ ను మర్చిపోగలమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2019లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ కూడా… రోహిత్ ఐదు సెంచరీలు చేసి వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికి ఆ రికార్డు రోహిత్ పేరున ఉంది. అయితే 2023 లో కూడా రోహిత్ కెప్టెన్ గా టీంని ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఒక సెంచరీ 3 అర్థ సెంచరీలతో 500 పైగా పరుగులు చేశాడు.

మీకు ఏ రోహిత్ శర్మ కావాలని అడిగితే అభిమానులు తేల్చుకోవడం కష్టమైన విషయమే. అసలు ఇలాంటి సమయంలో శిఖర్ ధావన్ ఎందుకు పోల్ క్రియేట్ చేశాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా రోహిత్ శర్మ ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా విజృంభించి ఆడి ముందుండి టీం ని నడిపిస్తూ వరల్డ్ కప్ సాధించాలని యావత్ భారతదేశం అంతా కోరుకుంటుంది. కాగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
Also Read:రోహిత్ గిల్ని ఎందుకు వెనక్కి పిలిచాడు?









ఈ దశలో మైదానంలో భారత ఆటగాళ్లకు డ్రింక్స్ ఇవ్వడానికి వచ్చిన కిషన్, మిచెల్ కాలును లాగుతూ ఉపశమనం కలిగించాడు. సాధారణంగా ప్రత్యర్థి ప్లేయర్లు ఇలా చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కిషన్ మాత్రం మ్యాచ్ లో లేకున్నా మిచెల్ కు సహాయం చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.


అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పటికే పలువురు ప్రిడిక్షన్ లు స్టార్ట్ చేస్తున్నారు. సెంటిమెంట్లు ప్రకారం కొందరు, జాతకాల ప్రకారం కొందరు గెలిచేది ఈ టీం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పండిట్ జగన్నాథ్ గురూజీ తన ఆస్ట్రాలజీని ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా టీం జాతకంతో పోలిస్తే ఇండియా టీం జాతకం బలంగా ఉందని అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా టీం లో అది కనిపిస్తుందని, ఉత్సాహం, ఆనందం, బలం కలగలిపి ఇండియా టీం ఈ కప్పును సొంతం చేసుకుంటుందని చెప్పారు…
ఇక రోహిత్ శర్మ జాతకం కూడా అద్భుతంగా ఉందని 2011లో కెప్టెన్ ఎంఎస్ ధోని వరల్డ్ కప్ సాధించినట్లుగానే 2023 లో రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పారు. అలాగే మిగతా టీం ప్లేయర్ లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,గిల్, సిరాజ్, బూమ్రా, షమీ ఇలా అందరి ప్లేయర్ ల జాతకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ జాతకం కూడా బాగానే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో పోలిస్తే అంత ఉత్సాహంగా లేదని అన్నారు.







