తాజాగా భారత్ రెస్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అతనికి పోటీగా కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అనిత షియోరాన్ ఓటమి పాలయ్యారు.
టాప్ రెజలర్లు అందరూ ఆమెకే మద్దతు ప్రకటించినప్పటికీ ఓటమి పాలవడం విశేషం. మొత్తం 47 ఓట్లతో గాను సంజయ్ సింగ్ కి 40 ఓట్లు పోలు అయ్యాయి.

తమని వేధించాడని మహిళా రెజలర్లు ఆరోపణలు చేసిన బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడే అధ్యక్షుడుగా ఎన్నికవ్వడం వారిని కలచివేస్తుంది. ఈ విషయం పైన భారత్ రెజలర్ సాక్షి మాలిక్ స్పందించారు. తాను రెజ్లింగ్ క్రీడను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. తమని వేధించిన బ్రిజ్ భూషణ్ సింగ్ కి వ్యతిరేకంగా 40 రోజులు పాటు రోడ్డు మీద పోరాటం చేశామని, తమకి మద్దతుగా దేశమంతా ముందుకు వచ్చిందని అలాంటి వ్యక్తికి చెందినవారు ఎన్నికల్లో గెలుపొందడం తమని మానసికంగా కలచివేస్తుంది అని చెప్పుకొచ్చారు.

తాము మద్దతు ఇచ్చిన వ్యక్తి ఓడిపోవడంతో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశం నుండి కన్నీటి పర్యంతమై వెళ్ళిపోయారు.ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళ రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.దీనిపై రెజ్లర్లు అందరూ రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసినది దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.



గత సీజన్ ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన మనీష్ పాండే ఐపీఎల్ 2024 వేలంలో కనీస ధర యాబై లక్షలకు కోల్కతా జట్టు కొనుగోలు చేసింది. మొదటి రౌండ్లో వేలంలో ఉన్న పాండేను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. దాంతో అతను రెండోసారి వేలానికి వచ్చాడు. ఆ వేలంలో కేకేఆర్ పాండేని కనీస ధరకు కొనుగోలు చేసింది.
2008 ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో మనీష్ పాండేను ముంబై ఇండియన్స్ కనీస ధర ఆరు లక్షలకు సొనటం చేసుకుంది. ఆ తర్వాత, 2009లో పందెను ఆర్సీబీ రూ. 12 లక్షలు కొనుగోలు చేసింది. ఆ జట్టు తరుపున ఆడుతున్నప్పుడు సెంచరీ చేసి, ఐపీఎల్ లో సెంచరీ చేసిన మొదటి ఇండియన్ గా నిలిచాడు. ఆ తర్వాత పూణే వారియర్స్ రూ. 20 లక్షలు కొనుగోలు చేయగా, తరువాత, పాండే ఐపీఎల్ 2011, 2012, 2013 సీజన్లకు పూణే జట్టు తరపున ఆడాడు. 2014 లో కేకేఆర్ రూ. 1.70 కోట్లుకు సొంతం చేసుకుంది. ఆ ఏడాది విజేతగా కేకేఆర్ నిలవడంలో పాండే కీలకంగా మారాడు.
కేకేఆర్ పాండేని 2018 సీజన్కు ముందు రిలీజ్ చేసింది. దీంతో సన్ రైజర్స్ రూ.11 కోట్ల భారీ రేటుకు పాండేను కొనుగోలు చేసింది. మూడు సీజన్లలో సన్రైజర్స్ తరఫున ఆడినా పాండే అంతగా రాణించలేకపోయాడు. దాంతో అతను ఐపీఎల్-2022 వేలంలోకి వచ్చాడు. అందులో లక్నో జట్టు రూ.4.60 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడ కూడా పెద్దగా రాణించకపోవడంతో, ఐపీఎల్-2023 వేలంలోకి వెళ్ళాడు. అందులో ఢిల్లీ జట్టు రూ.2.40 కోట్లకు సొంతం చేసుకోగా, పాండే ఆ ఛాన్స్ ని ఉపయోగించుకోలేదు. ఈసారి అతన్ని కొనడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. చివరికి కేకేఆర్ కనీస ధరకు కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ వేలం డిసెంబర్ 19న దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం అయ్యింది. ఈ వేలంలో 214 మంది భారతీయ ఆటగాళ్లు, 119 విదేశీ ఆటగాళ్లతో కూడిన మొత్తం 333 మంది ఆటగాళ్లు 77 స్లాట్ల కోసం పోటీపడ్డారు. అయితే దుబాయ్ లో నిర్వహించిన ఈ వేలంకు మల్లికా సాగర్ నిర్వాహకురాలుగా వ్యవహరించారు. అయితే ఐపీఎల్ వేలం నిర్వాహకురాలుగా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి.
మల్లికా సాగర్కు వేలం నిర్వహించడంలో చాలా అనుభవం ఉంది. గతంలో ఆమె మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వాహకురాలుగా వ్యవహరించింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2003, 2024 సీజన్లతో పాటుగా, ఆమె కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఆక్షన్స్ కూడా నిర్వహించారు. ఆమె వేలం నిర్వహించిన తీరు పై పెద్ద ఎత్తున్న ప్రశంసలు వచ్చాయి. దాంతో ఆమెను ఐపీఎల్ వేలంకు సెలక్ట్ చేశారు.
ఆమె ముంబైకి చెందిన వ్యక్తి. ఆమె ఆర్ట్ హిస్టరీ స్టడీస్ ను ఫిలడెల్ఫియాలో బ్రైన్ మావర్ కళాశాలలో పూర్తి చేసింది. 2001లో 26 సంవత్సరాల వయసులో వేలం సంస్థ క్రిస్టీస్లో మల్లిక కెరీర్ను మొదలుపెట్టింది. క్రిస్టీస్ లో మల్లికా సాగర్ తొలి ఇండియన్ ఆక్షనీర్ గుర్తింపు పొందింది. మల్లికా తన 22 ఏళ్ళ అనుభవంలో అనేక వేలంలు నిర్వహించింది. సమకాలీన భారతీయ ఆర్ట్ వేలంను నిర్వహించిన మొదటి వ్యక్తి మల్లికనే. క్రికెట్ వేలం గురించి ఆక్షనర్ హ్యూ ఎడ్మీడ్స్ వేలం వీడియోలు చూసి నేర్చుకున్నట్లుగా మల్లికా సాగర్ తెలిపారు.
ఐపీఎల్ వేలం ఎప్పడూ సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతి వేలంలోనూ గత రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది. అలాగే ఈసారి కూడా గత వేలం రికార్డులను బద్దలు కొట్టింది. గత వేలం అత్యధిక ధర రికార్డును ఈసారి ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు బ్రేక్ చేశారు. కోల్కతా రూ. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ను సొంతం చేసుకోగా, సన్రైజర్స్ రూ. 20.50 కోట్లకు కమిన్స్ను సొంతం చేసుకుంది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ను ఫ్రాంఛైజీలు కోట్లు పోసి సొంతం చేసుకున్నాయి.
వారిలో ఒకరు శుభమ్ దూబే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శుభమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో రాత్రికి రాత్రే దూబే కోటీశ్వరుడిగా మారాడు. దూబే విదర్భ జట్టు తరుపున ఆడతాడు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన దూబే పవర్ఫుల్ లెఫ్టాండర్ మరియు మంచి ఫినిషర్. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ టోర్నీలో అద్భుతంగా ఆడిన శుభమ్ దూబే పేరు మారుమ్రోగింది. దాంతో ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు దూబే కోసం పోటీ పడ్డాయి. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ రూ. 5.80 కోట్లకు దక్కించుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫామెన్స్ జుబిన్ భరూచా శుభమ్ దూబే గురించి మాట్లాడుతూ, విదర్భ నుంచి వచ్చిన దూబే లైఫ్ లో ఉన్న కష్టాలు, క్రికెటర్ యశస్వి జైశ్వాల్కు వంటివే అని అన్నారు. శుభమ్ దూబే వద్ద ఈ ఏడాది కనీసం బ్యాట్ కొనడానికి కూడా డబ్బు లేదని చెప్పినట్లుగా వెల్లడించాడు. వేలంలో అతడిని కొనడానికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. భరూచా, చెప్పినట్లుగానే రాజస్థాన్ రాయల్స్ దూబేను కొనుగోలు చేసింది.




