Home Off Beat సరోగేట్ యాడ్స్ తో కంపెనీలు జనాన్ని ఎలా మోసం చేస్తుంటాయో తెలుసా.? అంటూ ఓ యూట్యూబర్ చెప్పిన షాకింగ్ విషయాలు.!

సరోగేట్ యాడ్స్ తో కంపెనీలు జనాన్ని ఎలా మోసం చేస్తుంటాయో తెలుసా.? అంటూ ఓ యూట్యూబర్ చెప్పిన షాకింగ్ విషయాలు.!

by Megha Varna

Article sourced from: FACTS 4 U youtube channel

కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను ప్రచురించినప్పుడు హానికరమైన పదార్థాలకు బదులుగా వేరే ప్రోడక్ట్స్ ను చూపిస్తారు. అయితే అందరికీ గుర్తొచ్చేవి మాత్రం హానికరమైనవే. ఉదాహరణకు పాన్ మసాలా వంటివాటిని అడ్వర్టైజింగ్ చేసినప్పుడు మౌత్ ఫ్రెష్నర్స్ గా సూచిస్తారు. ఈ రకమైన అడ్వర్టైజింగ్ ను సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు.

సరోగేట్ ఆడ్స్ ఉన్నంత వరకూ ఎలాంటి హానికరమైన పదార్థాలను రద్దు చేయలేమని facts 4 u అనే యూట్యూబ్ ఛానల్ వారు భావిస్తున్నారు. ఈ పద్ధతి ప్రస్తుతం చాలా సాధారణమైపోయింది. హానికరమైన పదార్థాలను డైరెక్ట్ గా అడ్వర్టైజింగ్ చేయకుండా ఇండైరెక్ట్ గా వాటి గురించి చెప్పడమే సరోగేట్ అడ్వర్టైజింగ్. మన భారతదేశంలో టొబాకో మరియు ఆల్కహాల్ ను అడ్వర్టైజింగ్ చేయడం ఇల్లీగల్. అయితే చట్టప్రకారం అడ్వర్టైజింగ్ చేయడం కోసం కొన్ని కంపెనీలు పొగాకు లేకుండా పాన్ మసాలాను తయారు చేసి, విడివిడిగా అమ్ముతున్నారు.

Delhi Govt's Compliance Notice to Ajay Devgn Over Pan Masala Ad

పైగా అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు పొగాకు లేనిది ప్రచురిస్తున్నారు. పొగాకు వల్ల చాలా శాతం మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. అందుకే వీటిని ప్రభుత్వం నిషేధించడం జరిగింది. అందుకోసం గవర్నమెంట్ చాలా చట్టాలు తేవడానికి ప్రయత్నించింది. అయినా ఎటువంటి ఉపయోగం లేదు.

Pan masala ads featuring celebrities is violation of code, says ASCI - The Hindu BusinessLine

సరోగేట్ ఆడ్స్ ఉన్నంత వరకూ ఎలాంటి హానికరమైన పదార్థాలను రద్దు చేయలేమని facts 4 u అనే యూట్యూబ్ ఛానల్ వారు భావిస్తున్నారు. అయితే అటువంటి అడ్వటైజ్మెంట్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి, సరోగేట్ ఆడ్స్ కు సంబంధించి వారు ప్రచురించిన వీడియోను చూడండి.

watch video:

You may also like