ఆ యాడ్స్ ని గ్రౌండ్ పై పెయింట్ వేయరా.? దీనివెనకాల ఇంత పెద్ద కథ ఉందా.?

ఆ యాడ్స్ ని గ్రౌండ్ పై పెయింట్ వేయరా.? దీనివెనకాల ఇంత పెద్ద కథ ఉందా.?

by Mohana Priya

Ads

క్రికెట్ లో ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అది ఎలాగంటే. ఎంతో మంది తమ వ్యాపారాలకు బాగా ప్రమోషన్ చేయడానికి క్రికెట్ మ్యాచ్ ని ఒక దారిగా ఎంచుకుంటారు.

Video Advertisement

అందుకే వాళ్లు ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి అనుకున్న వాళ్లు, అలాగే మ్యాచ్ ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ బ్రాండ్ నేమ్స్ క్రికెట్ ఫీల్డ్ మీద, అలాగే సైడ్స్ కి రాసి ఉంటాయి.

ఇదంతా మనం గమనించే ఉంటాం. అయితే, మనలో చాలా మందికి అసలు ఫీల్డ్ మీద పేర్లు పెయింటింగ్ సహాయంతో మనకు చూపిస్తారా? లేదా ఇంకేదైనా టెక్నాలజీ వాడతారా? అనే అనుమానం వచ్చి ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఫీల్డ్ మీద పేర్లు కనిపించేలా చేయడానికి కొన్ని టెక్నిక్స్ వాడతారు. వరల్డ్ కప్ లో, ఇందుకు సంబంధించిన రూల్స్ ఐసీసీ ఫ్రేమ్ చేస్తారు.

అందులో ఒకటి ఏంటంటే, త్రీడీ పెయింటింగ్. అంటే నిజమైన గడ్డి లాగా కనిపించే టర్ఫ్ మీద అడ్వటైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. ఇంకొకటి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని అది ఫీల్డ్ మీద పెట్టి దానిపై పెయింట్ చేస్తారు. ఇదంతా కెమెరా యాంగిల్ కి అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. కెమెరా యాంగిల్ ప్రకారం మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం గ్రౌండ్ మీద డ్రా చేస్తారు. అలాగే పెయింట్స్ వల్ల కానీ, స్ప్రే వల్ల కానీ ఫీల్డ్ లో ఉన్న గడ్డికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదు అని కూడా రూల్స్ లో మెన్షన్ చేశారు.

మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ పెయింట్ సులభంగా రిమూవ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కెమెరా యాంగిల్స్ అనుగుణంగా లేకపోతే ఈ టెక్నిక్ వాడలేరు. అప్పుడు గ్రౌండ్ కి ఆపోజిట్ వైపు నుండి, హై ఎండ్ ప్రొజెక్టర్స్ సహాయంతో అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. కానీ ప్లేయర్స్ వాటి మీద నుండి నడవడం లాంటివి అవుతుంటాయి.

అందుకే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో, ఏఐ బేస్డ్ సాఫ్ట్ వేర్ సహాయంతో రియల్ టైం ఎడిటింగ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. గ్రౌండ్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. కానీ మనకి టీవీలో చూస్తున్నప్పుడు మాత్రం అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. దాంతో ప్లేయర్స్ నడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

watch video :


End of Article

You may also like